Team India: విమర్శించడం చాలా తేలిక.. వారిద్దరూ మళ్లీ ఫామ్లోకి వస్తారు: శార్దూల్ ఠాకూర్
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారిపై విమర్శలు చేయడం తగదని టీమ్ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విదర్భతో జరుగుతున్న రంజీ మ్యాచ్ ఫైనల్ (Ranji Trophy) తొలి ఇన్నింగ్స్లో భారత సీనియర్లు అజింక్య రహానె, శ్రేయస్ విఫలమయ్యారు. సింగిల్ డిజిట్కే పరిమితమైన వారిద్దరి ఫామ్పై మళ్లీ విమర్శలు వచ్చాయి. ఇలాగైతే జాతీయజట్టులోకి స్థానం దక్కడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కామెంట్లను టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొట్టిపడేశాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమేనని.. మళ్లీ పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ 69 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు.
‘‘అజింక్య రహానె ఈ సీజన్లో ఎక్కువగా పరుగులు చేయలేదు. మంచి ఫామ్లోనూ లేడు. దానికోసం అతడిని నిందించాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్క క్రికెటర్ జీవితంలో ఇలాంటి దశ ఎదురవుతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు వారిద్దరికీ గడ్డు పరిస్థితులే. అలాగని వారిని తక్కువ చేయడం సరైంది కాదు. ముంబయి, భారత్ తరఫున వారు మ్యాచ్ విన్నర్లే అనడంలో సందేహమే లేదు. కాకపోతే, ఇప్పుడు శ్రేయస్-రహానెకు కఠిన సమయం. ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. విమర్శించడం ఏముంది ఎవరైనా చేయగలరు. చాలా తేలికగా మాటలు అనేయవచ్చు.
బ్యాటర్గా రహానె విఫలం కావచ్చేమో కానీ.. ముంబయి జట్టు కెప్టెన్గా మైదానంలో అతడి యాటిట్యూడ్ అద్భుతం. అండర్-19, అండర్-23 జట్ల నుంచి చాలామంది యువ క్రికెటర్లు రంజీల్లో ఆడుతున్నారు. అతడిలా మాత్రం ఎవరూ చురుగ్గా లేరు. స్లిప్లో అతడిని చూస్తే మీకే అర్థమవుతుంది. 80 ఓవర్లపాటు ఓపిగ్గా ఫీల్డింగ్ చేసినా.. అదే ఉత్సాహంతో బౌండరీని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇక శ్రేయస్ కూడా మైదానంలో పులిలా ఉంటాడు. చురుకైన ఫీల్డింగ్తో జట్టు విజయం కోసం శ్రమిస్తాడు. వారిద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో ఉండటం యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది. రంజీ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్లో ఇంకాస్త పరుగులు చేస్తే బాగుండేది. అయినా, మా బౌలర్లు రాణించి విదర్భ టీంను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయగలిగారు’’ అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ముంబయిదే
రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి తన తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ జట్టు మాత్రం ముంబయి బౌలర్ల దెబ్బకు 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయికి 119 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ