IND vs ENG: క్రికెట్ కంటే ఏ ఆటగాడు ఎక్కువ కాదు : రోహిత్ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ స్పందన
ఆకలితో ఉన్న వాడికే అవకాశమంటూ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆటగాళ్లు, పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాల సభ్యులు స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆకలితో ఉన్న వాడికే అవకాశం అంటూ రాంచీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు, రాష్ట క్రికెట్ సంఘాల సభ్యులు స్పందిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, ఆకాశ్దీప్ మెరుగైన ప్రదర్శనతో అవకాశాలు సద్వినియోగం చేసుకోగా రంజీ ట్రోఫీలో తమ రాష్ట్రాల తరఫున ఆడమని బీసీసీఐ ఆదేశించినా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో రోహిత్ ఆ వ్యాఖ్యలు చేశాడు.
‘‘నేను భారత కెప్టెన్తో ఏకీభవిస్తున్నాను. యువ క్రికెటర్లలో సుదీర్ఘమైన ఫార్మాట్లో ఆడాలనే కోరిక ఉండాలి. రంజీ ట్రోఫీ భారత క్రికెట్కు వెన్నముక. దేశవాళీ టోర్నీలో ఇది అత్యంత ముఖ్యమైంది. ఇందులో తప్పనిసరిగా ఆడాలని ఆటగాళ్లను ఆదేశించిన బీసీసీఐని నేను అభినందిస్తున్నాను’’అని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ అన్నారు.
భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengsarkar) మట్లాడుతూ ‘‘రంజీల్లో ఆడటం చాలా ముఖ్యం. దీనివల్ల భారత్లోని స్పిన్ పిచ్లపై సులభంగా ఆడటం అలవాటౌతుంది. నైపుణ్యాలు మెరుగుపరుచుకుని విదేశాలతో ఆడినపుడు మంచి ప్రదర్శన చేయవచ్చు. భారత్లో అనేకమంది ఆటగాళ్లున్నారు. ఎవరైనా రంజీల్లో ఆడను అంటే వేరే వారికి అవకాశం ఇవ్వాలి. క్రికెట్ కంటే పెద్ద వాళ్లు ఎవరు లేరు’’ అన్నారు.
‘‘కచ్చితంగా రంజీట్రోఫీ ఆడాలనే నియమం తీసుకురాకుంటే రానున్న రోజుల్లో రంజీ ట్రోఫీ అంతరించిపోయే ప్రమాదముంది. ఇది భారత క్రికెట్కు మంచిది కాదు’’అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో సభ్యుడు అన్నారు. కేంద్ర కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లు రంజీలకు అందుబాటులో ఉండాలని ఫిబ్రవరిలో బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇతర టోర్నీలపై కొందరు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సరైన వ్యవస్థ, కచ్చితమైన నియమాలు అవసరం. సీనియర్ ఆటగాళ్లు తరచూ రంజీల్లో పాల్గొంటే యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుంది. రంజీల్లో ఆడని వారిని నిషేధించే అధికారం రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇస్తే అలాంటి ధైర్యం చేయరు అని పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాల సభ్యులు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు