IND vs NZ: భారత్-న్యూజిలాండ్ సెమీస్కు బెదిరింపులు.. వాంఖడే స్టేడియం వద్ద అలర్ట్
IND vs NZ: వన్డే ప్రపంచకప్ తొలి సెమీస్కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారత్, కివీస్ మ్యాచ్లో దారుణ ఘటన చోటుచేసుకుంటుందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు.
ముంబయి: వన్డే ప్రపంచకప్ (ODI World cup 2023)లో భాగంగా భారత్, న్యూజిలాండ్ (IND vs NZ)మధ్య బుధవారం సెమీ ఫైనల్ (Semi Final) మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే మైదానం (Wankhede Stadium) వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ముంబయి పోలీసులు (Mumbai Police) అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
వాంఖడే స్టేడియంలో భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మ్యాచ్ జరిగే సయమంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుందంటూ గుర్తుతెలియని వ్యక్తి ‘ఎక్స్’లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు. తన పోస్ట్లో ముంబయి పోలీసులను ట్యాగ్ చేసిన ఆ ఆగంతకుడు.. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో స్టేడియం, ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వదలొద్దు ఈసారి.. అజేయ భారత్కు కివీస్ సవాల్
కాగా.. తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్లకు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్ స్టేడియంపై దాడి చేస్తామంటూ ఈ-మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ముమ్మర దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?