Team India: ఐపీఎల్ X ఫస్ట్క్లాస్ క్రికెట్.. రెండూ ఆడేందుకు ఇబ్బంది లేదు: సౌరభ్ గంగూలీ
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ కోసం ఫస్ట్క్లాస్ క్రికెట్ను పక్కన పెడుతున్నారనే వాదన ఇప్పుడు తెరమీదుకొచ్చింది. తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలోనూ దేశవాళీ క్రికెట్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్తోపాటు దేశవాళీ క్రికెట్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చని.. గతంలోనూ స్టార్ క్రికెటర్లు సైతం ఇదే బాట పట్టారని గుర్తు చేశాడు. దానికి ఉదాహరణగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ పేర్లను చెప్పాడు. ఈ అంశాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని గంగూలీ స్పష్టం చేశాడు.
‘‘సచిన్, ద్రవిడ్ ఇద్దరూ తమ కెరీర్లో పరిమిత ఓవర్ల క్రికెట్తోపాటు టెస్టులూ ఆడారు. ఓ వైపు ఐపీఎల్లో పాల్గొంటూనే సుదీర్ఘ ఫార్మాట్లో మెరిశారు. అందుకే, ఐపీఎల్తోపాటు ఫస్ట్క్లాస్ క్రికెట్నూ కొనసాగించాలి. అసలు ఈ రెండింటికి ఎప్పుడూ క్లాష్ రాదు. దేశవాళీ క్రికెట్ ముగిసిన దాదాపు నెలరోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. గతంలో చాలామంది అత్యుత్తమ ఆటగాళ్లు టెస్టులతోపాటు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడారు. ఇప్పుడున్నవారిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, హ్యారీ బ్రూక్ కూడా రెండింట్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా రోజుల్లో నాతోపాటు సచిన్, రాహుల్ టెస్టు క్రికెట్ ఆడాం. ఐపీఎల్, పరిమిత ఓవర్ క్రికెట్లోనూ బరిలోకి దిగాం. అందుకే, ఒకటే ఆడాలని చెప్పేందుకు సరైన కారణం లేదు.
మేం దిల్లీ క్యాపిటల్స్కు ఎక్కువగా సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడిన వారినే తీసుకున్నాం. ఇటీవల ఇషాంత్ శర్మ కూడా రంజీల్లో ఆడాడు. చాలాకాలం తర్వాత ఖలీల్ అహ్మద్ పూర్తిస్థాయి సీజన్లో పాల్గొన్నాడు. రంజీల కోసం అతడి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకున్నాం. అవసరమైన ఒకరిద్దరికి మాత్రమే మినహాయింపు ఇచ్చాం’’ అని గంగూలీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్