Neeraj chopra: నాటి లడ్డూనే.. నేటి గోల్డ్ ఎహే: బల్లెం వీరుడి కథ తెలుసా..?
నీరజ్ చోప్రా.. చిన్నతనంలో జాగింగ్కు వెళ్లమంటే.. అమ్మో నేను చేయలేనని ముసుగు తన్ని పడుకునేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పాతికేళ్లకే ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 13 ఏళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో ఊబకాయుడిగా మారిన ఆ కుర్రాడు.. కేవలం బరువు తగ్గడం కోసమే ఆటల్లోకి వచ్చాడు. ఆ తర్వాత అదే ఆటను వ్యసనంగా మార్చుకుని ప్రాణం పెట్టాడు. కాలం గిర్రున తిరిగింది. ఆనాడు అనుకోకుండా చేతబట్టిన ‘బల్లెం (Javelin)’తోనే.. ఇప్పుడా కుర్రాడు సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. అతడే మన ప్రపంచ ఛాంపియన్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra). పాతికేళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడిని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కుటుంబం ఒత్తిడితో జాగింగ్..
హరియాణా (Haryana)లోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు నీరజ్ చోప్రా (Neeraj Chopra). అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లే. 17 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నీరజ్.. చిన్న తనంలో చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 13 ఏళ్లకే 90 కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్లు జాగింగ్, వ్యాయామం చేయమన్నా ససేమిరా అనేవాడు. ఫిట్నెస్ గురించి అసలు ఆలోచించేవాడు కాదు. ఇక, అల్లరి కూడా విపరీతంగా చేసేవాడు. దీంతో అతడిని ఎలాగైనా క్రమశిక్షణలో పెట్టాలని అతడి తండ్రి సతీశ్ కుమార్ చోప్రా నిర్ణయించుకున్నాడు. కుటుంబసభ్యులంతా ఒత్తిడి చేయడంతో చివరకు రోజూ జాగింగ్ చేసేందుకు అంగీకరించాడు.
అలా జావెలిన్తో ప్రేమలో పడి..
ఓసారి తన బంధువు ఒకరు నీరజ్ను స్థానిక శివాజీ స్టేడియానికి తీసుకెళ్లారు. అక్కడ జాగింగ్ చేస్తుండగా.. కొంతమంది జావెలిన్ త్రో (Javelin Throw) ఆటగాళ్లు అతడికి తారసపడ్డారు. అక్కడ జై చౌధరీ అనే ఆటగాడు.. జావెలిన్ను నీరజ్ చేతికిచ్చి విసరమని చెప్పాడు. భారీ కాయంతో ఉన్నప్పటికీ నీరజ్ ఎంతో చక్కగా దాన్ని విసిరాడు. ఆటపై ఏ మాత్రం అవగాహన లేకపోయినా తొలిసారే 35-40 మీటర్ల దూరం జావెలిన్ను విసిరాడు. ఏ క్షణాన నీరజ్ ఈటెను పట్టుకున్నాడో గానీ.. అప్పుడే దానితో ప్రేమలో పడిపోయాడు.
జావెలిన్ ఫైనల్ పోరును.. భారత్ vs పాక్లానే చూశారు: నీరజ్ చోప్రా
జావెలిన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఒకవైపు ఆశ్చర్యపోయినా.. అతడి ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు.
కెరీర్ మొదలైందిలా..
ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్ 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించి సైన్యంలో పని చేస్తూనే అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు.
ఒలింపిక్స్తో స్టార్డమ్..
రెండేళ్ల ముందు వరకు నీరజ్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఒలింపిక్స్ (Olympics)లో స్వర్ణంతో మెరిశాడో.. ఆ తర్వాత అతడి స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో పసిడి సాధించిన నీరజ్ (Neeraj Chopra).. ట్రాక్ అండ్ ఫీల్డ్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేగాక, లెజండరీ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు. అప్పటికి నీరజ్ వయసు 23 ఏళ్లే.
ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్..
ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (World Championships)లో ఈ సూపర్ స్టార్ అథ్లెట్ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 88.17 మీటర్ల ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రోలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేనా.. అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్స్ టైటిల్ రెండూ నెగ్గిన రెండో భారతీయుడు కూడా ఇతడే కావడం విశేషం. బింద్రా కూడా తన 23 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ టైటిల్, 25 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ బంగారు పతకం గెలుచుకున్నాడు.
పాతికేళ్లకే విశ్వవిజేతగా ఆవిర్భవించిన నీరజ్ చోప్రా.. మున్ముందు మరింత విజయాలు అందుకునే అవకాశాలున్నాయి. మరో ఐదేళ్లలో అతడు రెండుసార్లు ఒలింపిక్స్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పోటీ పడొచ్చు. మన ‘గోల్డెన్ బాయ్’ భవిష్యత్తులో మరిన్ని స్వర్ణాలను ముద్దాడాలని కోరుకుందాం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన