NAM vs OMA: ఒమన్పై నమీబియా ‘సూపర్’ ఓవర్ విక్టరీ
ప్రపంచ కప్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తాజాగా నమీబియా తొలి విజయాన్ని ‘సూపర్’ ఓవర్లో నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) పసికూన జట్లు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. తొలిరోజు విండీస్కు షాక్ ఇచ్చేలా కనిపించిన పపువా న్యూగినియా చివరివరకూ పోరాడి ఓడింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో తమకంటే కాస్త అనుభవం ఎక్కువ కలిగిన నమీబియాపై ఒమన్ (NAM vs OMA) గెలిచేంత పని చేసింది. కానీ, సూపర్ ఓవర్లో తడబడి ఓటమి పాలైంది. ఈసారి ప్రపంచ కప్లో తొలిసారి ‘సూపర్ ఓవర్’తో ఫలితం తేలిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్. నమీబియా బౌలర్లు ట్రంపెల్మాన్ (4/21), డేవిడ్ వీజ్ (3/28), ఎరాస్మస్ (2/20) దెబ్బకు ఒమన్ కుదేలైంది. అనంతరం లక్ష్య ఛేదనలో జాన్ ఫ్రైలింక్ (45), నికోలాస్ డేవిన్ (24) రాణించినప్పటికీ నమీబియా సరిగ్గా 20 ఓవర్లలో 109/6 స్కోరుతో నిలిచింది. ఒమన్ బౌలర్లు సమష్ఠిగా రాణించారు. మెహ్రాన్ ఖాన్ (3/7) కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది.
‘సూపర్’లో నమీబియా దూకుడు
సూపర్ ఓవర్లో తొలుత నమీబియా బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వీజ్, ఎరాస్మస్ బరిలోకి దిగారు. బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. మరోసారి ఒమన్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. సూపర్ ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ను కోల్పోయారు. నమీబియా బౌలర్ డేవిడ్ వీజ్ కట్టుదిట్టంగా బంతులేసి తన జట్టును గెలిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే దక్కింది. గత 12 ఏళ్లలో తొలిసారి టీ20 ప్రపంచ కప్లో సూపర్ ఓవర్తో మ్యాచ్ ఫలితం వచ్చింది. చివరగా 2012లో న్యూజిలాండ్ - శ్రీలంక, వెస్టిండీస్ - న్యూజిలాండ్ మ్యాచుల్లో సూపర్ ఓవర్ తప్పలేదు. పొట్టి కప్ చరిత్రలో ఇది నాలుగోసారి. అంతకుముందు 2007లో బౌల్ అవుట్ (భారత్ - పాక్ మ్యాచ్) ద్వారా టీమ్ఇండియాను విజేతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే