IND vs ENG: నాలుగో టెస్టులో పేస్కు పెద్దన్న పాత్ర.. సిరాజ్ నెగ్గుకురాగలడా?
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు (IND vs ENG) కొన్ని మార్పులు చేస్తూ భారత్ స్క్వాడ్ను ప్రకటించింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ముకేశ్ కుమార్ను తీసుకుంది. అయితే, తుది జట్టులో మాత్రం కొత్త ఆటగాడికి అవకాశం వస్తుందనే చర్చ సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో మూడు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రాకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నాలుగో టెస్టులో మరో కుర్రాడు ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉన్నా.. పేసర్ల పాత్రనూ తక్కువ చేయలేం. ఇప్పటికే మొదటి మూడింట్లో ఈ విషయం తేటతెల్లమైంది. బుమ్రా ఒంటి చేత్తో పేస్ భారాన్ని మోసి వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రాంచీ టెస్టులో సిరాజ్ ముందుండి నడిపించాలి. ఇప్పటిదాకా టెస్టుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే సిరాజ్ సీనియర్ పాత్ర పోషించాడు.. మరి ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
గతేడాది ఆసియా కప్ నుంచి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు పక్కాగా జట్టులో స్థానం లభిస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్లోనూ నాణ్యమైన పేస్తో చెలరేగాడు. వరల్డ్ కప్లో బుమ్రా, షమీ తోడుగా ఉండేవారు. భారం మొత్తం వారి మీదే వేసుకునేవారు. దీంతో సిరాజ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్ వేసేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. బుమ్రా పోషించిన పాత్రను సిరాజ్ తన నెత్తిన మోయాల్సి ఉంది. ఎందుకంటే బుమ్రా ఇంగ్లాండ్పై మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు వేసి 17 వికెట్లు తీశాడు. అతడే టాప్ వికెట్ టేకర్. కానీ, సిరాజ్కు వైజాగ్ టెస్టులో మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. మిగతా రెండు టెస్టుల్లో సిరాజ్ 36 ఓవర్లు విసిరాడు. కేవలం 4 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే గొప్పగా ఏమీ లేవు. కానీ, ఇప్పటి వరకు సిరాజ్ తన కెరీర్లో 25 మ్యాచుల్లో 72 వికెట్లు పడగొట్టాడు. తన తొలి టెస్టులోనే (2020) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. లార్డ్స్లోనూ ఇంగ్లాండ్పైనే ఎనిమిది వికెట్లు తీశాడు. సీనియర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా ఉన్నా అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా ఆసీస్పై బ్రిస్బేన్లో యువ పేసర్లు నటరాజన్, నవ్దీప్ సైని, మరో మీడియం పేసర్ శార్దూల్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని సిరాజ్ ముందుండి నడిపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్లో రిషభ్ పంత్ (89) వీరోచిత ఇన్నింగ్స్తో సిరాజ్ ప్రదర్శన వెనుకబడిపోయింది.
అలా కాకుండా..
రాంచీలో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేస్తేనే సిరాజ్ మరికొన్నాళ్లు గుర్తుండిపోతాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా సిరాజ్కు ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇటీవల ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ ఫలితం రాబట్టాలని ప్రయత్నించడం బెడిసి కొడుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇలాంటి బాల్స్కు అస్సలు భయపడరు. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి వికెట్ల మీదకు బంతులేస్తేనే ప్రయోజనం ఉంటుంది. బుమ్రా చేసిందదే.. బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆ సూత్రాన్నే సిరాజ్ కూడా తన బౌలింగ్లోనూ పాటించి బంతులు విసిరితే తిరుగుండదు. 25 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన సిరాజ్.. ముకేశ్ కుమార్ లేదా ఆకాశ్ దీప్తో కూడిన పేస్ బౌలింగ్ను సరైన మార్గంలో నడిపించాలి. ముకేశ్ కుమార్ అనుభవం ఉన్నప్పటికీ.. రెండో టెస్టులో అతడూ భారీగానే పరుగులు సమర్పించాడు. ఇక ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్కు కొత్త. రాంచీలోనూ భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు మెండు.
ఇండియా A తరఫున అదరగొట్టిన ఆకాశ్..
బెంగాల్ తరఫున ఆకాశ్ దీప్ దేశవాళీలో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 30 మ్యాచ్లు ఆడిన ఆకాశ్ దీప్ 104 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ లయన్స్తో భారత్ A తరఫున రెండు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. బిహార్లో పుట్టిన ఆకాశ్కు కుటుంబం నుంచి ఆరంభంలో పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. కానీ, ఆటపై ఇష్టంతో అన్ని కష్టాలను అధిగమించి ఇప్పుడు జాతీయ జట్టులోకి వచ్చాడు. ఒకవేళ నాలుగో టెస్టులో అతడు అరంగేట్రం చేస్తే.. ఇదే సిరీస్లో డెబ్యూ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. సర్ఫరాజ్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్ ఈ వరుసలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!