Pat Cummins: కెప్టెన్ మారాడు.. హైదరాబాద్ కథ మారేనా?
కెప్టెన్ మార్పు జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్లో సన్రైజర్స్ కథ సరికొత్తగా మొదలవుతుందా? నేడు కోల్కతాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
అగ్రశ్రేణి బ్యాటర్లకు కొదవలేదు.. స్టార్ బౌలర్లూ ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే పవర్ హిట్టర్లూ ఉన్నారు. కానీ 2016లో ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత హైదరాబాద్ ప్రదర్శన పడిపోతూ వచ్చింది. ఆటతో పాటు ఆటేతర విషయాల్లోనూ వివాదాలు చుట్టుముట్టాయి. సొంత జట్టుపై తెలుగు అభిమానులకు నమ్మకం పోయే పరిస్థితి. ఈ దశలో ఈ ఏడాది ఐపీఎల్ కోసం హైదరాబాద్ ఓ కీలక మార్పు చేసింది. వేలంలో భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను.. సన్రైజర్స్ సారథిగా నియమిస్తూ ఆ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ కోల్కతాతో తొలిపోరుకు సిద్ధమైంది. మరి ఈ మార్పు.. జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్లో సన్రైజర్స్ కథ సరికొత్తగా మొదలవుతుందా
అప్పుడొకటి.. ఇప్పుడొకటి
ఐపీఎల్లో హైదరాబాద్ అంటే అప్పటి డెక్కన్ ఛార్జర్స్.. ఆ తర్వాత సన్రైజర్స్. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో తలపడ్డ ఎనిమిది జట్లలో డెక్కన్ ఛార్జర్స్ ఒకటి. 2009లో గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో ఆ జట్టు విజేతగా నిలిచింది. అయితే నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2012లో ఆ ఫ్రాంఛైజీని ఐపీఎల్ రద్దు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు హక్కులను దక్కించుకున్న సన్ టీవీ నెట్వర్క్.. సన్రైజర్స్ హైదరాబాద్గా 2013లో లీగ్లో అడుగుపెట్టింది. ఆ ఏడాది ప్లేఆఫ్స్కు చేరింది. కానీ తర్వాతి రెండు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో కప్పు సొంతం చేసుకుంది. 2018లో రన్నరప్గా నిలిచింది. 2021 నుంచి ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. నిరుడు 10 జట్లు తలపడితే సన్రైజర్స్ పదో స్థానంలో నిలిచింది.
వార్నర్ను వద్దని.. కేన్ను కాదని
సన్రైజర్స్కు ఆకర్షణ తెచ్చి.. జట్టును అభిమానులకు మరింత చేరువ చేసిన వార్నర్, కేన్ విలియమ్సన్ను ఫ్రాంఛైజీ వదులుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. డేవిడ్ భాయ్గా వార్నర్.. కేన్ మామగా విలియమ్సన్ తెలుగు అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు. పైగా జట్టు కోసం వీళ్లు చాలా చేశారు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్న వార్నర్.. ఆ ఏడాది ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) కూడా అందుకున్నాడు. 2016లో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. 2017లో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. బాల్ టాంపరింగ్ కారణంగా వార్నర్ 2018 సీజన్కు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టిన విలియమ్సన్ జట్టును ఫైనల్ చేర్చాడు. ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసింది అతనే. మళ్లీ జట్టులోకి వచ్చిన వార్నర్ 2019లో ఆరెంజ్ క్యాప్ తిరిగి దక్కించుకున్నాడు. 2020లో మళ్లీ కెప్టెన్గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. కానీ 2021 సీజన్ మధ్యలో వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించి విలియమ్సన్కు బాధ్యతలు అప్పజెప్పడం.. ఆ తర్వాత వార్నర్ను వదులుకోవడం వివాదాస్పదంగా మారింది. 2022 తర్వాత విలియమ్సన్కూ గుడ్బై చెప్పడంతో ఫ్రాంఛైజీపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిన్స్పై భారం
ఇప్పుడు సన్రైజర్స్ను అత్యుత్తమ ప్రదర్శన దిశగా నడిపించడంతో పాటు అభిమానుల ఆదరణను తిరిగి సంపాదించే భారం కమిన్స్పై ఉంది. గత కొద్దికాలంగా ఆస్ట్రేలియా సారథిగా కమిన్స్ అద్భుత ప్రదర్శనతో సాగుతున్నాడు. గత 9 నెలల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్, యాషెస్ను నిలబెట్టుకోవడం, వన్డే ప్రపంచకప్ గెలవడం.. ఇలా ఆసీస్ కెప్టెన్గా కమిన్స్ గొప్ప ఘనతలు దక్కించుకున్నాడు. అందుకే జట్టు రాతను మార్చే కెప్టెన్ వేటలో ఉన్న సన్రైజర్స్ నిరుడు వేలంలో కమిన్స్ కోసం ఏకంగా రూ.20.25 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు అతడే. ఇప్పుడు మార్క్రమ్ స్థానంలో సన్రైజర్స్ కెప్టెన్గా కమిన్స్ ఎంపికయ్యాడు. బ్యాటింగ్, పేస్ బౌలింగ్తో అదరగొట్టడమే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ సత్తాచాటే అతను.. ఈ సీజన్లో సన్రైజర్స్ కథ మారుస్తాడేమో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు