Nitish Reddy: ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త ఆల్రౌండర్ దొరికిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy).. పేస్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోనూ మంచి ఇన్నింగ్స్లతో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) టీ20 టోర్నీ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గురువారం నిర్వహించిన బిడ్డింగ్లో నితీశ్ను గోదావరి టైటాన్స్ రూ.15.60 లక్షలకు దక్కించుకుంది. గుజరాత్తో హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ బిడ్డింగ్ను లైవ్లో చూసిన నితీశ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోను ఏపీఎల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. గత సీజన్లో హనుమ విహారి రూ.6.60 లక్షలు దక్కించుకున్నాడు. ఇప్పుడు దానిని నితీశ్ అధిగమించాడు.
20 ఏళ్ల నితీశ్ ఈసారి ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్ల్లోనే 239 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బౌలింగ్లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడటంతోపాటు క్లిష్టపరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపిస్తున్నాడనే ప్రశంసలు అందుకొన్నాడు. పేస్ ఆల్రౌండర్లు తక్కువగా ఉండే టీమ్ఇండియాకు భవిష్యత్తులో నితీశ్ తప్పకుండా ఆడతాడని మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.
ఏపీఎల్ అంటే..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 లీగ్ ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’. రెండేళ్ల కిందట దీనిని ప్రారంభించారు. ఇందులో ఆరు జట్లు.. బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లైయన్స్, వైజాగ్ వారియర్స్ పోటీపడతాయి. ఈ లీగ్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు శ్రీకర్ భరత్, హనుమ విహారి తదితరులు ఆడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐర్లాండ్ చేతిలో.. పాక్ - యూఎస్ఏ ‘సూపర్ - 8’ భవితవ్యం!
పాపం ఇప్పుడు రెండు టీమ్ల అవకాశాలు ఒక జట్టుతో జరగబోయే మ్యాచ్లపై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ - Aలో ఆసక్తికర పోరు ఇలా ఉంది. -
భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్గా అర్ష్దీప్ అరుదైన ఘనత
భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. యూఎస్ఏపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
న్యూయార్క్ పిచ్పై ఆడటం తేలిక కాదు.. ఇప్పుడదే బిగ్ రిలీఫ్: రోహిత్
న్యూయార్క్లో లీగ్ స్టేజ్లో భారత్ చివరి మ్యాచ్ ఆడేసింది. మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమ్ఇండియా తదుపరి దశకు చేరుకుంది. -
అందుకే ఆ అయిదు పరుగులు
స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో యూఎస్ఏ బౌలర్ల తప్పిదం వల్ల ఆ జట్టు నష్టపోయింది. అనవసరంగా ఐదు పరుగులు భారత్కు ఇవ్వాల్సి వచ్చింది. -
కష్టమైనా.. ఛేదించేశారు.. మ్యాచ్ హైలైట్స్ చూశారా?
టీ20 ప్రపంచ కప్లో భారత్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి.. సూపర్ -8కి చేరింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.
-
కాస్తే అయినా కష్టంగా..
భారత్తో మ్యాచ్ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్సేనకు చెమటలు పట్టించింది. -
సూపర్-8.. ఎంతెంత దూరం
సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లూ టీ20 ప్రపంచకప్ను రసవత్తరంగా మార్చుతున్నాయి. -
కోహ్లీకి ఏమైంది?
టీ20 ప్రపంచకప్కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్లో చెలరేగి ఆడి ఆ చర్చకు తెరదించాడు విరాట్ కోహ్లి. -
ఆసీస్ అలవోకగా..
ఆస్ట్రేలియాకు ఎదురేలేదు. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు దూసుకుపోతోంది. వరుసగా మూడో విజయంతో సూపర్-8లో అడుగుపెట్టింది. -
వివాదాస్పద గోల్పై భారత్ ఫిర్యాదు
భారత్, ఖతార్ మధ్య ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోరుపై మ్యాచ్ కమిషనర్ హామెద్ మొమెని (ఇరాన్)కి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫిర్యాదు చేసింది. -
‘లక్ష్య’ జ్యోతికకు స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్) మెరిసింది. ఇండియా గ్రాండ్ప్రి-3 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో సత్తాచాటింది. -
మేం గెలుస్తామని చెప్పావు.. ఇప్పుడు చూడు ఇలా: యువీతో అఫ్రిది
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ముగిసినా.. ఆ పోరుపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువరాజ్, షాహిద్ అఫ్రిది మధ్య సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్ఖాన్ వాంగ్మూలం
-
చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్ వీడియోపై మెగాస్టార్ పోస్ట్
-
ఐర్లాండ్ చేతిలో.. పాక్ - యూఎస్ఏ ‘సూపర్ - 8’ భవితవ్యం!
-
సమర్థత+విధేయత = అనిత.. అవమానాలు భరించి.. అంచెలంచెలుగా ఎదిగి..
-
ఫెడ్ ఎఫెక్ట్: భారీ లాభాల్లో మొదలైన దేశీయ మార్కెట్లు..
-
1 నుంచి పలు రైళ్ల నెంబర్ల మార్పు