Cricket News: మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి ప్రాణం విడిచి..!

సిక్స్‌లతో అదరకొట్టిన ఓ వ్యక్తి మైదానంలో హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది.

Updated : 03 Jun 2024 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాటింగ్‌ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన కొందరు వ్యక్తులు స్థానిక మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తి కాసేపు చురుగ్గా ఆడాడు. సిక్స్‌లతో అదరగొట్టాడు.

మరో బంతిని ఎదుర్కొనే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా నిలుచున్నచోటే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన సహచర ఆటగాళ్లు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతడు ప్రాణాలు కోల్పోవడంతో మైదానంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వ్యక్తి గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. మృతుడి వివరాలు  ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గెలిచినా.. ఓడినా పాక్‌ ఫ్యాన్స్‌ దృష్టంతా మనమీదే: యువరాజ్‌ సింగ్

గతంలోనూ మైదానంలో క్రికెట్‌ ఆడుతూ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ముంబయిలోని ఓ ప్రాంతంలో 50 ఏళ్లకు పైబడిన వారికి నిర్వహించిన టోర్నీలో ఒక ఆటగాడి తలకు బంతి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని