Punjab X Mumbai: అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది.
ముల్లన్పుర్: ఐపీఎల్ 2024లో ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి పంజాబ్ను గెలిపించినంత పనిచేశాడు. శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా (3/21), గెరాల్డ్ కొయెట్జీ (3/32) పంజాబ్ను దెబ్బకొట్టారు. ఆకాశ్ మధ్వాల్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో బుమ్రా, కొయెట్జీ దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్ (6), ప్రభ్సిమ్రన్ సింగ్ (0), రిలీ రొసోవ్ (1), లివింగ్స్టన్ (1) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. హర్ప్రీత్ సింగ్ భాటియా (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు. అయితే 111 పరుగుల వద్ద ఏడో వికెట్గా శశాంక్ వెనుదిరిగినప్పటికీ అశుతోష్ పట్టువదలకుండా పోరాడాడు. దీంతో పంజాబ్ లక్ష్యం 18 బంతుల్లో 25 పరుగులుగా మారింది. ఈ తరుణంలో 17.1 ఓవర్ల వద్ద కొయెట్జీ బౌలింగ్లో అశుతోష్ ఔట్ అయ్యాడు. ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 19వ ఓవర్లో హార్దిక్ పాండ్య.. హర్ప్రీత్ బ్రార్ (21)ను ఔట్ చేశాడు. ఐదో బంతికి రబాడ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. 20 ఓవర్ను మధ్వాల్ వేశాడు. తొలి బంతి వైడ్ పడింది. రెండో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో రబాడ రనౌట్ అయ్యాడు. అంతే ఇక ముంబయి శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (78: 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) దుమ్మురేపాడు. రోహిత్శర్మ (36: 25 బంతుల్లో 3 సిక్స్లు, 2 ఫోర్లు), తిలక్ వర్మ (34: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్ 2, రబాడ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి