MS Dhoni: నాతో ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని చెప్పా: ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ దిశగా సాగుతోంది. తాజాగా దిల్లీని 27 పరుగుల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs DC) చిత్తు చేసింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 140/8 స్కోరుకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ టార్గెట్ లేకపోయినా బౌలింగ్ వనరులను అద్భుతంగా వాడుకొని మరీ దిల్లీని కట్టడి చేయడంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బ్యాటింగ్లోనూ ధోనీ (20: 9 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే ఇన్నింగ్స్లో 17వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ తొలి మూడు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేశాడు. ఇక 18వ ఓవర్లో ఒక్క బాల్ను ఎదుర్కోని ధోనీ.. 19వ ఓవర్లో మాత్రం విజృంభించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ధోనీ రెండు సిక్స్లు, ఫోర్ బాదేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తనను ఎక్కువగా పరుగెత్తించవద్దని సహచరులను కోరినట్లు పేర్కొన్నాడు.
‘‘దిల్లీతో మ్యాచ్లో నన్ను ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని మా బ్యాటర్లకు చెప్పా. అదే వర్కౌట్ అయింది. చివర్లో ధాటిగా ఆడాల్సిన అవసరం ఉందని తెలుసు. నేను చేయాల్సిన పని కూడా ఇదే. అందుకే పరుగెత్తి త్వరగా అలసిపోకుండా ఉంటేనే భారీ షాట్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. జట్టు విజయానికి సహకరించడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం టోర్నీ చివరి దశకు చేరువగా వచ్చాం. ప్రతి ఒక్కరికీ ఇది చాలా కీలకం. మా బ్యాటింగ్ విభాగంపై సంతోషంగానే ఉంది. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అతడికి బాగా తెలుసు. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుంటాడు. ఇలాంటి ఆటగాళ్లు ప్రతి జట్టుకు అవసరం. ద్వితీయార్థంలో బంతి మరీ ఎక్కువగా సుడులు తిరిగింది. మా స్పిన్నర్లు అదనంగా వేగంతో బంతులను సంధించారు. ఈ పిచ్పై 160 - 170 పరుగులను కాపాడుకోవచ్చని అర్థమైంది’’ అని ధోనీ తెలిపాడు.
చెన్నై ఇలా.. దిల్లీ అలా
దిల్లీపై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 15 పాయింట్లతో చెన్నై కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా సీఎస్కేకు ఢోకా ఉండదు. కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్తోనే చెన్నై ఆడాల్సి ఉంది. మరోవైపు దిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. చివరి మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే. ప్రస్తుతం దిల్లీ ఎనిమిది పాయింట్లతో అట్టడుగున ఉంది. ఇంకా మూడు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్తో రెండుసార్లు, మరోసారి చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!