T20 League : కొత్త కెప్టెన్ల సంగతేంటి.. ఎవరు అదుర్స్.. ఎవరు బెదుర్స్!
జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్పై ఉంటుంది. తన ఆటతీరుతో జట్టుకు మార్గదర్శనం చేయాలి. లేకపోతే ఉన్న ఆటగాళ్లను సరైన సమయంలో ఉపయోగించుకోగలిగిన చాతుర్యమైనా ఉండాలి. ప్రస్తుతం టీ20 లీగ్లో ఆరు జట్లకు నూతన సారథులు ఉన్నారు. వీరిలో ఎవరు బాగా ఆడుతున్నారు..? జట్టును ఎలా నడిపిస్తున్నారనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్పైనే ఉంటుంది. తన ఆటతీరుతో జట్టుకు మార్గదర్శనం చేయాలి. లేకపోతే ఉన్న ఆటగాళ్లను సరైన సమయంలో ఉపయోగించుకోగలిగిన చాతుర్యమైనా ఉండాలి. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్లో ఆరు జట్లకు కొత్త సారథులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిలో ఎవరు బాగా ఆడుతున్నారు..? ఎవరు ఎలా తమ జట్లను నడిపిస్తున్నారనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం..
టీ20 టోర్నీ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. లీగ్ దశలో కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఒక్కో జట్టు కనీసం తలా ఏడేసి మ్యాచ్లను ఆడేశాయి. మరికొన్ని ఎనిమిది పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్లోని నాలుగు స్థానాల కోసం పోరాటం ప్రారంభమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (14) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ (12), హైదరాబాద్ (10), లఖ్నవూ (10), బెంగళూరు (10), పంజాబ్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక దిల్లీ (6), కోల్కతా (6), చెన్నై (4).. ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబయి అయితే ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ పరాజయం పాలై ఖాతానే ఓపెన్ చేయకుండా అట్టడుగున ఉంది.
కెప్టెన్సీ ఆటతో అగ్రస్థానం
కొత్త జట్టు గుజరాత్.. హార్దిక్ పాండ్యపై నమ్మకం ఉంచి తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా అగ్రస్థానంలో దూసుకుపోతోంది. అతడు కెప్టెన్గానే కాకుండా బ్యాటింగ్లోనూ ధాటిగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 305 పరుగులు చేసి టాప్ బ్యాట్స్మెన్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి మూడు మ్యాచుల్లో ఫర్వాలేదనిపించినా.. గత రెండు మ్యాచ్ల్లో అసలు బౌలింగే చేయలేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన పాండ్య ఇప్పుడు కుదురుకొని రాణిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించడంలోనూ విజయవంతమవుతున్నాడు. దీంతో అభిమానుల మన్ననలూ అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ బౌలింగ్లోనూ సఫలమైతే టీమ్ఇండియా జట్టులోకి మళ్లీ సులువుగా రావచ్చు. గతేడాది ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన పాండ్య నేరుగా ఈ టీ20 లీగ్లోనే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్ను టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ముందుకు తీసుకువెళ్తున్నాడు.
సెంచరీల వీరుడు
కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణిస్తాడు. గత సీజన్లోనూ పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయితే ఆ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈసారి కొత్త జట్టు లఖ్నవూ తరఫున బ్యాటింగ్తో పాటు నాయకత్వ బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచుల్లో రెండు శతకాలు, ఒక అర్ధశతకంతో 368 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 103*. తన జట్టులోని బౌలర్లు అవేశ్ ఖాన్, చమీర, హోల్డర్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ వంటి వారిని చక్కగా వినియోగించుకుని ఫలితాలను రాబడుతున్నాడు. టీమ్ఇండియాకు వైస్ కెప్టెన్గా ఎంపికైన కేఎల్ రాహుల్ ఇలాంటి ఫామ్నే కొనసాగిస్తే కెప్టెన్గా మారే అవకాశమూ లేకపోలేదు. రోహిత్ శర్మ ఫామ్ కూడా ఆందోళన కరంగా ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్కు ఛాన్స్లు ఉన్నాయి.
అప్పుడప్పుడు మాత్రమే..
కేఎల్ రాహుల్ ఈ సీజన్లో కొత్త జట్టు లఖ్నవూ కెప్టెన్గా వెళ్లడంతో పంజాబ్ యాజమాన్యం సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్కు అప్పగించింది. అయితే ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన ఆ జట్టు.. నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఒక మ్యాచ్కు దూరమైన మయాంక్ ఏడింట్లో ఆడాడు. బ్యాటర్గా కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన మయాంక్ 136 పరుగులు మాత్రమే చేశాడు. అయితే జట్టును నడిపించడంలో సక్సెస్ అయినట్టే ఉన్నా.. బ్యాటర్గానూ రాణిస్తేనే కెప్టెన్గా విజయవంతమైనట్లు. ఇకపై మిగిలిన మ్యాచుల్లో అతడు పరుగుల పరంగా ముందుండి నడిపించాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందని ఆశగా ఎదురుచూస్తోంది.
కోల్ ‘కథ’ మార్చలేక..
గత సీజన్లో ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా ముందడుగు వేయలేక కప్ను చేజార్చుకుంది. ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్లను కాదని శ్రేయస్ అయ్యర్ను భారీ మొత్తానికి కొనుగోలు చేసి మరీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే రెండు మ్యాచ్ల్లోనే అర్ధశతకాలు సాధించాడు. ఒక మ్యాచ్లో 85 పరుగులు చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. భవిష్యత్తులో టీమ్ఇండియా సారథిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్న క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. అయితే 2020 సీజన్లో దిల్లీని ఫైనల్కు చేర్చిన ఘనత ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం తన వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోతున్నాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. అతడు ఎనిమిది మ్యాచ్లు ఆడగా 248 పరుగులు చేశాడు.
అట్టర్ ఫ్లాప్..
ప్రస్తుత సీజన్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ ఎవరంటే మాత్రం ఠక్కున వచ్చే సమాధానం రవీంద్ర జడేజా. ఎంఎస్ ధోనీ స్థానంలో చెన్నై జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన జడేజా మిడిలార్డర్లో వెన్నెముకగా ఉండాలి. అయితే ఇప్పటి వరకు 8 మ్యాచులను ఆడిన జడేజా కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాచ్ను గెలిపించాల్సిన తరుణంలోనూ ధాటిగా ఆడలేక చతికిలపడ్డాడు. ఇటు బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపిందేమీ లేదు. కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. లీగ్ ముందు వరకు ఆల్రౌండర్గా కీలకంగా మారిన రవీంద్ర జడేజా తన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. ఇటు చెన్నై జట్టును నడపడంలోనూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ధోనీ షాడో కెప్టెన్గా వ్యవహరిస్తుండటమే దీనికి కారణమని జడేజా అభిమానులు పైకి చెబుతున్నా.. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వ్యక్తిగతంగా రాణించడంలోనూ జడేజా సక్సెస్ కాలేకపోయాడు.
మొదట్లో అదరగొట్టేశాడు..
గత ఆరేళ్లుగా టీ20 లీగ్ టోర్నీ మ్యాచ్లు ప్రారంభం నుంచే ఒకటే నినాదం.. ఈసాలా నమదే.. బెంగళూరు జట్టును కప్ వైపు నడిపిస్తాడని భారీ ధరకు అట్టిపెట్టుకున్న మ్యాక్స్వెల్ను కాదని డుప్లెసిస్ను కొనుగోలు చేసి మరీ బాధ్యతలు అప్పగించింది. మొదటి మ్యాచ్ను ఓడినా తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి రేసులోకి వచ్చింది. అయితే చెన్నైతో ఓటమిపాలైనప్పటికీ పుంజుకొని మరీ రెండు విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్-4లోకి వెళ్లింది. అయితే హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై ఘోరంగా ఓడి మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో ప్రదర్శన బాగోలేనప్పటికీ వ్యక్తిగతంగా డుప్లెసిస్ రాణిస్తున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అత్యధిక స్కోరు 95 కాగా.. రెండు అర్ధశతకాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి