Cricket News: కుల్చా జోడీ ఉంటుందా..? విరాటే అత్యుత్తమం!.. స్టేడియాల్లోకి పాములు రావడంపై అశ్విన్ ఏమన్నాడంటే..?
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) కుల్దీప్ యాదవ్ - చాహల్ జోడీ ఉంటుందా..? ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? క్రికెట్ మైదానాల్లోకి పాములు ఎందుకు వస్తాయి? వంటి విషయాలపై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023 (ODi Worls Cup 2023) మెగా టోర్నీకి ఇంకా 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. స్వదేశంలో జరగనుండటంతో భారత్ (Team India) ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ (KulCha) ఉంటారా..? అంటే కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్రౌండర్లు ఉండటంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప భిన్నంగా స్పందించాడు. ఇద్దరినీ స్క్వాడ్లోకి తీసుకోవాలని సూచించాడు.
మధ్యలోనే ఐపీఎల్ భారీ కాంట్రాక్ట్ను వదిలేసిన అక్షయ్.. ఎందుకో తెలుసా?
‘‘వరల్డ్ కప్ కోసం యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరినీ తీసుకోవాలి. కుల్దీప్ ఇటీవల అద్భుతంగా మెరుగయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే యుజ్వేంద్ర చాహల్ కూడా చాలా డేంజరస్ బౌలర్. వరల్డ్ కప్లో వారిద్దరికి అవకాశం ఇస్తే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తారు’’ అని రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.
అడవులకు దగ్గరగా ఉండటం వల్లే..: అశ్విన్
లంక ప్రీమియర్ లీగ్ (LPL 2023) సీజన్లో ఓ మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి పాము వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘‘ఇటీవల శ్రీలంక ఆటగాడు ఉదానకు సమీపంలో పాము రావడం చూశాం. అయితే, అది విషపూరితమో కాదో అనేది నేను చెప్పలేను. కొందరు అది విషపూరితమైన పాము కాదని కామెంట్లు పెట్టారు. అయితే, అంత దగ్గరగా పామును ఒక్కసారిగా చూసినప్పుడు భయం వేస్తుంది. జంతువులు ఉండే చోట మనం స్టేడియాలు కట్టడం వల్ల వచ్చిన సమస్యల్లో ఇదొకటి. శ్రీలంకలోనూ మైదానాలకు చుట్టుపక్కల అడవులు ఉంటాయి. కాబట్టి, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆటగాళ్లతోపాటు జంతువులకు మంచిది’’ అని అశ్విన్ తెలిపాడు.
విరాట్ సూపర్ ప్లేయర్: పాక్ మాజీ క్రికెటర్
‘‘ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం. పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ స్వదేశంలో మాత్రమే కోహ్లీ కంటే బాగా ఆడగలుగుతారు. కానీ, కోహ్లీ ప్రపంచంలో ఎక్కడైనా ఉత్తమంగా ఆడతాడు. ఖాళీల్లో బంతిని పంపే విధానం చాలా వేగంగా ఉంటుంది’’ అని పాక్ మాజీ క్రికెటర్ నాదిర్ అలీ ప్రశంసించాడు. వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ను ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత వన్డే సిరీస్లోని రెండు మ్యాచ్లతోపాటు టీ20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 2న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
పాక్ ఆటగాడు వాహబ్ రియాజ్ క్రికెట్కు గుడ్బై
పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. చివరిసారిగా 2020 డిసెంబర్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రియాజ్ ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడతానని వాహబ్ వెల్లడించాడు. తన కెరీర్లో 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన రియాజ్ మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు. తన క్రికెట్ కెరీర్ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు రియాజ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
ఐపీఎల్ 17వ సీజన్లో కీలక సమయంలో హైదరాబాద్కు అదృష్టం కలిసొచ్చింది. నేడు రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. -
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. -
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు