ODI World Cup 2023: సగం ప్రపంచ కప్ పూర్తి... సెమీస్ సంగతేంటి?ఎవరొస్తారు?
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) దాదాపు సగం పూర్తయింది. దీంతో సెమీ ఫైనల్స్కు వెళ్లే జట్లు (Semi Finals Teams) ఏవి అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం ఈ కథనం.
‘సెమీస్కొచ్చే టీమ్లు ఏవి?’ క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ మహా సమరంలో దాదాపు సగం (23) మ్యాచ్లు పూర్తయిపోయాయి మరి. పాయింట్ల పట్టికను ఓసారి చూస్తే... క్లియర్గా ఆ నాలుగు జట్లు ఏంటో తెలుస్తున్నాయి. కానీ, ఎక్కడో చిన్న డౌట్. అసలు ఆ జట్లేంటి, ఆ డౌట్ ఏంటో ఓసారి చూద్దాం!
భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా... ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ఇవే. మామూలుగా అయితే ఈ నాలుగే సెమీస్కు వెళ్లే అవకాశం బలంగా ఉంది. కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్ (ODI World Cup 2023) సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదయ్యాయి కూడా. దీంతో టాప్ 4 (Top 4 Teams) స్థానాలను అంత ఈజీగా నిర్ణయించే పరిస్థితి కనిపించడం లేదు.
టాప్ 1లో భారత్
ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్ రన్రేట్తో భారత్ (Team India) తొలి స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్తో తలపడనుంది. ప్రస్తుతం మన జట్టు ఉన్న ఫామ్ చూస్తే ఆ మ్యాచ్ల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప భారత్ తొలి స్థానం నుంచి కిందకు వచ్చే పరిస్థితి లేదు. టీమ్ ఇండియా తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లాండ్ను (29న) ఢీకొట్టనుంది. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్లు ఉన్నాయి. కానీ, ఇక్కడ భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లతో మ్యాచ్ల్లో విజయాలే భారత్ స్థానాన్ని నిర్ణయిస్తాయి.
Photo: BCCI Twitter
రెండూ, మూడు ఎవరంటే...
ఐదింట నాలుగు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మీద భారీ విజయాలు సాధించడంతో రన్రేట్ (2.370) అందరి కంటే ఎక్కువగా ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే సఫారీలకు సెమీస్ బెర్త్ ఖాయం. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో మూడు (భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్) కఠినమైన జట్లతోనే. వీటిల్లో తేడాపడినా.. నెట్రన్రేట్ సఫారీ జట్టును కాపాడే అవకాశం ఉంది.
ఇన్నే విజయాలు సాధించిన న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. భారత్తో ఓడిన న్యూజిలాండ్ టోర్నీలో ఇప్పటి వరకు నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో తలపడాలి. కివీస్ లేటెస్ట్ ఫామ్ చూస్తే నాలుగు మ్యాచుల్లోనూ విజయావకాశాలు ఎక్కువే అని చెప్పొచ్చు. కానీ, క్రికెట్లో ఎప్పుడు సంచలనాలు నమోదవుతాయో ఎవరూ అంచనావేయలేరు. ఇప్పటికే ఈ టోర్నీలో మూడు పెద్ద జట్లకు షాకులు తగిలాయి.
నాలుగులో ఎవరు?
ఇక్కడి వరకు పిక్చర్ అంతా క్లియర్గా ఉంది. నాలుగో స్థానం కోసమే పోటీ కనిపిస్తోంది. నాలుగేసి పాయింట్లతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తర్వాతి వరుసలో ఉన్నాయి. అయితే పాక్, అఫ్గాన్ కంటే ఓ మ్యాచ్ తక్కువగా ఆడటం ఆసీస్కు కలిసొచ్చే అంశం. కంగారూలు తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడింట విజయావకాశాలు ఎక్కువ. ఆ లెక్కన 10 పాయింట్లతో టాప్ 4లో కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఒకవేళ టాప్-4లో ఉన్న జట్లు సిరీస్ సెకండాఫ్లో తడబడితే ఆ అవకాశాన్ని పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, వరుస ఓటములతో ఆ జట్టు డీలాపడిపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మూడు భారీ పరాజయాలతో రన్ రేట్ పరంగా చాలా వెనుకబడింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది పైకి వచ్చే పరిస్థితి లేదు.
ఆఖరిగా... మూడు సంచలనాలు నమోదైన ఈ ప్రపంచకప్లో మరికొన్ని నమోదైతే మాత్రం టాప్-4లో భారీ కుదుపులు తప్పవు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్