Ranji Trophy: రంజీ ట్రోఫీలో ‘బిహార్’ వివాదం.. బీసీసీఐ ఓ కన్నేయాల్సిందే!
ఈసారి రంజీ ట్రోఫీ (Ranji Trophy) భలే ట్విస్ట్తో మొదలైంది. ప్రత్యర్థి జట్టుతో తలపడేందుకు ఒకే రాష్ట్రం నుంచి రెండు టీమ్లు వచ్చాయి. దీంతో కాసేపు గందరగోళం నెలకొని క్రికెట్ అభిమానులను తికమకకు గురి చేశాయి.
భారత క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టాలని భావించే ప్రతి దేశవాళీ క్రికెటర్ రంజీ ట్రోఫీలో (Ranji Trophy) రాణించాలని శ్రమిస్తుంటాడు. జట్టులో చోటు కోసం శతవిధాలా ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే ప్రతి రంజీ ట్రోఫీలో రికార్డులు, అద్భుత ప్రదర్శనలు హైలైట్గా నిలుస్తాయి. ఈసారి మాత్రం ఓ వివాదం చోటు చేసుకుంది. అదీనూ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే! పట్నా వేదికగా ముంబయితో మ్యాచ్ కోసం బిహార్ నుంచి రెండు జట్లు మైదానం వద్దకు చేరుకోవడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి.
అసలేం జరిగిందంటే?
రెండు జట్లలో ఒకదానిని బిహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధ్యక్షుడు రాకేశ్తివారీ ఎంపిక చేశారు. రెండో టీమ్ కార్యదర్శి అమిత్ కుమార్ నేతృత్వంలో సిద్ధమైంది. ఈ రెండు జట్లూ ఒకేసారి పట్నా మైదానం వద్దకు చేరుకున్నాయి. ముంబయితో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా అధికారులూ వాగ్వాదానికి దిగారు. చివరికి అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే రంజీ వర్గాలు అనుమతించాయి. అప్పటికి ఈ సమస్య సమసిపోయింది. ముంబయితో బిహార్ మ్యాచ్ మొదలైంది. ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డులో మాత్రం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అధికారం మాదంటే.. మాది..
దేశవాళీ లీగ్లకు రాష్ట్ర క్రికెట్ బోర్డులే జట్లను ప్రకటిస్తుంటాయి. ఇక్కడ రెండు టీమ్లు రావడంతోనే గందరగోళం నెలకొంది. బీసీఏ అధ్యక్షుడు రాకేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘మేం ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. బిహార్ నుంచి వచ్చే ఆటగాళ్ల టాలెంట్ను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఇటీవల ఐపీఎల్ వేలంలో షకిబ్ హుస్సేన్ చోటు దక్కించుకున్నాడు. పన్నెండేళ్ల కుర్రాడు అరంగేట్రం చేశాడు. మరో జట్టును ప్రకటించిన కార్యదర్శి సస్పెన్షన్లో ఉన్నాడు. అతడు ప్రకటించిన జట్టు సరైంది కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కార్యదర్శి అమిత్ కుమార్ ఘాటుగా స్పందించాడు. ‘‘నేను ఎన్నికల్లో విజయం సాధించా. అధికారికంగా నేనే బీసీఏ కార్యదర్శిని. మీరు (అధ్యక్షుడిని ఉద్దేశించి) కార్యదర్శిని సస్పెండ్ చేయలేరు. అసలు అధ్యక్షుడు ఎక్కడైనా జట్టును ఎంపిక చేస్తాడా? బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ టీమ్ను ఎప్పుడైనా ప్రకటించారా? బీసీసీఐ కార్యదర్శి జై షా సంతకం ఉన్న ప్రకటనే విడుదలవుతుంది’’ అని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
బోర్డు ఏదైనా సరే.. అధ్యక్షుడు, కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్లు ఒకే మాట మీద ఉండాలి. జట్టు ఎంపికతో పాటూ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం తీసుకొనే చర్యలూ చాలా కీలకం. బోర్డులోని సభ్యులకే ఒకరంటే మరొకరికి పడకపోతే సొంతంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలదని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మిగతా బోర్డులకూ ఇలాంటి సంస్కృతి పాకితే.. అంతర్జాతీయంగా క్రికెట్ వర్గాల్లో ఉన్న బీసీసీఐ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనేది వారి వాదన. ఇప్పటికే బిహార్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటననూ జారీ చేసింది. రెండో టీమ్ను ఎంపిక చేసిన అమిత్ కుమార్తో సహా దానికి సహకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. బీసీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాలం నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!