Mary Kom: ‘నాకు మరో అవకాశం లేదు’: ఒలింపిక్స్ బాధ్యతల నుంచి వైదొలిగిన మేరీకోమ్
Mary Kom: పారిస్ ఒలింపిక్స్ కీలక బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దిల్లీ: ప్రపంచ ఛాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ (Mary Kom) కీలక ప్రకటన చేశారు. వచ్చే పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)కు భారత్ తరఫున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మరో అవకాశం లేదని మేరీ కోమ్ వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ను చెఫ్ డి మిషన్గా నియమిస్తూ మార్చి 21న భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత బృందానికి ఆమె లాజిస్టికల్ ఇన్ఛార్జ్గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు.
‘వీడ్కోలు’ ఆలోచనే లేదు.. అప్పటివరకు విశ్రమించేదే లేదు: రోహిత్ శర్మ
‘‘ఈ దేశానికి సాధ్యమైనంతవరకు సేవ చేయడం నేను గౌరవంగా భావిస్తా. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రతిష్ఠాత్మక బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతున్నా. అందుకే ఆ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. మరో అవకాశం లేకుండాపోయింది. నా దేశం తరఫున ఒలింపిక్స్లో పోటీపడుతున్న అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటా’’ అని మేరీ కోమ్ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై పీటీ ఉష స్పందించారు. దిగ్గజ బాక్సర్ ఈ బాధ్యతల నుంచి వైదొలగడం బాధాకరమన్నారు. అయితే, ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే మేరీ కోమ్ స్థానంలో కొత్త వారిని నియమిస్తామని వెల్లడించారు.
41 ఏళ్ల మేరీ కోమ్ గురించి ఇటీవల రిటైర్మెంట్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని ఆమె కొట్టిపారేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్కు వీడ్కోలు పలకాలనుకోవడం లేదని, ఫిట్నెస్పై దృష్టిపెడుతున్నానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు