Team India: ఐపీఎల్ X ఫస్ట్క్లాస్ క్రికెట్.. రెండూ ఆడేందుకు ఇబ్బంది లేదు: సౌరభ్ గంగూలీ
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ కోసం ఫస్ట్క్లాస్ క్రికెట్ను పక్కన పెడుతున్నారనే వాదన ఇప్పుడు తెరమీదుకొచ్చింది. తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలోనూ దేశవాళీ క్రికెట్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్తోపాటు దేశవాళీ క్రికెట్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చని.. గతంలోనూ స్టార్ క్రికెటర్లు సైతం ఇదే బాట పట్టారని గుర్తు చేశాడు. దానికి ఉదాహరణగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ పేర్లను చెప్పాడు. ఈ అంశాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని గంగూలీ స్పష్టం చేశాడు.
‘‘సచిన్, ద్రవిడ్ ఇద్దరూ తమ కెరీర్లో పరిమిత ఓవర్ల క్రికెట్తోపాటు టెస్టులూ ఆడారు. ఓ వైపు ఐపీఎల్లో పాల్గొంటూనే సుదీర్ఘ ఫార్మాట్లో మెరిశారు. అందుకే, ఐపీఎల్తోపాటు ఫస్ట్క్లాస్ క్రికెట్నూ కొనసాగించాలి. అసలు ఈ రెండింటికి ఎప్పుడూ క్లాష్ రాదు. దేశవాళీ క్రికెట్ ముగిసిన దాదాపు నెలరోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. గతంలో చాలామంది అత్యుత్తమ ఆటగాళ్లు టెస్టులతోపాటు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడారు. ఇప్పుడున్నవారిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, హ్యారీ బ్రూక్ కూడా రెండింట్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా రోజుల్లో నాతోపాటు సచిన్, రాహుల్ టెస్టు క్రికెట్ ఆడాం. ఐపీఎల్, పరిమిత ఓవర్ క్రికెట్లోనూ బరిలోకి దిగాం. అందుకే, ఒకటే ఆడాలని చెప్పేందుకు సరైన కారణం లేదు.
మేం దిల్లీ క్యాపిటల్స్కు ఎక్కువగా సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడిన వారినే తీసుకున్నాం. ఇటీవల ఇషాంత్ శర్మ కూడా రంజీల్లో ఆడాడు. చాలాకాలం తర్వాత ఖలీల్ అహ్మద్ పూర్తిస్థాయి సీజన్లో పాల్గొన్నాడు. రంజీల కోసం అతడి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకున్నాం. అవసరమైన ఒకరిద్దరికి మాత్రమే మినహాయింపు ఇచ్చాం’’ అని గంగూలీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి