Mumbai Indians: భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి లీగ్ స్టేజ్కే పరిమితమైంది. కెప్టెన్సీ మార్పు చేపట్టినా ఆ జట్టుకు కలిసిరాలేదు. ఇప్పటికే దానిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే నలుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలోనే టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో తమ జట్టు సభ్యులకు ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ప్రత్యేక సందేశం ఇచ్చారు.
‘‘మనకు ఇది చాలా నిరుత్సాహకరమైన సీజన్. మనం అనుకున్న విధంగా అన్నీ సాగవు. ఇప్పటికీ నేను ముంబయి ఇండియన్స్కు అతిపెద్ద ఫ్యాన్ను. ఈ జట్టు జెర్సీని ధరించడాన్ని గౌరవంగా భావిస్తా. అది నాకు గర్వకారణం. ఈ సీజన్లో మనం ఎక్కడ వెనుకబడ్డామో సమీక్షించుకుందాం. తప్పకుండా భవిష్యత్తులో బలంగా ముందుకొస్తాం. జాతీయ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్. రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా.. మీ ప్రదర్శనతో భారతీయులను సంతోషపరుస్తారని ఆశిస్తున్నా. భారత్ టైటిల్ను తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని నీతా అంబానీ తెలిపారు. ఈ సీజన్లో ముంబయి 14 మ్యాచుల్లో కేవలం నాలుగింట్లోనే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది.
మరో ఐదు రోజుల్లో పయనం..
అమెరికా - విండీస్ ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు భారత్ జట్టులోని కొందరు మే 25న పయనం కానున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. మిగతావారూ యూఎస్ఏకు వెళ్తారు. జూన్ 5న ఐర్లాండ్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాక్, జూన్ 12న యూఎస్ఏ, జూన్ 15న కెనడాతో భారత్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు