MS Dhoni: రెండు మ్యాచుల్లో ఒక్క బంతినీ ఎదుర్కోని ధోనీ.. కారణమేంటో చెప్పిన మైక్ హస్సీ!
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ను చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. తొలి రెండు మ్యాచుల్లోనూ మహీ వికెట్ కీపింగ్కే పరిమితమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో చెన్నై రెండు మ్యాచ్లు ఆడింది. రెండింట్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తోంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ పటిమ అందర్నీ ఆకట్టుకుంటోంది. వికెట్ కీపింగ్లో మునుపటిలా అదరగొట్టిన ధోనీ బ్యాటింగ్ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్తో మ్యాచ్లో 19వ ఓవర్లో ఐదో వికెట్ పడిన తర్వాత మహీ వస్తాడనుకుంటే.. యువ ఆటగాడు రిజ్వీని పంపించారు. ఇన్నింగ్స్ ఆఖర్లోనూ క్రీజ్లోకి రాలేదు. రవీంద్ర జడేజా వచ్చాడు. దీంతో ధోనీ ఎందుకు బ్యాటింగ్కు రావడం లేదని అభిమానులు ఆలోచనలో పడ్డారు. దీనికి కారణం ఏంటనేది చెన్నై కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు.
‘‘ధోనీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇంపాక్ట్ రూల్ను సద్వినియోగం చేసుకోవాలని చూశాం. అందుకే మహీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు జరిగింది. ఇదంతా మా ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచనల మేరకు చేశాం. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కీలకమవుతుంది. అదనంగా బ్యాటర్ లేదా బౌలర్ అవసరమైతే అప్పుడు ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని భావించాం. అదే సమయంలో మా బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని పరీక్షించుకున్నాం. ధోనీ 8వ స్థానంలో వచ్చేవాడే. ఆ ప్లేస్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. జట్టులోని ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాలని ఫ్లెమింగ్ చెప్పేవాడు. మ్యాచ్పై పట్టు సాధించాలంటే ఇది తప్పదు. ఒకవేళ దూకుడుగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదు.. కొనసాగాలని ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం’’ అని మైక్ హస్సీ వ్యాఖ్యానించాడు.
చెపాక్ను ఉర్రూతలూగించాడు: రచిన్పై ప్రశంసలు
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 206 పరుగుల భారీ స్కోరు సాధించడంలో శివమ్ దూబె (51)తోపాటు రచిన్ రవీంద్ర (46: 20 బంతుల్లో) కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రుతురాజ్తో (46)తో కలిసి తొలి వికెట్కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు రాబట్టాడు. ‘‘తొలి సీజన్లోనే రచిన్కు అద్భుతమైన ఆరంభం దక్కింది. అతడి ఆటను చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎంతో ఉత్సాహంగా టోర్నీలోకి అడుగు పెట్టాడు. జట్టులో మంచి వాతావరణం కల్పించడంలో అతడి పాత్ర తక్కువేం కాదు. ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తున్నాడు. వీలైనంత ఎక్కువ అనుభవాన్ని గడించేందుకు శ్రమిస్తున్న అతడు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు’’ అని హస్సీ తెలిపాడు. రచిన్ రెండు మ్యాచుల్లో కలిపి 86 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం