MS Dhoni: వింటేజ్ లుక్లో ధోని.. కొత్త పాత్రకు సిద్ధం అంటూ ఎఫ్బీలో పోస్టు
ఐపీఎల్-17 కోసం వింటేజ్ లుక్లో చెన్నైకి వచ్చిన ధోనిని చూసి సీఎస్కే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొత్త పాత్రకు సిద్ధం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది.. మెడ వరకు వేలాడే జట్టు.. బలమైన దేహం. కానీ, కెరీర్ గడుస్తున్నకొద్దీ మహీ మారుతూ వచ్చాడు. ఒకప్పటి ఆ జుట్టూ లేదు, ఆ బలమూ తగ్గింది. అయితే ఐపీఎల్-17 కోసం చెన్నైకి వచ్చిన ధోనిని చూస్తే ఒకప్పటి మహీ గుర్తొచ్చాడు. అదే పొడవైన జట్టు.. బలమైన దేహంతో వింటేజ్ ఎంఎస్డీలా కనిపిస్తున్నాడు.
కొత్త రూపం.. కొత్త పాత్ర
ఈసారి మహేంద్రసింగ్ ధోనిపై అభిమానుల దృష్టి ఎక్కువగా ఉండబోతోంది. బహుశా ఇదే అతడికి చివరి ఐపీఎల్ కావచ్చనే వార్తలే ఇందుకు కారణం. నిజానికి ఐపీఎల్-16తోనే ధోని ఆఖరి టోర్నీ ఆడేశాడని ఫ్యాన్స్ అనుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంతో ధోని అంతటితో ముగిస్తాడని భావించారు. కానీ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. 2024లోనూ ఆడతానని చెప్పాడు. చెప్పడమే కాదు ఈ టోర్నీలో బరిలో దిగేందుకు సర్వసిద్ధమై చెన్నైలో దిగిపోయాడు. ఒకప్పటి ధోనిని గుర్తుకుతెచ్చే రూపంలో అభిమానులను అలరిస్తున్నాడు. గత మూడేళ్లతో పోలిస్తే ఎంతో బలంగా కనిపిస్తున్నాడు. దీంతో నాయకుడి ఉత్సాహం చూసి ఈసారి కూడా కప్పు మనదే అని ఫ్యాన్స్ ధీమాను ప్రదర్శిస్తున్నారు.
ఈ టోర్నీకి వచ్చే ముందు ఈ సీజన్లో కొత్త పాత్రకు సిద్ధం అని సామాజిక మాధ్యమంలో మహీ చేసిన పోస్టు వైరల్ అయింది. దీంతో ఆ కొత్త పాత్ర ఏంటి? అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే మహీకి దాదాపు ఇదే చివరి సీజన్ కావచ్చు. ఈనేపథ్యంలో కెప్టెన్సీని సగం నుంచే ఎవరికైనా అప్పజెబుతాడా? లేక ఇంకా ఏదైనా పాత్ర పోషిస్తాడా? అనేది చూడాలి. జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఒత్తిడి భరించలేక మధ్యలోనే వదిలేశాడు. మరి ఈసారి అలాంటి ఇబ్బందిలేకుండా ఇంకొకరికి ఎవరికైనా ఆ బాధ్యతలను సాఫీగా బదలాయిస్తాడా అనేది ఆసక్తికరం.
అన్ని జట్ల కెప్టెన్లు మారినా..
ఐపీఎల్ మొదలై 16 సంవత్సరాలు అయిపోయింది. అన్ని జట్లు మారాయి. అన్ని జట్ల కెప్టెన్లు ఛేంజ్ అయ్యారు. ఆటగాళ్లు మారారు. మారనిది మహేంద్రసింగ్ ధోని ఒక్కడే. 2008లో చెన్నై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు మహీ ప్రస్థానం చిరస్మరణీయం. ఏకంగా ఐదుసార్లు సీఎస్కేని విజేతగా నిలిపిన ధోని.. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. ముంబయి ఇండియన్స్ను అయిదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్శర్మ కూడా ఈసారి సాధారణ ఆటగాడినే బరిలో దిగనున్నాడు. కానీ ధోని మాత్రం ఎవర్గ్రీన్ కెప్టెన్లా అలాగే ఉన్నాడు.
అందుకే ఐపీఎల్-17లో మహీ ఏం చేస్తాడో ఎలా రాణిస్తాడో?, చెన్నైని ఎలా ముందుకు తీసుకెళ్తాడో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో ధోని కొన్ని ఫినిషింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. ఈసారి బ్యాటర్గానూ అతడు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అదంత తేలిక కాదు. ఎందుకంటే మహీ కాంపిటేటివ్ మ్యాచ్లో బరిలో దిగి ఏడాది అయింది. గత కొన్ని నెలలుగా బ్యాటింగ్ సాధన చేస్తున్నా కూడా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఆడడం ఇబ్బంది కలిగించేదే. మరి ఈ ప్రతికూలతలను తట్టుకుని ధోని అటు బ్యాటర్గా, కీపర్గా.. సారథిగా చెన్నైని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.