టాప్10 క్రీడలు ఇవేనట!
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుకే పాఠశాలల్లో క్రీడలకు ప్రత్యేకంగా సమయం కేటాయించి విద్యార్థులతో ఆటలు ఆడిస్తారు. చిన్నతనంలో మీరూ ఏదో ఒక క్రీడలో రాణించే ఉంటారు. అయితే, అందరూ క్రీడాకారులు కాలేకపోవచ్చు. కానీ, ఇష్టమైన క్రీడను అభిమానిస్తారు. పోటీలు
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుకే పాఠశాలల్లో క్రీడలకు ప్రత్యేకంగా సమయం కేటాయించి విద్యార్థులతో ఆటలు ఆడిస్తారు. చిన్నతనంలో మీరూ ఏదో ఒక క్రీడలో రాణించే ఉంటారు. అయితే, అందరూ క్రీడాకారులు కాలేకపోవచ్చు. కానీ, ఇష్టమైన క్రీడను అభిమానిస్తారు. పోటీలు జరుగుతున్నాయంటే స్టేడియానికి వెళ్లో.. టీవీముందు కూర్చొనో ఆటను చూస్తూ ఆనందిస్తారు. భారతదేశంలో అత్యధిక మంది ఇష్టపడే ఆట.. క్రికెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు ఉన్నాయి. వాటికీ అభిమానులున్నారు. ఇతర దేశాలతో పోటీ పడుతుంటే తమ దేశ జట్టే గెలవాలని ప్రార్థించే వ్యక్తులున్నారు. అయితే, ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ టాప్ టెన్ క్రీడల జాబితాను ప్రకటించింది. అంతర్జాతీయంగా క్రీడను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య, టీవీ ప్రసార హక్కుల విలువ, ఇంటర్నెట్.. సోషల్మీడియాలో పాపులారిటీ, క్రీడా పోటీల సంఖ్య, క్రీడాకారుల పారితోషికం వంటి పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ జాబితాను రూపొందించింది. మరి ఆ క్రీడలేవో చూద్దామా...
సాకర్/ఫుట్బాల్
దాదాపు 200 దేశాల్లో 250మిలియన్ క్రీడాకారులు ఫుట్బాల్ ఆడతారు. అంతర్జాతీయంగా ఏటా అనేక టోర్నీలు జరుగుతుంటాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్బాల్ వరల్డ్కప్లో 30కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయంగా ఆడకపోయినా.. దేశీయంగా ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తుంటాయి. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లో ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఫుట్బాల్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్లమంది అభిమానులున్నారు. టీవీల్లో ఈ ఆటను ప్రత్యక్షప్రసారం చూసేవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది.
క్రికెట్
ఫుట్బాల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ.. క్రికెట్. భారత్ సహా ఆసియాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, యూకె దేశాలు క్రికెట్ను ఎక్కువగా ఆడతాయి. అంతర్జాతీయ టోర్నీలో ఆడే జట్ల సంఖ్య 20 కూడా దాటదు. అయినా, ఈ ఆటకు అభిమానులు కోకొల్లలు. క్రికెట్ను మొత్తంగా 200-300కోట్ల మంది అభిమానిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియంలో సీట్లు నిండిపోవాల్సిందే. టీవీల్లోనూ వీటి వీక్షణ సంఖ్య చాలా ఎక్కువ.
బాస్కెట్బాల్
బాస్కెట్బాల్ను యూఎస్ఏ, కెనడా, చైనా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో బాగా ఆదరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు 200 నుంచి 300కోట్ల మంది ఆదరణ ఉంది. యూఎస్, చైనా, అర్జెంటీనా, యూరప్లోని కొన్ని దేశాల్లోని మీడియా బాస్కెట్బాల్ పోటీల గురించే ఎక్కువగా వార్తలు, కథనాలు రాస్తుంటాయట.
హాకీ
ఈ క్రీడను సాధారణ నేలపై, మంచుపై రెండు రకాలుగా ఆడతారు. ఈ రెండు క్రీడలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది అభిమానులున్నారు. ఫీల్డ్ హాకీని భారత్, పాకిస్థాన్ దేశాలు జాతీయ క్రీడగా భావిస్తాయి. ఐస్ హకీని ఎక్కువగా యూరప్, కెనడా, యూఎస్ఏ, లాట్వియా, స్వీడెన్లో ఆడతారు.
టెన్నిస్
టెన్నిస్.. ఒకరు లేదా ఇద్దరు చొప్పున ఆడే ఆట. యూరప్, అమెరికా, ఆసియా ఖండాల్లో ఈ క్రీడను ఎక్కువగా ఆడుతుంటారు. మన దేశంలో సానియా మీర్జా, లియాండర్ పేస్ వంటి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటను వంద కోట్ల మంది అభిమానిస్తారట.
వాలీబాల్
భారత్లో పాఠశాల, అంతర్రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ క్రీడలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, ఆసియాలోని కొన్ని దేశాలు, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాలో వాలీబాల్ పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ క్రీడలో ఒక్కో జట్టులో ఆరుగురు సభ్యులుంటారు. టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే, పై క్రీడలతో పోలిస్తే వాలీబాల్కు కాస్త తక్కువ ఆదరణే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు 90కోట్ల మంది అభిమానులున్నారు.
టేబుల్ టెన్నిస్
టేబుల్ టెన్నిస్ను పింగ్పాంగ్ అని కూడా పిలుస్తుంటారు. అంతర్జాతీయ టోర్నీల్లోనే ఎక్కువగా నిర్వహిస్తారు. ప్రత్యక్షంగా క్రీడను వీక్షించే అభిమానులు తక్కువే అయినా ఆటకు పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ ఆటకు ఆదరణ లభిస్తుంది. ఈ టేబుల్ టెన్నిస్కు మొత్తంగా 85కోట్ల మంది అభిమానులున్నారు.
బేస్బాల్
భారతీయులకు పెద్దగా తెలియని, చూడని క్రీడ బేస్బాల్. కానీ, యూఎస్, జపాన్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ తదితర దేశాల్లో దీన్ని ఎక్కువగా ఆడతారు. ఈ ఆటకు 50కోట్ల మంది అభిమానులున్నారు.
రగ్బీ
సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమా రగ్బీ క్రీడ నేపథ్యంలో సాగుతుంది. ఆ క్రీడ మనకు కొత్తగా అనిపించొచ్చు. కానీ.. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో చాలాకాలంగా ఈ రగ్బీ ఆడుతున్నారు. ఈ క్రీడను 41కోట్ల మంది అభిమానిస్తున్నారు.
గోల్ఫ్
గోల్ఫ్ను సంపన్నుల ఆటగా అభివర్ణిస్తుంటారు. యూరప్, ఆసియా, అమెరికా, కెనడాలో ఎక్కువ గోల్ఫ్ టోర్నీలు జరుగుతుంటాయి. ఈ క్రీడకు 39కోట్ల మంది అభిమానులున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్