MS Dhoni: ధోనీ క్రేజ్ మామాలుగా లేదుగా.. దద్దరిల్లిన స్టేడియాలు.. సాక్ష్యం ఇదిగో..
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు సిక్సర్ బాదితే ‘ధోనీ ధోనీ’ అనే నినాదాలతో స్టేడియాలు హోరెత్తుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఈ పేరే ఒక బ్రాండ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఈయన ఒకరు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి చాలాకాలం అవుతున్నా ధోనీ క్రేజ్ తగ్గడం లేదు. అందుకు ఐపీఎల్-17 సీజన్ ఉదాహరణ. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై జట్టు మ్యాచ్లు ఎక్కడ జరిగినా అభిమానులు పోటెత్తుతున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువమంది ధోనీని చూడటానికే వస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కెప్టెన్ కూల్ మైదానంలోకి వచ్చే సమయంలో, ఫోర్ కొట్టినా, సిక్సర్ బాదినా అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ‘ధోనీ ధోనీ’ అంటూ నినాదాలు చేస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ధోనీ క్రేజ్ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో స్టేడియానికి వచ్చిన అభిమానులు వివిధ సందర్భాల్లో చేసిన శబ్ద స్థాయిలను ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సాంకేతికతను ఉపయోగించి లెక్కించింది. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ధోనీ ఉన్నాడు.
ఐపీఎల్-17 సీజన్ ఆరంభపోరు చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగింది. చెన్నై, బెంగళూరు తలపడిన ఈ మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. టాస్ పడటానికి ముందు ధోనీ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఫ్యాన్స్ ‘ధోనీ ధోనీ’.. అంటూ నినాదాలు చేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ దెబ్బకు ఆ సమయంలో శబ్ద తీవ్రత 130 డెసిబెల్స్ నమోదైందని స్టార్ స్పోర్ట్స్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
వైజాగ్ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ మ్యాచ్లో 17వ ఓవర్ ఆరంభంలో బ్యాటింగ్కు వచ్చి అదరగొట్టాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడు క్రీజ్లోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలోని అభిమానులు లేచి నిలబడి వారి సెల్ఫోన్లలో టార్చ్లైట్లు వేస్తూ ధోనీ .. ధోనీ అంటూ స్వాగతం పలికారు. స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. ధోనీ 17 ఓవర్లో ఫోర్ బాదినప్పుడు అభిమానులు చేసిన నినాదాలకు శబ్ద తీవ్రత 128 డెసిబెల్స్ నమోదైంది. ఈ సీజన్లో బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ భారీ శబ్ద తీవ్రత నమోదైంది. బెంగళూరు ఇన్నింగ్స్ 20వ ఓవర్లో దినేశ్ కార్తిక్ సిక్స్ కొట్టినప్పుడు అభిమానులు చేసిన నినాదాలకు 128 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదైనట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
హ్యాట్రిక్పై కన్నేసిన దిల్లీకి షాక్ తగిలింది. ఐపీఎల్ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!