Team India: విమర్శించడం చాలా తేలిక.. వారిద్దరూ మళ్లీ ఫామ్లోకి వస్తారు: శార్దూల్ ఠాకూర్
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారిపై విమర్శలు చేయడం తగదని టీమ్ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విదర్భతో జరుగుతున్న రంజీ మ్యాచ్ ఫైనల్ (Ranji Trophy) తొలి ఇన్నింగ్స్లో భారత సీనియర్లు అజింక్య రహానె, శ్రేయస్ విఫలమయ్యారు. సింగిల్ డిజిట్కే పరిమితమైన వారిద్దరి ఫామ్పై మళ్లీ విమర్శలు వచ్చాయి. ఇలాగైతే జాతీయజట్టులోకి స్థానం దక్కడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కామెంట్లను టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొట్టిపడేశాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమేనని.. మళ్లీ పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ 69 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు.
‘‘అజింక్య రహానె ఈ సీజన్లో ఎక్కువగా పరుగులు చేయలేదు. మంచి ఫామ్లోనూ లేడు. దానికోసం అతడిని నిందించాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్క క్రికెటర్ జీవితంలో ఇలాంటి దశ ఎదురవుతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు వారిద్దరికీ గడ్డు పరిస్థితులే. అలాగని వారిని తక్కువ చేయడం సరైంది కాదు. ముంబయి, భారత్ తరఫున వారు మ్యాచ్ విన్నర్లే అనడంలో సందేహమే లేదు. కాకపోతే, ఇప్పుడు శ్రేయస్-రహానెకు కఠిన సమయం. ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. విమర్శించడం ఏముంది ఎవరైనా చేయగలరు. చాలా తేలికగా మాటలు అనేయవచ్చు.
బ్యాటర్గా రహానె విఫలం కావచ్చేమో కానీ.. ముంబయి జట్టు కెప్టెన్గా మైదానంలో అతడి యాటిట్యూడ్ అద్భుతం. అండర్-19, అండర్-23 జట్ల నుంచి చాలామంది యువ క్రికెటర్లు రంజీల్లో ఆడుతున్నారు. అతడిలా మాత్రం ఎవరూ చురుగ్గా లేరు. స్లిప్లో అతడిని చూస్తే మీకే అర్థమవుతుంది. 80 ఓవర్లపాటు ఓపిగ్గా ఫీల్డింగ్ చేసినా.. అదే ఉత్సాహంతో బౌండరీని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇక శ్రేయస్ కూడా మైదానంలో పులిలా ఉంటాడు. చురుకైన ఫీల్డింగ్తో జట్టు విజయం కోసం శ్రమిస్తాడు. వారిద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో ఉండటం యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది. రంజీ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్లో ఇంకాస్త పరుగులు చేస్తే బాగుండేది. అయినా, మా బౌలర్లు రాణించి విదర్భ టీంను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయగలిగారు’’ అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ముంబయిదే
రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి తన తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ జట్టు మాత్రం ముంబయి బౌలర్ల దెబ్బకు 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయికి 119 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం