IPL: ఐపీఎల్లో ఒక్క రోజు కామెంట్రీకి రూ.25 లక్షలు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్తో భారత మాజీ ఆటగాడు నవ్జ్యోత్ సింగ్ వ్యాఖ్యాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఆటగాడు నవ్జ్యోత్ సింగ్ (Navjot Singh Sidhu) దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు. ఐపీఎల్ (IPL) 2024 సీజన్తో వ్యాఖ్యాతగా సిద్ధు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సిద్ధు కామెంటరీ ప్రత్యేకంగా ఉంటుంది. కామెంటరీ బాక్స్లో తనదైన శైలిలో పంచ్లు, ప్రాసలు, ఛలోక్తులతో నవ్వులు పూయిస్తాడు. ఈ ఐపీఎల్ సీజన్ వచ్చే టీ20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయడానికి భారత్తోపాటు అన్ని దేశాలకు ఉపయోగపడుతుందని నవ్జ్యోత్ సింగ్ పేర్కొన్నాడు.‘‘ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఐపీఎల్పైనే ఉంది. భారత ఆటగాళ్లతోపాటు విదేశీ ప్లేయర్లకు ఐపీఎల్ రూపంలో మంచి అవకాశం దొరికింది. ఇక్కడ రాణించి వచ్చే టీ20 ప్రపంచకప్లో జట్టుకు ఎంపిక కావొచ్చు’’ అని సిద్ధు వివరించాడు.
‘‘క్రికెట్ అనేది నా ఫస్ట్ లవ్. మీ అభిరుచి మీ వృత్తిగా మారితే దానికంటే గొప్పది మరొకటి ఉండదు. క్రికెట్లో 20 సార్లు పునరాగమనం చేశా. కామెంటేటర్గా మాత్రం ఇదే ఫస్ట్ కమ్ బ్యాక్. చేపకు ఈత నేర్పడం ఎలాంటిదో ఎవరైనా నాకు కామెంట్రీ గురించి చెప్పడం కూడా అలాంటిదే. గ్యాప్ వచ్చినా నాలో మాటల పదును తగ్గలేదు. త్వరలోనే ఆ విషయం మీకర్థమవుతుంది. వ్యాఖ్యాతగా కెరీర్ను మొదలుపెట్టినప్పుడు నేను ఏ మాత్రం కాన్ఫిడెంట్గా లేను. కానీ, ప్రపంచ కప్లో అదరగొట్టడం అభిమానులతోపాటు నన్ను ఆశ్చర్చపరిచింది. గతంలో టోర్నీ మొత్తం కామెంట్రీ చేస్తే రూ.60-70 లక్షలు పారితోషికంగా ఇచ్చేవారు. నేను ఐపీఎల్లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నా. ఐపీఎల్లో కేవలం డబ్బుతో మాత్రమే సంతృప్తి దొరకదు. ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుంది’’ అని సిద్ధు పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!