Marcus Stoinis: టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నైపై సెంచరీతో లఖ్నవూ విజయం సాధించడంలో మార్కస్ స్టాయినిస్ (124*) కీలక పాత్ర పోషించాడు. గత నెలలోనే ఆసీస్ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన అతడు.. ఇప్పుడీ శతకంతో తాను టీ20 ప్రపంచ కప్ రేసులో ఉన్నట్లు జట్టు సెలక్టర్లకు సందేశం పంపినట్లైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎక్కువగా సెకండ్ డౌన్ లేదా మిడిల్ ఆర్డర్లో వచ్చిన స్టాయినిస్.. తొలిసారి వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి అదరగొట్టాడు. చెన్నైతో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడాడు.
‘‘టీ20ల్లో నాకంటే అద్భుతమైన ఓపెనర్లు చాలా మంది మా జట్టులో ఉన్నారు. ప్రస్తుత సీజన్లో నేను తొలిసారి వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చా. చెన్నై బౌలర్లలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకున్నాం. మరికొందరి బౌలింగ్లో ఆచితూచి ఆడాం. ఓ దశలో నేను బౌండరీలు కూడా కొట్టలేకపోయా. ఆ సమయంలో పూరన్ దూకుడుగా ఆడాడు. టీ20 క్రికెట్లో చాలా మార్పులొచ్చాయి. భారీ స్కోర్లు నమోదవుతూనే ఉన్నాయి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో బౌలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ను మిస్ అయినందుకు బాధేం లేదు. నాకు ఇప్పటికీ ఆసీస్ హెడ్ కోచ్తో మంచి సంబంధాలే ఉన్నాయి. మరోసారి జాతీయ జట్టు కప్ సాధించడంలో నా భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నా’’ అని స్టాయినిస్ తెలిపాడు. సెంచరీ చేసిన స్టాయినిస్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.
14 రన్రేట్తో పరుగులు చేయాలని తెలుసు: హుడా
‘‘నేను క్రీజ్లోకి వచ్చే సమయానికి మ్యాచ్ రసవత్తరంగా మారింది. ప్రతి ఓవర్లో కనీసం 14 పరుగులు చేయాలి. ఎటాకింగ్ గేమ్కే ప్రాధాన్యం ఇవ్వాలి. మరోవైపు స్టాయినిస్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడేశాడు. వీరుడిలా రెండో ఓవర్ నుంచి క్రీజ్లో ఉండటం అద్భుతం. మ్యాచ్లో విజయం సాధిస్తామనే నమ్మకం 100 శాతం మాలో ఉంది’’ అని దీపక్ హుడా వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ విశేషాలు మరికొన్ని..
- ఐపీఎల్లో లక్ష్య ఛేదన సందర్భంగా ఓ బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు స్టాయినిస్(124*)దే. అంతకుముందు చెన్నైపైనే (2011) పంజాబ్ బ్యాటర్ పాల్ వాల్తాటి 120* పరుగులు చేశాడు.
- లఖ్నవూ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో బ్యాటర్ స్టాయినిస్. ముంబయిపై 2022లో క్వింటన్ డికాక్ 140* పరుగులతో అజేయంగా నిలిచాడు.
- చెపాక్లో 200+ స్కోర్లలో అత్యధిక టార్గెట్(211)ను ఛేదించిన జట్టుగా లఖ్నవూ నిలిచింది. అంతకుముందు బెంగళూరుపై (2012లో) చెన్నై 206 పరుగులను ఛేదించింది.
- ఐపీఎల్లో లఖ్నవూ సాధించిన రెండో అత్యధిక లక్ష్య ఛేదన కూడా ఇదే కావడం విశేషం. గతేడాది బెంగళూరుపై 213 పరుగుల టార్గెట్ను ఛేదించి లఖ్నవూ విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..