IND vs PAK: గెలిచినా.. ఓడినా పాక్ ఫ్యాన్స్ దృష్టంతా మనమీదే: యువరాజ్ సింగ్
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ప్రయాణం జూన్ 5న ప్రారంభం కానుంది. ఆ రోజే ఐర్లాండ్తో తలపడనుంది. ఇక జూన్ 9న దాయాది దేశం పాక్ను ఢీకొట్టనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కప్ టోర్నీల్లో పాకిస్థాన్పై భారత్దే ఆధిపత్యం. కేవలం ఒక్కసారి మాత్రమే పాక్ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup 2024) ఇరుజట్లూ ఒకే గ్రూప్లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ వేదికగా (IND vs PAK) తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రెండు టీమ్ల అభిమానులు గెలుపైనా.. ఓటమినైనా ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం యువీ టీ20 ప్రపంచకప్ అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే.
‘‘భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే భావోద్వేగంతో కూడుకున్నదని అందరికీ తెలుసు. ఒకవేళ మనం గెలిస్తే.. మనవరకే సంబరాలు చేసుకుంటాం. ఓడితే మరోవిధంగా బాధపడతాం. కానీ, మనం గెలిచినా.. ఓడినా పాక్ అభిమానులు మాత్రం మనపైనే పడతారు. అదే ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్కున్న వ్యత్యాసం. మ్యాచ్రోజు ఎవరైతే ఎమోషన్లను నియంత్రించుకోగలరో.. వారిదే 100 శాతం విజయం సాధించే అవకాశం ఉంటుంది. కేవలం గేమ్పైనే దృష్టి పెట్టాలి. గత కొన్నేళ్లుగా పాక్ కంటే భారత్కే మెరుగైన రికార్డు ఉంది. ఇప్పుడు దానిని కొనసాగిస్తామని అనుకుంటున్నా’’ అని యువీ వ్యాఖ్యానించాడు.
విరాట్ మరో ట్రైనింగ్ సెషన్స్ మిస్!
జట్టుతోపాటు కాకుండా ఆలస్యంగా అమెరికాకు చేరిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బంగ్లాతో వార్మప్ మ్యాచ్ ఆడలేదు. ఆదివారం ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ట్రైనింగ్ సెషన్స్కు కోహ్లీ హాజరవుతాడని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన (741) విరాట్ ఆరెంజ్ క్యాప్ను అందుకొన్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కోసం అడుగుపెట్టే సమయంలోనే.. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్