Nitish Reddy: ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త ఆల్రౌండర్ దొరికిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy).. పేస్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోనూ మంచి ఇన్నింగ్స్లతో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) టీ20 టోర్నీ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గురువారం నిర్వహించిన బిడ్డింగ్లో నితీశ్ను గోదావరి టైటాన్స్ రూ.15.60 లక్షలకు దక్కించుకుంది. గుజరాత్తో హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ బిడ్డింగ్ను లైవ్లో చూసిన నితీశ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోను ఏపీఎల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. గత సీజన్లో హనుమ విహారి రూ.6.60 లక్షలు దక్కించుకున్నాడు. ఇప్పుడు దానిని నితీశ్ అధిగమించాడు.
20 ఏళ్ల నితీశ్ ఈసారి ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్ల్లోనే 239 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బౌలింగ్లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడటంతోపాటు క్లిష్టపరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపిస్తున్నాడనే ప్రశంసలు అందుకొన్నాడు. పేస్ ఆల్రౌండర్లు తక్కువగా ఉండే టీమ్ఇండియాకు భవిష్యత్తులో నితీశ్ తప్పకుండా ఆడతాడని మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.
ఏపీఎల్ అంటే..
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 లీగ్ ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’. రెండేళ్ల కిందట దీనిని ప్రారంభించారు. ఇందులో ఆరు జట్లు.. బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లైయన్స్, వైజాగ్ వారియర్స్ పోటీపడతాయి. ఈ లీగ్లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు శ్రీకర్ భరత్, హనుమ విహారి తదితరులు ఆడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం