T20 World Cup 2024: ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్
భారత జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్లో ఆడాలనేది క్రికెటర్ల కల. కానీ, కొందరికే అవకాశం దక్కుతోంది. ఈసారి కూడా 15 మందితో కూడిన జట్టులో అభిమానులు ఆశించినట్లు కొందరికి ఛాన్స్ రాలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో తలపడిన రెండు జట్ల నుంచి.. ఏ ఒక్క ఆటగాడూ వరల్డ్ కప్ కోసం భారత్కు ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వచ్చాయి. ఛాంపియన్ కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్ మాత్రమే ‘ట్రావెల్ రిజర్వ్’గా ఉన్నాడు. ఇక రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ స్పందించాడు. బీసీసీఐ ముందుగానే ఆలోచించి భారత ఆటగాళ్లకు విశ్రాంతి దొరికేలా చేసిందని సరదాగా వ్యాఖ్యానించాడు. భారీ టోర్నీ (టీ20 ప్రపంచకప్) ముంగిట ఇలాంటి నిర్ణయం ఆ జట్టుకు వరంగా మారుతుందని అక్రమ్ తెలిపాడు.
‘‘ఇప్పుడు పొట్టి కప్ కోసం అమెరికాకు వచ్చిన భారత జట్టులో ఎవరూ విశ్రాంతి లేదని చెప్పరు. ముందస్తుగానే ఆలోచించి స్క్వాడ్ను ఎంపిక చేసినట్లుంది. ఐపీఎల్ ఫైనల్కు ఎవరి వచ్చినా రాకపోయినా.. దేశం కోసం ఆడటం చాలా ముఖ్యం. భారత్ ఆటగాళ్లకూ తప్పకుండా వరంలా మారుతుందనుకుంటున్నా. రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ వల్ల చాలా మంది క్రికెటర్ల అలసిపోయారు. అమెరికా కూడా వారికి చాలా దూరం. ఇప్పుడు వారికి దొరికిన విరామంతో మళ్లీ శక్తిని అందిపుచ్చుకోవచ్చు. పాకిస్థాన్ తొలి మ్యాచ్ డల్లాస్లో ఉంది. దానికి ముందు ఒకటి లేదా రెండు ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడనుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆటగాళ్లందరి ఫిట్నెస్ బాగుంది. త్వరగానే ఆట పరిస్థితులకు అలవాటు పడతారు’’ అని వసీమ్ అక్రమ్ తెలిపాడు.
ఈసారి వేలానికి ముందు 3+1 రిటెన్షన్ విధానం?
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల రిటెన్షన్ అత్యంత కీలకంగా మారనుంది. తాజా వార్తల ప్రకారం.. రిటెన్షన్ నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. తమ వద్ద అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల సంఖ్యను పెంచేందుకు ఐపీఎల్ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నలుగురిని రిటెన్షన్ చేసుకోవడం లేదా ముగ్గురి రిటైన్ + ఒక ఆటగాడిని రైట్ టు మ్యాచ్ రూల్తో మార్చుకోవడం చేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు రిటెన్షన్ స్లాట్లను పెంచుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా చాలా సమయం ఉన్న క్రమంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?