Mayank Yadav: అవకాశం అప్పుడే రావాల్సింది.. భారత జట్టులోకి మయాంక్ ఎంట్రీపై కోచ్ దేవేందర్
ఐపీఎల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కుర్రాడు మయాంక్ యాదవ్. నిలకడగా 145 కి.మీ. వేగంతో బంతులను విసిరే అతడు ఏకంగా ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బాల్ను సంధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా మయాంక్ యాదవ్ నిలిచాడు. లఖ్నవూకు ఆడుతున్న ఈ యువ క్రికెటర్కు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనే అవకాశం రావాల్సిఉందట. అయితే, గాయం కారణంగా అతడిని పరిగణనలోకి తీసుకోలేదని మయాంక్ క్లబ్ కోచ్ దేవేందర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే మంచి ప్రదర్శన చేసిన మయాంక్ బౌలింగ్ను పరిశీలించాలని టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్కు దేవేందర్ విజ్ఞప్తి చేశాడు.
‘‘జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అదే. చీఫ్ సెలక్టర్ను మెప్పించాలని.. జాతీయజట్టులోకి రావాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు. మయాంక్ ఫిట్గా ఉండాలని.. నాణ్యమైన పేస్ సంధించాలని దేవుడిని ప్రార్థించా. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు కోసం మయాంక్ను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ సమయంలో గాయం తిరగబెట్టడంతో అవకాశం చేజారింది. గుండె పగిలినంత పనవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయితే, అతడు అద్భుతమైన ఆటగాడే కాకుండా దృఢ సంకల్పం కలిగిన కుర్రాడు. అథ్లెటిక్ బాడీ. నిరంతరం శ్రమించే ఆటగాడు. తప్పకుండా సుదీర్ఘకాలం భారత జట్టుకు సేవలు అందించగల సత్తా ఉంది’’ అని దేవేందర్ తెలిపారు.
దేవేందర్ సోనెట్ క్లబ్ను నిర్వహిస్తున్నారు. మయాంక్ను దిల్లీ కెప్టెన్ రిషభ్పంత్, మెంటార్ సౌరభ్ గంగూలీతోపాటు గుజరాత్ ప్రధాన కోచ్ ఆశిశ్ నెహ్రా తమ టీమ్లోకి తీసుకొనేందుకు ఆసక్తి చూపించారని దేవేందర్ వెల్లడించారు. ఐపీఎల్ 2022 సీజన్లో లఖ్నవూ రూ.20 లక్షలకే తీసుకుంది. ఆ సీజన్లో అవకాశాలు రాలేదు. గాయం కారణంగా గత సీజన్ నుంచి వైదొలిగాడు. మూడో సీజన్లో ఎట్టకేలకు ఛాన్స్ దక్కించుకున్న మయాంక్ మొదటి మ్యాచ్లోనే తన ప్రత్యేకతను చాటి చెప్పాడు. మూడు వికెట్లు తీసి పంజాబ్పై లఖ్నవూ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికే క్రీజ్లో ఉన్న బెయిర్ స్టోను బెంబేలెత్తించాడు. శిఖర్ ధావన్ను కూడా ఇబ్బందిపెట్టాడు. మయాంక్ బౌలింగ్ను మ్యాచ్ అనంతరం ధావన్ కూడా ప్రశంసించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.