MS Dhoni: నాతో ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని చెప్పా: ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ దిశగా సాగుతోంది. తాజాగా దిల్లీని 27 పరుగుల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs DC) చిత్తు చేసింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 140/8 స్కోరుకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ టార్గెట్ లేకపోయినా బౌలింగ్ వనరులను అద్భుతంగా వాడుకొని మరీ దిల్లీని కట్టడి చేయడంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బ్యాటింగ్లోనూ ధోనీ (20: 9 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే ఇన్నింగ్స్లో 17వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ తొలి మూడు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేశాడు. ఇక 18వ ఓవర్లో ఒక్క బాల్ను ఎదుర్కోని ధోనీ.. 19వ ఓవర్లో మాత్రం విజృంభించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ధోనీ రెండు సిక్స్లు, ఫోర్ బాదేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తనను ఎక్కువగా పరుగెత్తించవద్దని సహచరులను కోరినట్లు పేర్కొన్నాడు.
‘‘దిల్లీతో మ్యాచ్లో నన్ను ఎక్కువగా పరుగులు పెట్టించొద్దని మా బ్యాటర్లకు చెప్పా. అదే వర్కౌట్ అయింది. చివర్లో ధాటిగా ఆడాల్సిన అవసరం ఉందని తెలుసు. నేను చేయాల్సిన పని కూడా ఇదే. అందుకే పరుగెత్తి త్వరగా అలసిపోకుండా ఉంటేనే భారీ షాట్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. జట్టు విజయానికి సహకరించడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం టోర్నీ చివరి దశకు చేరువగా వచ్చాం. ప్రతి ఒక్కరికీ ఇది చాలా కీలకం. మా బ్యాటింగ్ విభాగంపై సంతోషంగానే ఉంది. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అతడికి బాగా తెలుసు. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుంటాడు. ఇలాంటి ఆటగాళ్లు ప్రతి జట్టుకు అవసరం. ద్వితీయార్థంలో బంతి మరీ ఎక్కువగా సుడులు తిరిగింది. మా స్పిన్నర్లు అదనంగా వేగంతో బంతులను సంధించారు. ఈ పిచ్పై 160 - 170 పరుగులను కాపాడుకోవచ్చని అర్థమైంది’’ అని ధోనీ తెలిపాడు.
చెన్నై ఇలా.. దిల్లీ అలా
దిల్లీపై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 15 పాయింట్లతో చెన్నై కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా సీఎస్కేకు ఢోకా ఉండదు. కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్తోనే చెన్నై ఆడాల్సి ఉంది. మరోవైపు దిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. చివరి మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే. ప్రస్తుతం దిల్లీ ఎనిమిది పాయింట్లతో అట్టడుగున ఉంది. ఇంకా మూడు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్తో రెండుసార్లు, మరోసారి చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్