IPL 2024: సీఎస్కేకు షాకింగ్ న్యూస్.. పతిరణ నాలుగైదు వారాలపాటు దూరం!
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్కు అందుబాటులో ఉండని సీఎస్కే పేసర్ పతిరణ మరికొద్ది రోజులపాటు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో వారం రోజుల్లోపే ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్ ప్రారంభం కానున్న వేళ.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆ జట్టు యువ పేసర్ మతీశా పతిరణ గాయం కారణంగా దాదాపు నాలుగైదు వారాలపాటు మైదానానికి దూరం కానున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం కష్టమేనని సీఎస్కే వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో మరికొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. మార్చి 6న బంగ్లాదేశ్తో టీ20 మ్యాచ్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. తన పూర్తి ఓవర్ల కోటాను కూడా వేయలేదు.
సీఎస్కే తరఫున గతేడాది కీలక పాత్ర పోషించిన పతిరణ దూరం కావడం ఆ జట్టుకు నష్టమేనని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఐపీఎల్ 2023 సీజన్లో 12 మ్యాచులకుగాను 19 వికెట్లు తీశాడు. ‘‘తొడ కండరాలు పట్టేయడంతో బంగ్లాతో మ్యాచ్కు దూరమైన పతిరణ సమస్య తీవ్రమైందే. అతడు కోలుకోవడానికి కనీసం ఐదు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో అతడు ఎప్పుడు జట్టులో చేరతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టమే’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీఎస్కే జట్టులోని ఓపెనర్ డేవన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. తొలి సగం మ్యాచ్లకు అందుబాటులో ఉండడని ఇప్పటికే సీఎస్కే వెల్లడించింది.
విరామం తీసుకుంటే కోహ్లీని ఆపడం కష్టం: కైఫ్
‘‘విరాట్ కోహ్లీ గత రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్లో అఫ్గానిస్థాన్పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడు. ప్రతీ మ్యాచ్లో పరుగులు ఎలా రాబట్టాలో అతడికి తెలుసు. వన్డే ప్రపంచకప్లో టాప్ స్కోరర్. విరాట్ ప్రత్యేకత ఏంటంటే.. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదు. కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారు. కోహ్లీ తీరు దానికి భిన్నం. మరింత ప్రమాదకరంగా ఆడతాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే విరాట్ కీలకం’’ అని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!