ODI WC 2023: ప్రపంచకప్లో వివాదాలు.. డీఆర్ఎస్పై ఆసీస్ అసంతృప్తి
ఆట పరంగా ప్రపంచకప్ (ODI World Cup 2023) ఎంతలా ఆకట్టుకుంటుందో.. ఆటేతర కారణాలతోనూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఈ మెగా టోర్నీలో వివాదాలే అందుకు కారణం. ఓ వైపు డీఆర్ఎస్ సాంకేతిక విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భారత్లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) క్రమంగా ఊపందుకుంటోంది. పెద్ద జట్లపై పసికూనల విజయాలతో ఒక్కసారిగా మెగా టోర్నీకి జోష్ వచ్చింది. మైదానంలో అన్ని జట్లు ఆటతో అలరించేందుకు పోటీపడుతున్నాయి. వన్డే విశ్వ విజేతగా నిలిచేందుకు శ్రమిస్తున్నాయి. ఆట పరంగా ప్రపంచకప్ ఎంతలా ఆకట్టుకుంటుందో.. ఆటేతర కారణాలతోనూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఈ మెగా టోర్నీలో వివాదాలే అందుకు కారణం. ఓ వైపు డీఆర్ఎస్ సాంకేతిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. మరోవైపు భారత్- పాక్ మ్యాచ్పై వివాదాల పర్వం కొనసాగుతోంది.
డీఆర్ఎస్ గోల..
ప్రపంచకప్లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు దీనిపై గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ డీఆర్ఎస్ సరిగ్గా లేకపోవడంతో తామే ఎక్కువ నష్టపోతున్నామన్నది ఆస్ట్రేలియా ఆవేదన. మొదట ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్లో కంగారూ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, స్టాయినిస్ ఔట్ విషయంలో డీఆర్ఎస్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముందుగా స్మిత్ ఎల్బీడబ్ల్యూతో ఇది మొదలైంది. రబాడ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ అయిదో బంతి పిచ్ మధ్యలో పడి కుడి వైపుగా వెళ్లింది. బంతిని ఆడేందుకు స్మిత్ ప్రయత్నించగా.. అది కుడి ప్యాడ్కు తాకింది. అప్పీల్ చేయగా మైదానంలోని అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సఫారీ జట్టు సమీక్ష కోరింది. మరో ఎండ్లో ఉన్న లబుషేన్ బంతి లెగ్సైడ్ వెళ్తుందనేలా సైగ చేశాడు. కానీ మూడో అంపైర్ బంతి లెగ్స్టంప్ను తాకుతుందని ఔట్గా ప్రకటించాడు. దీంతో షాక్కు గురైన స్మిత్ నమ్మలేనట్లుగా మైదానం వీడాడు.
రబాడ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని స్టాయినిస్ ఆడే ప్రయత్నం చేశాడు. లెగ్సైడ్ వెళ్లిన ఆ బంతిని వికెట్ కీపర్ డికాక్ తన ఎడమ వైపు డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. క్యాచౌట్ అని దక్షిణాఫ్రికా అప్పీల్ చేస్తే అంపైర్ ఇవ్వలేదు. దీంతో సఫారీ సేన మరోసారి డీఆర్ఎస్ను ఆశ్రయించింది. రీప్లేలో బంతి స్టాయినిస్ కింది చేయి (ఎడమ) గ్లవ్స్కు తాకినట్లు తేలింది. కానీ ఆ సమయంలో ఆ చేతితో అతను బ్యాట్ పట్టుకోలేదు. దీంతో నాటౌట్గానే ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ బంతి ఎడమ చేతి గ్లవ్స్ను తాకిన సమయంలో.. ఆ చేయి కుడి చేతిని తాకి ఉందనే కారణంతో టీవీ అంపైర్ ఔట్గా నిర్ణయించాడు. దీనిపై ఆస్ట్రేలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. సైడ్ యాంగిల్ నుంచి చూస్తే అది నాటౌట్ అని స్పష్టంగా తెలిసేదని పేర్కొంది. ఈ మ్యాచ్లో 134 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్.. ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది.
తాజాగా శ్రీలంకతో మ్యాచ్లోనూ డీఆర్ఎస్పై ఆసీస్ ఓపెనర్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మధుశంక వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతి వార్నర్ ప్యాడ్ను తాకింది. వెంటనే అంపైర్ ఔటిచ్చాడు. కానీ లెగ్సైడ్ వెళ్తుందని భావించి వార్నర్ డీఆర్ఎస్ కోరాడు. ఇందులోనేమో బంతి కొద్దిగా స్టంప్స్కు తాకుతుంది కాబటి నిర్ణయం ‘అంపైర్ కాల్’గా ఇవ్వడంతో వార్నర్ వెనుదిరగక తప్పలేదు. ఈ నిర్ణయంపై వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. అనంతరం దీనిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు. డీఆర్ఎస్ విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని వార్నర్ అన్నాడు.
చిరకాల ప్రత్యర్థుల పోరు..
ప్రపంచకప్లో అందరూ ఆసక్తితో ఎదురు చూసిన చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 14నే ముగిసింది. కానీ ఈ మ్యాచ్ తాలుకూ వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇది ఐసీసీ టోర్నీలాగే కనిపించలేదని, బీసీసీఐ ఈవెంట్లా ఉందని పాకిస్థాన్ కోచ్ మికీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తమ పాత్రికేయులకు వీసాల జారీలో ఆలస్యం, భారత అభిమానుల తీరుపై ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. అయితే ఓ ప్రపంచకప్ నిర్వహిస్తున్నామంటే వివాదాలు, విమర్శలు సహజమేనని.. టోర్నీ అత్యుత్తమంగా సాగేలా కృషి చేయడమే తమ పని అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బాక్లే పేర్కొన్నారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81