ODI World Cup 2023: సగం ప్రపంచ కప్ పూర్తి... సెమీస్ సంగతేంటి?ఎవరొస్తారు?
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) దాదాపు సగం పూర్తయింది. దీంతో సెమీ ఫైనల్స్కు వెళ్లే జట్లు (Semi Finals Teams) ఏవి అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం ఈ కథనం.
‘సెమీస్కొచ్చే టీమ్లు ఏవి?’ క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ మహా సమరంలో దాదాపు సగం (23) మ్యాచ్లు పూర్తయిపోయాయి మరి. పాయింట్ల పట్టికను ఓసారి చూస్తే... క్లియర్గా ఆ నాలుగు జట్లు ఏంటో తెలుస్తున్నాయి. కానీ, ఎక్కడో చిన్న డౌట్. అసలు ఆ జట్లేంటి, ఆ డౌట్ ఏంటో ఓసారి చూద్దాం!
భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా... ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ఇవే. మామూలుగా అయితే ఈ నాలుగే సెమీస్కు వెళ్లే అవకాశం బలంగా ఉంది. కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్ (ODI World Cup 2023) సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదయ్యాయి కూడా. దీంతో టాప్ 4 (Top 4 Teams) స్థానాలను అంత ఈజీగా నిర్ణయించే పరిస్థితి కనిపించడం లేదు.
టాప్ 1లో భారత్
ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్ రన్రేట్తో భారత్ (Team India) తొలి స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్తో తలపడనుంది. ప్రస్తుతం మన జట్టు ఉన్న ఫామ్ చూస్తే ఆ మ్యాచ్ల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప భారత్ తొలి స్థానం నుంచి కిందకు వచ్చే పరిస్థితి లేదు. టీమ్ ఇండియా తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లాండ్ను (29న) ఢీకొట్టనుంది. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్లు ఉన్నాయి. కానీ, ఇక్కడ భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లతో మ్యాచ్ల్లో విజయాలే భారత్ స్థానాన్ని నిర్ణయిస్తాయి.
Photo: BCCI Twitter
రెండూ, మూడు ఎవరంటే...
ఐదింట నాలుగు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మీద భారీ విజయాలు సాధించడంతో రన్రేట్ (2.370) అందరి కంటే ఎక్కువగా ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే సఫారీలకు సెమీస్ బెర్త్ ఖాయం. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో మూడు (భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్) కఠినమైన జట్లతోనే. వీటిల్లో తేడాపడినా.. నెట్రన్రేట్ సఫారీ జట్టును కాపాడే అవకాశం ఉంది.
ఇన్నే విజయాలు సాధించిన న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. భారత్తో ఓడిన న్యూజిలాండ్ టోర్నీలో ఇప్పటి వరకు నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో తలపడాలి. కివీస్ లేటెస్ట్ ఫామ్ చూస్తే నాలుగు మ్యాచుల్లోనూ విజయావకాశాలు ఎక్కువే అని చెప్పొచ్చు. కానీ, క్రికెట్లో ఎప్పుడు సంచలనాలు నమోదవుతాయో ఎవరూ అంచనావేయలేరు. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు పెద్ద జట్లకు షాకులు తగిలాయి.
నాలుగులో ఎవరు?
ఇక్కడి వరకు పిక్చర్ అంతా క్లియర్గా ఉంది. నాలుగో స్థానం కోసమే పోటీ కనిపిస్తోంది. నాలుగేసి పాయింట్లతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తర్వాతి వరుసలో ఉన్నాయి. అయితే పాక్, అఫ్గాన్ కంటే ఓ మ్యాచ్ తక్కువగా ఆడటం ఆసీస్కు కలిసొచ్చే అంశం. కంగారూలు తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడింట విజయావకాశాలు ఎక్కువ. ఆ లెక్కన 10 పాయింట్లతో టాప్ 4లో కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఒకవేళ టాప్-4లో ఉన్న జట్లు సిరీస్ సెకండాఫ్లో తడబడితే ఆ అవకాశాన్ని పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, వరుస ఓటములతో ఆ జట్టు డీలాపడిపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మూడు భారీ పరాజయాలతో రన్ రేట్ పరంగా చాలా వెనుకబడింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది పైకి వచ్చే పరిస్థితి లేదు.
ఆఖరిగా... మూడు సంచలనాలు నమోదైన ఈ ప్రపంచకప్లో మరికొన్ని నమోదైతే మాత్రం టాప్-4లో భారీ కుదుపులు తప్పవు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.