Ranji Trophy: రంజీ ట్రోఫీలో ‘బిహార్’ వివాదం.. బీసీసీఐ ఓ కన్నేయాల్సిందే!
ఈసారి రంజీ ట్రోఫీ (Ranji Trophy) భలే ట్విస్ట్తో మొదలైంది. ప్రత్యర్థి జట్టుతో తలపడేందుకు ఒకే రాష్ట్రం నుంచి రెండు టీమ్లు వచ్చాయి. దీంతో కాసేపు గందరగోళం నెలకొని క్రికెట్ అభిమానులను తికమకకు గురి చేశాయి.
భారత క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టాలని భావించే ప్రతి దేశవాళీ క్రికెటర్ రంజీ ట్రోఫీలో (Ranji Trophy) రాణించాలని శ్రమిస్తుంటాడు. జట్టులో చోటు కోసం శతవిధాలా ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే ప్రతి రంజీ ట్రోఫీలో రికార్డులు, అద్భుత ప్రదర్శనలు హైలైట్గా నిలుస్తాయి. ఈసారి మాత్రం ఓ వివాదం చోటు చేసుకుంది. అదీనూ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే! పట్నా వేదికగా ముంబయితో మ్యాచ్ కోసం బిహార్ నుంచి రెండు జట్లు మైదానం వద్దకు చేరుకోవడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి.
అసలేం జరిగిందంటే?
రెండు జట్లలో ఒకదానిని బిహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధ్యక్షుడు రాకేశ్తివారీ ఎంపిక చేశారు. రెండో టీమ్ కార్యదర్శి అమిత్ కుమార్ నేతృత్వంలో సిద్ధమైంది. ఈ రెండు జట్లూ ఒకేసారి పట్నా మైదానం వద్దకు చేరుకున్నాయి. ముంబయితో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా అధికారులూ వాగ్వాదానికి దిగారు. చివరికి అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే రంజీ వర్గాలు అనుమతించాయి. అప్పటికి ఈ సమస్య సమసిపోయింది. ముంబయితో బిహార్ మ్యాచ్ మొదలైంది. ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డులో మాత్రం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అధికారం మాదంటే.. మాది..
దేశవాళీ లీగ్లకు రాష్ట్ర క్రికెట్ బోర్డులే జట్లను ప్రకటిస్తుంటాయి. ఇక్కడ రెండు టీమ్లు రావడంతోనే గందరగోళం నెలకొంది. బీసీఏ అధ్యక్షుడు రాకేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘మేం ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. బిహార్ నుంచి వచ్చే ఆటగాళ్ల టాలెంట్ను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఇటీవల ఐపీఎల్ వేలంలో షకిబ్ హుస్సేన్ చోటు దక్కించుకున్నాడు. పన్నెండేళ్ల కుర్రాడు అరంగేట్రం చేశాడు. మరో జట్టును ప్రకటించిన కార్యదర్శి సస్పెన్షన్లో ఉన్నాడు. అతడు ప్రకటించిన జట్టు సరైంది కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కార్యదర్శి అమిత్ కుమార్ ఘాటుగా స్పందించాడు. ‘‘నేను ఎన్నికల్లో విజయం సాధించా. అధికారికంగా నేనే బీసీఏ కార్యదర్శిని. మీరు (అధ్యక్షుడిని ఉద్దేశించి) కార్యదర్శిని సస్పెండ్ చేయలేరు. అసలు అధ్యక్షుడు ఎక్కడైనా జట్టును ఎంపిక చేస్తాడా? బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ టీమ్ను ఎప్పుడైనా ప్రకటించారా? బీసీసీఐ కార్యదర్శి జై షా సంతకం ఉన్న ప్రకటనే విడుదలవుతుంది’’ అని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
బోర్డు ఏదైనా సరే.. అధ్యక్షుడు, కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్లు ఒకే మాట మీద ఉండాలి. జట్టు ఎంపికతో పాటూ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం తీసుకొనే చర్యలూ చాలా కీలకం. బోర్డులోని సభ్యులకే ఒకరంటే మరొకరికి పడకపోతే సొంతంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలదని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మిగతా బోర్డులకూ ఇలాంటి సంస్కృతి పాకితే.. అంతర్జాతీయంగా క్రికెట్ వర్గాల్లో ఉన్న బీసీసీఐ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనేది వారి వాదన. ఇప్పటికే బిహార్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటననూ జారీ చేసింది. రెండో టీమ్ను ఎంపిక చేసిన అమిత్ కుమార్తో సహా దానికి సహకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. బీసీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాలం నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు