IPL 2024: చెన్నై జట్టులోకి వచ్చాకే కుర్రాళ్లు పదునెక్కుతారు.. కారణమిదే: నవ్జ్యోత్ సిద్ధూ
ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచినవి రెండే జట్లే. అందులో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన టీమ్ చెన్నై. ధోనీ సారథ్యంలో ఈ ఘనతలను సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించే జట్లలో చెన్నై (Chennai) టాప్. మొన్నటి వరకు ఆ జట్టును నడిపిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో కుర్రాళ్లు అదరగొట్టారు. షేన్ వాట్సన్, మొయిన్ అలీ, అజింక్య రహానె, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా వంటి సీనియర్లూ తమ సత్తా చాటారు. ఇప్పుడు శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్, పతిరన, రిజ్వీ.. ఇలా యువ క్రికెటర్లు తమ ప్రతిభతో వెలుగులోకి వచ్చారు. రుతురాజ్ ఏకంగా సారథ్యం అందుకొన్నాడు. ఈ క్రమంలో చెన్నై జట్టులోకి వచ్చిన చాలా మంది మెరుగ్గా ఆడటానికి కారణం ఏంటి? అనే ప్రశ్న తలెత్తడం సహజమే. దీనికి భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పైనా స్పందించాడు.
‘‘ఆటగాళ్లలో టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. దానికి తగ్గట్టు అవకాశాలు రావాలి. కుర్రాళ్లకు ఛాన్స్లు ఇవ్వాలి. అవకాశం ఇవ్వడమే కాకుండా.. సవాళ్లను తట్టుకొనేలా వారిలో భరోసా నింపాలి. ఇప్పుడు చెన్నై జట్టులోని రిజ్వీని చూస్తే అర్థమవుతుంది. అతడి ఆత్మవిశ్వాసం తారస్థాయిలో ఉంది. ఇతడే వేరే జట్టులో ఉంటే ఇలానే ఆడతాడని చెప్పలేం. అదే ధోనీ వద్దకు వస్తే మాత్రం ఆటగాడిలోని సత్తా ఏంటో బయటకు వస్తుంది. మంచి నాయకుడు.. సదరు ప్లేయర్ వెనుక నిలబడి నడిపించడమే కాకుండా నమ్మకం కల్పించాలి. చెన్నై జట్టులోకి వచ్చిన ఆటగాళ్లపై ధోనీ ప్రభావం ఉంటుంది.
ఈ సీజన్లో చెన్నై తరఫున ఒక్కసారి మాత్రమే ధోనీ బ్యాటింగ్ను చూశాం. టీమ్ ఓడిపోయినప్పటికీ అతడి ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. కానీ, ధోనీ తొలి రెండు మ్యాచుల్లో 8వ స్థానంలో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ, అవకాశం రాలేదు. దీనికి కూడా కారణం ఉంది. ఇక్కడో సామెత చెప్పాలి.. గ్యాలన్ వెనిగర్ కంటే ఒక్క తేనె చుక్క ఎక్కువ ఈగలను ఆకర్షిస్తుంది. ఏ ఆటగాడు ఎక్కడ సరిపోతాడనే విషయం ధోనీకి తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. అతడు బ్యాటింగ్ చేస్తూ ఫినిషర్గా వచ్చాడంటే జట్టుకు ఎంతో బలం. జడేజా, ధోనీ లోయర్ ఆర్డర్లో ఉంటే 1 + 1 = 11 అయినట్లుగా ఉంటుంది. కొత్తతరం నాయకత్వం, యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ఆగిపోతున్నాడనేది సుస్పష్టం’’ అని నవ్జ్యోత్ సిద్ధూ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్