Mayank Yadav: అవకాశం అప్పుడే రావాల్సింది.. భారత జట్టులోకి మయాంక్ ఎంట్రీపై కోచ్ దేవేందర్
ఐపీఎల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కుర్రాడు మయాంక్ యాదవ్. నిలకడగా 145 కి.మీ. వేగంతో బంతులను విసిరే అతడు ఏకంగా ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బాల్ను సంధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా మయాంక్ యాదవ్ నిలిచాడు. లఖ్నవూకు ఆడుతున్న ఈ యువ క్రికెటర్కు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనే అవకాశం రావాల్సిఉందట. అయితే, గాయం కారణంగా అతడిని పరిగణనలోకి తీసుకోలేదని మయాంక్ క్లబ్ కోచ్ దేవేందర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే మంచి ప్రదర్శన చేసిన మయాంక్ బౌలింగ్ను పరిశీలించాలని టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్కు దేవేందర్ విజ్ఞప్తి చేశాడు.
‘‘జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అదే. చీఫ్ సెలక్టర్ను మెప్పించాలని.. జాతీయజట్టులోకి రావాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు. మయాంక్ ఫిట్గా ఉండాలని.. నాణ్యమైన పేస్ సంధించాలని దేవుడిని ప్రార్థించా. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు కోసం మయాంక్ను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ సమయంలో గాయం తిరగబెట్టడంతో అవకాశం చేజారింది. గుండె పగిలినంత పనవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయితే, అతడు అద్భుతమైన ఆటగాడే కాకుండా దృఢ సంకల్పం కలిగిన కుర్రాడు. అథ్లెటిక్ బాడీ. నిరంతరం శ్రమించే ఆటగాడు. తప్పకుండా సుదీర్ఘకాలం భారత జట్టుకు సేవలు అందించగల సత్తా ఉంది’’ అని దేవేందర్ తెలిపారు.
దేవేందర్ సోనెట్ క్లబ్ను నిర్వహిస్తున్నారు. మయాంక్ను దిల్లీ కెప్టెన్ రిషభ్పంత్, మెంటార్ సౌరభ్ గంగూలీతోపాటు గుజరాత్ ప్రధాన కోచ్ ఆశిశ్ నెహ్రా తమ టీమ్లోకి తీసుకొనేందుకు ఆసక్తి చూపించారని దేవేందర్ వెల్లడించారు. ఐపీఎల్ 2022 సీజన్లో లఖ్నవూ రూ.20 లక్షలకే తీసుకుంది. ఆ సీజన్లో అవకాశాలు రాలేదు. గాయం కారణంగా గత సీజన్ నుంచి వైదొలిగాడు. మూడో సీజన్లో ఎట్టకేలకు ఛాన్స్ దక్కించుకున్న మయాంక్ మొదటి మ్యాచ్లోనే తన ప్రత్యేకతను చాటి చెప్పాడు. మూడు వికెట్లు తీసి పంజాబ్పై లఖ్నవూ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికే క్రీజ్లో ఉన్న బెయిర్ స్టోను బెంబేలెత్తించాడు. శిఖర్ ధావన్ను కూడా ఇబ్బందిపెట్టాడు. మయాంక్ బౌలింగ్ను మ్యాచ్ అనంతరం ధావన్ కూడా ప్రశంసించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం