Mayank Yadav: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అదే నా లక్ష్యం: మయాంక్
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ యువ సంచలనం మయాంక్ యాదవ్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో అదరగొట్టాడు.
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు (Bengaluru)ను తన సొంతమైదానంలో ఓడించి ఈ మెగా టోర్నీలో లఖ్నవూ (Lucknow) రెండో విజయాన్ని నమోదు చేసింది. యువ ఆటగాడు మయాంక్ యాదవ్ (Mayank Yadav) సంచలన బౌలింగ్తో బెంగళూరును వణికించాడు. తొలుత డికాక్ (81), పూరన్ (40) చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి లఖ్నవూ 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరును 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూల్చింది. మహిపాల్ లోమ్రోర్ (33) టాప్ స్కోరర్. రజత్ పటీదార్ (29), కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేశారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. లఖ్నవూ బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, నవీనుల్ హఖ్ 2, యశ్ ఠాకూర్, స్టోయినిస్, సిద్ధార్థ్ తలో వికెట్ తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
దేశానికి ఆడడమే అంతిమ లక్ష్యం..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన అనంతరం మయాంక్ మాట్లాడాడు. ‘‘వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది. రెండు మ్యాచుల్లోనూ మేము గెలిచాం. ఎప్పటికైనా దేశానికి ఆడడమే నా అంతిమ లక్ష్యం. నా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించానని అనుకుంటున్నా. కామెరూన్ గ్రీన్ వికెట్ను తీసినందుకు ఎంతో సంతోషించాను. వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, సరిపడ నిద్ర, శిక్షణ చాలా అవసరం. వేగంగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్పై నిరంతరం శ్రద్ధపెడుతున్నాను’’ అని మయాంక్ పేర్కొన్నాడు.
156.7 కి.మీ బౌలింగ్తో టాప్ 4కి..
ఆడిన తొలి మ్యాచ్లోనే సంచలన బౌలింగ్తో సర్వత్రా ప్రశంసలు అందుకున్న మయాంక్.. రెండో మ్యాచ్లోనూ అలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. ఫలితంగా వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లకు ఎంపికయ్యాడు. 4 ఓవర్లు వేసిన అతడు కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లోనూ గంటకు 150 కి.మీ వేగంతో బంతులేసిన మయాంక్.. ఒక బంతిని 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో టాప్ 4కి చేరుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి