WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024.. ఉత్కంఠపోరులో దిల్లీపై ముంబయి విజయం
డబ్ల్యూపీఎల్ 2024 (WPL 2024) రెండో ఎడిషన్లో తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి దిల్లీపై ముంబయి అద్భుత విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇది కదా అసలైన క్రికెట్ మజా. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్ తొలి మ్యాచ్లోనే అభిమానులకు కావాల్సినంత ఫన్ లభించింది. చివరి బంతి వరకు సాగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్పై ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ను ముంబయి సరిగ్గా 20 ఓవర్లలో పూర్తి చేసింది. ఐదు పరుగులు అవసరమైన సందర్భంలో.. సజన (6*) చివరి బంతిని సిక్స్గా మలిచి ముంబయిని గెలిపించింది. ముంబయి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (55), యస్తికా భాటియా (57) హాఫ్ సెంచరీలు సాధించారు. నాట్ స్కివెర్ (19), అమెలియా కెర్ (24) కీలక పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లు అరుంధతి రెడ్డి 2, ఎలీస్ కాప్సే 2.. మరిజన్నె, షికా పాండే చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.
రెండో బంతికే ఎదురు దెబ్బ
దిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పరుగుల ఖాతా కూడా తెరవకుండానే హీలే మాథ్యూస్ (0) డకౌట్గా పెవిలియన్కు చేరింది. అయితే యస్తికా భాటియాతో కలిసి నాట్ స్కివెర్ రెండో వికెట్కు 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కబెట్టింది. స్కివెర్ ఔటైన తర్వాత కెప్టెన్ హర్మన్తో యస్తికా జతకలిసింది. వీరిద్దరూ మూడో వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. హాఫ్ సెంచరీ తర్వాత యస్తికా పెవిలియన్కు చేరింది. అమెలీ కెర్ దూకుడుగా ఆడింది. కానీ, దిల్లీ బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో పన్నెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పూజా వస్త్రాకర్ (3)తోపాటు హాఫ్ సెంచరీ సాధించి ఊపు మీదున్న హర్మన్ ఔట్ కావడం అభిమానుల్లో ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లింది. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సజన సిక్సర్తో మ్యాచ్కు ముగింపు పలికింది. దీంతో డబ్ల్యూపీఎల్లో తొలి విజయంతో పాయింట్ల పట్టికలో ముంబయి బోణీ కొట్టింది.
కాప్సే దూకుడు
ఎలీస్ కాప్సే (75: 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేసింది. ఓపెనర్, కెప్టెన్ మెగ్ లానింగ్ (31: 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తోపాటు జెమీమా రోడ్రిగ్స్ (42: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా పరుగులు రాబట్టారు. మరిజన్నె కాప్ (16: 9 బంతుల్లో 3 ఫోర్లు) వేగంగా ఆడింది. ముంబయి బౌలర్లు నాట్ స్కివెర్ బ్రంట్ 2, అమేలియా కెర్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్