Rohit Sharma: ఇతరుల కెప్టెన్సీలో ఆడినా.. ధోనీ - రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదు: సిద్ధూ
హార్దిక్ పాండ్య నాయకత్వంలో ముంబయి తొలి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో అతడి సారథ్యంపైనా విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ జట్టు మాజీ సారథి రోహిత్ పట్ల అతడు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్లో రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన పాండ్య జట్టును గెలిపించలేకపోయాడు. సర్కిల్ లోపలే ఫీల్డింగ్ చేసే రోహిత్ను బౌండరీ లైన్ వద్ద ఉంచడంతో పాండ్యపై కామెంట్లు పెరిగిపోయాయి. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ పట్ల హార్దిక్ ఇలా ప్రవర్తించడం సరైంది కాదని.. రోహిత్ స్థాయి ఎలాంటిదో తెలుసుకోవాలని అభిమానులు హితవు పలికారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల కెప్టెన్సీలో ఆడినంత మాత్రాన ధోనీ, రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు.
‘‘నేను దాదాపు ఐదుగురు కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, సునీల్ గావస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవి శాస్త్రి నాయకత్వంలో పనిచేశా. వారందరితో ఆడటం వల్ల నామీద ఎలాంటి ప్రభావం పడలేదు. ఎందుకంటే జాతీయ జట్టుకోసం ఆడామనే భావనతో ఉంటాం. ఇప్పుడు కూడా హార్దిక్ సారథ్యంలో రోహిత్ ఆడినంత మాత్రాన అతడి స్థాయి ఏమీ తగ్గదు. ఫ్రాంచైజీ క్రికెట్లో కేవలం ప్రదర్శనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్లో చెన్నై తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్కు అప్పగించాడు. కనీసం మూడేళ్లు చూశాక పనితీరు బాగోలేకపోతే మరొకరిని ఎంపిక చేస్తారు. ధోనీ, రోహిత్ గొప్ప ఆటగాళ్లు. అందులో ఎవరికీ అనుమానం లేదు’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.
విరాట్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడమే కారణం: ధావన్
చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేశ్ కార్తిక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అయితే, తమ ఓటమికి కారణం కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను వదిలేయడమేనని ధావన్ వ్యాఖ్యానించాడు. ‘‘మ్యాచ్లో గెలిచే అవకాశాలను మేం వృథా చేసుకున్నాం. కనీసం మరో 15 పరుగులు చేస్తే బాగుండేది. నేను కూడా తొలి ఆరు ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడా. విరాట్ కోహ్లీ 70+ స్కోరు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడిలాంటి క్లాస్ ప్లేయర్ క్యాచ్ను వదిలేయడమే మేం చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ క్యాచ్ను అందుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మా బౌలర్ల విషయంలో అసంతృప్తేమీ లేదు. బ్రార్ నాణ్యమైన బౌలింగ్తో మమ్మల్ని రేసులో నిలిపాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీయడం అభినందనీయం. ఫీల్డింగ్లో మేం ఇంకాస్త మెరుగుపడాలి’’ అని ధావన్ తెలిపాడు.
ఆ సమయంలో నా స్ట్రైక్రేట్ దారుణం: సెహ్వాగ్
తొలి సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్న మూడు ఫ్రాంచైజీలు మాత్రమే ఒక్కసారి కూడా టైటిల్ను నెగ్గలేదు. అందులో పంజాబ్ జట్టు కూడా ఒకటి. ఈ టీమ్కు భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సెహ్వాగ్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను పంజాబ్ జట్టుకు వెళ్లినప్పుడు నా స్ట్రైక్రేట్ దారుణంగా పడిపోయింది. ఇక్కడో సామెత ఉంది. మనం పని చేస్తున్న సంస్థ మాదిరిగానే మన పనితీరు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే అప్పుడు మా జట్టు కూడా ఎక్కువగా విజయాలు సాధించలేదు. మా ఆటతీరు కూడా అదేస్థాయిలో ఉంది’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ