IND vs ENG: నాలుగో టెస్టులో పేస్కు పెద్దన్న పాత్ర.. సిరాజ్ నెగ్గుకురాగలడా?
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు (IND vs ENG) కొన్ని మార్పులు చేస్తూ భారత్ స్క్వాడ్ను ప్రకటించింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ముకేశ్ కుమార్ను తీసుకుంది. అయితే, తుది జట్టులో మాత్రం కొత్త ఆటగాడికి అవకాశం వస్తుందనే చర్చ సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో మూడు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రాకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నాలుగో టెస్టులో మరో కుర్రాడు ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉన్నా.. పేసర్ల పాత్రనూ తక్కువ చేయలేం. ఇప్పటికే మొదటి మూడింట్లో ఈ విషయం తేటతెల్లమైంది. బుమ్రా ఒంటి చేత్తో పేస్ భారాన్ని మోసి వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రాంచీ టెస్టులో సిరాజ్ ముందుండి నడిపించాలి. ఇప్పటిదాకా టెస్టుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే సిరాజ్ సీనియర్ పాత్ర పోషించాడు.. మరి ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
గతేడాది ఆసియా కప్ నుంచి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు పక్కాగా జట్టులో స్థానం లభిస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్లోనూ నాణ్యమైన పేస్తో చెలరేగాడు. వరల్డ్ కప్లో బుమ్రా, షమీ తోడుగా ఉండేవారు. భారం మొత్తం వారి మీదే వేసుకునేవారు. దీంతో సిరాజ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్ వేసేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. బుమ్రా పోషించిన పాత్రను సిరాజ్ తన నెత్తిన మోయాల్సి ఉంది. ఎందుకంటే బుమ్రా ఇంగ్లాండ్పై మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు వేసి 17 వికెట్లు తీశాడు. అతడే టాప్ వికెట్ టేకర్. కానీ, సిరాజ్కు వైజాగ్ టెస్టులో మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. మిగతా రెండు టెస్టుల్లో సిరాజ్ 36 ఓవర్లు విసిరాడు. కేవలం 4 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే గొప్పగా ఏమీ లేవు. కానీ, ఇప్పటి వరకు సిరాజ్ తన కెరీర్లో 25 మ్యాచుల్లో 72 వికెట్లు పడగొట్టాడు. తన తొలి టెస్టులోనే (2020) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. లార్డ్స్లోనూ ఇంగ్లాండ్పైనే ఎనిమిది వికెట్లు తీశాడు. సీనియర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా ఉన్నా అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా ఆసీస్పై బ్రిస్బేన్లో యువ పేసర్లు నటరాజన్, నవ్దీప్ సైని, మరో మీడియం పేసర్ శార్దూల్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని సిరాజ్ ముందుండి నడిపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్లో రిషభ్ పంత్ (89) వీరోచిత ఇన్నింగ్స్తో సిరాజ్ ప్రదర్శన వెనుకబడిపోయింది.
అలా కాకుండా..
రాంచీలో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేస్తేనే సిరాజ్ మరికొన్నాళ్లు గుర్తుండిపోతాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా సిరాజ్కు ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇటీవల ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ ఫలితం రాబట్టాలని ప్రయత్నించడం బెడిసి కొడుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇలాంటి బాల్స్కు అస్సలు భయపడరు. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి వికెట్ల మీదకు బంతులేస్తేనే ప్రయోజనం ఉంటుంది. బుమ్రా చేసిందదే.. బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆ సూత్రాన్నే సిరాజ్ కూడా తన బౌలింగ్లోనూ పాటించి బంతులు విసిరితే తిరుగుండదు. 25 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన సిరాజ్.. ముకేశ్ కుమార్ లేదా ఆకాశ్ దీప్తో కూడిన పేస్ బౌలింగ్ను సరైన మార్గంలో నడిపించాలి. ముకేశ్ కుమార్ అనుభవం ఉన్నప్పటికీ.. రెండో టెస్టులో అతడూ భారీగానే పరుగులు సమర్పించాడు. ఇక ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్కు కొత్త. రాంచీలోనూ భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు మెండు.
ఇండియా A తరఫున అదరగొట్టిన ఆకాశ్..
బెంగాల్ తరఫున ఆకాశ్ దీప్ దేశవాళీలో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 30 మ్యాచ్లు ఆడిన ఆకాశ్ దీప్ 104 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ లయన్స్తో భారత్ A తరఫున రెండు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. బిహార్లో పుట్టిన ఆకాశ్కు కుటుంబం నుంచి ఆరంభంలో పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. కానీ, ఆటపై ఇష్టంతో అన్ని కష్టాలను అధిగమించి ఇప్పుడు జాతీయ జట్టులోకి వచ్చాడు. ఒకవేళ నాలుగో టెస్టులో అతడు అరంగేట్రం చేస్తే.. ఇదే సిరీస్లో డెబ్యూ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. సర్ఫరాజ్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్ ఈ వరుసలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్