IPL 2024: ధోనీని చూడాలని.. బ్లాక్లో రూ.64వేలు పెట్టి టికెట్లు కొని..
ఇదే చివరి సీజన్గా భావిస్తున్న తరుణంలో ఎంఎస్ ధోనీని (MS Dhoni) చూసేందుకు స్టేడియాలు అభిమానులతో పోటెత్తుతున్నాయి. ఫ్యాన్స్ కూడా ఎలాగైనా టికెట్లను దక్కించుకోవాలని శ్రమిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు మ్యాచ్ టికెట్ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టే అభిమానులు ఉంటారు. భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో ధోనీని చూడటానికే అభిమానులు వస్తున్నారనడంలో సందేహం లేదు. తాజాగా ఓ అభిమాని పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. అతడికి కొందరు మద్దతు తెలపగా.. మరికొందరు ఇదంతా ప్రమోషనల్ స్టంట్ అంటూ విమర్శలు గుప్పించారు.
ఏప్రిల్ 8న కోల్కతాతో చెపాక్ వేదికగా చెన్నై తలపడింది. ఆ మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో ధోనీని చూడటానికి ఓ అభిమాని తన ముగ్గురు కుమార్తెలతో కలిసివచ్చాడు. ‘‘ఆన్లైన్లో నాకు టికెట్లు దొరకలేదు. దీంతో బ్లాక్లో కొన్నా. ఇందుకోసం దాదాపు రూ.64 వేలు ఖర్చు పెట్టా. ఇంకా నా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టలేదు. అయితే, ధోనీని దగ్గరగా ఒక్కసారైనా చూడాలని భావించాం. ఆ అవకాశం దక్కడంతో నాతోపాటు ముగ్గురు కుమార్తెలకు ఆనందంగా ఉంది’’ అని సదరు అభిమాని వ్యాఖ్యానించాడు. అదే వీడియోలో ఆ అభిమాని కుమార్తె కూడా మాట్లాడుతూ.. ‘‘టికెట్లను పొందడానికి మా నాన్న చాలా కష్టపడ్డారు. ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉంది’’ అని తెలపడం విశేషం. ఆ వీడియోను పెట్టిన యూజర్ స్పందిస్తూ.. ‘‘ఓ తండ్రి ఇలా చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు’’ అని రాసుకొచ్చాడు. అతడి పోస్టుపై కొందరు కామెంట్లు చేశారు.
‘‘సర్, అతడేమీ డబ్బు లేదని చెప్పలేదు. స్కూల్ ఫీజ్ తర్వాత కడతానని మాత్రమే చెప్పాడు’’
‘‘ఓ తండ్రిగా తన పిల్లలకు ఏం చేస్తే వారు ఆనందంగా ఉంటారో అతనికి తెలుసు. ఇలా చేయడం వల్ల ఇది వారికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది’’
‘‘అసలు ఎవరు ఇలా బ్లాక్లో అధిక ధరకు టికెట్లను అమ్మమని చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. సినిమా టికెట్ల విషయంలో మాత్రం ఉపేక్షించరు. ఇలా క్రికెట్ విషయంలోనే ఎందుకు నిబంధనలను అమలు చేయడం లేదు?’’
‘‘అదంతా అబద్ధమే. ఇదంతా సోషల్ మీడియాలో హైప్ కోసం చేస్తున్నారు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్