Akshay Kumar - IPL Contract: మధ్యలోనే ఐపీఎల్ భారీ కాంట్రాక్ట్ను వదిలేసిన అక్షయ్.. ఎందుకో తెలుసా?
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) డబ్బు కంటే ఇతర అంశాలకే విలువిస్తాడని సినీ వర్గాలు చెబుతుంటాయి. తాజాగా ఓ మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ తన ఆత్మకథ పుస్తకంలోనూ ఇదే విషయం గురించి వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay kumar) కొత్త చిత్రం ‘ఓ మైగాడ్ 2’ (OMG 2) గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆరంభంలో నెమ్మదించిన వసూళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు అక్షయ్ ‘భారత’ పౌరసత్వం కూడా తిరిగి పొందడం విశేషం. ఇలాంటి సమయంలో అతడి గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ ఆటో బయోగ్రఫీ ‘పిచ్సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్’ పుస్తకం అక్షయ్ కుమార్ గొప్పతనాన్ని తెలియజేసింది. కాంట్రాక్ట్ను మధ్యలోనే వదిలేసి భారీ మొత్తం వదిలేసుకున్న అక్షయ్ కుమార్ వైనం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని మాథుర్ పేర్కొన్నాడు.
ప్రపంచ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంత సంచలనమో అందరికీ తెలుసు. అయితే, లీగ్లో పాల్గొనే ఫ్రాంచైజీల విలువ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. కానీ, నష్టాలను తట్టుకొని నిలబడటమూ అంత సులువేం కాదు. 2009 సీజన్లోనే దిల్లీ డేర్డెవిల్స్ (Delhi Daredevils) నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. అందులో భాగంగా అక్షయ్ కుమార్తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్ను మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి నెలకొంది. అక్షయ్తో ప్రమోషనల్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరుకావడం వంటి బాధ్యతలతో కూడిన కాంట్రాక్ట్ను డీడీ చేసుకుంది. ఆర్థికపరమైన చిక్కులు వెంటాడటంతో అనవసర ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అక్షయ్ కాంట్రాక్ట్ను ముగించాలని డీడీ భావించింది. అయితే, న్యాయపరంగా అదంతా సులువైన విషయం కాదు. భారీ మొత్తం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ కుమార్ మాత్రం తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని మాథుర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
‘‘కోట్లా(అరుణ్జైట్లీ స్టేడియం) మైదానంలో చేసిన సాహసోపేత విన్యాసాలు మినహా అక్షయ్ కుమార్ సేవలను ఎలా వినియోగించుకోవాలో కూడా దిల్లీ డేర్డెవిల్స్కు తెలియలేదు. 2009 సీజన్ ముగింపు సమయంలో తీవ్రమైన ఆర్థిక నష్టాలు తలెత్తాయి. దీంతో తర్జనభర్జనలు పడి అక్షయ్తో ఒప్పందాన్ని రద్దు చేయడం లేదా అతడితో కాంట్రాక్ట్పై మళ్లీ చర్చలు జరపడం చేయాలని డీడీ నిర్ణయానికొచ్చింది. అయితే, కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం అక్షయ్తో డీల్ను రద్దు చేయడం చాలా కష్టం. మూడేళ్ల కాలానికి ఇచ్చిన కాంట్రాక్ట్లో గ్యారంటీలు పటిష్ఠంగా ఉన్నాయి. దీంతో అక్షయ్ కుమార్ సిబ్బందితో డీడీ లాయర్లు భేటీ అయ్యారు. కానీ, రద్దు చేసుకునేందుకు వారు సుముఖంగా లేనట్లు కనిపించారు. న్యాయపరంగా వారి తప్పేమీ లేదు. మధ్యలో కాంట్రాక్ట్ను రద్దు చేయకూడదు. అలా చేయాల్సి వస్తే మొత్తం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది డీడీకి సెల్ఫ్ గోల్ లేదా హిట్వికెట్ వంటి చర్య అనడంలో సందేహం లేదు.
రివ్యూ: ‘ఓ మైగాడ్2’.. అక్షయ్ శివుడిగా నటించిన మూవీ ఎలా ఉందంటే?
మరోవైపు ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో అక్షయ్ కుమార్కు అంత మొత్తం ఇవ్వడం కూడా కష్టమే అవుతుంది. దీంతో నేరుగా అక్షయ్తోనే మాట్లాడి దయ చూపాలని దిల్లీ డేర్డెవిల్స్ కోరేందుకు సిద్ధమైంది. అప్పుడే అక్షయ్ ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమా షూటింగ్లో ఉన్నాడు. నాతోపాటు మరికొంతమంది అక్కడికి వెళ్లాం. ఓ షాట్ ముగిసిన తర్వాత తన వ్యాన్లోకి వెళ్లి అతడిని కలిశాం. మేం ఎందుకు వచ్చామనేది చెప్పాం. డీడీ ఆర్థిక పరిస్థితిపైనా వివరణ ఇచ్చాం. ఆ వెంటనే ‘ఎలాంటి సమస్య ఉండదు. వర్కౌట్ కానప్పుడు వదిలేద్దాం’ అని అక్షయ్ అన్నాడు. నేను సరిగా వినలేదేమోనని కాస్త అయోమయంగా చూశా. మళ్లీ అక్షయే కల్పించుకుని ‘మనం దీనిని ముగిద్దాం’ అని స్పష్టంగా చెప్పాడు. అయితే, న్యాయపరమైన చిక్కులు గురించి కూడా అతడి దృష్టికి తీసుకెళ్లా. ‘ఏం ఫర్వాలేదు, నేను లాయర్కు చెప్తా’ అని అన్నాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు ఇంత పెద్ద మొత్తం అక్షయ్ తృణప్రాయంగా ఎలా వదులుకున్నాడనే విషయం ఆశ్చర్యానికి గురి చేసింది. క్షణాల్లోనే కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు’’ అని మాథుర్ తన పుస్తకంలో వెల్లడించారు. అయితే, ఎంత మొత్తం అనేది మాథుర్ వెల్లడించలేదు. ఇదే పుస్తకంలో రవిశాస్త్రి రిటైర్మెంట్, ఇర్ఫాన్ పఠాన్ అరంగేట్రం, మన్కడింగ్ సంఘటన.. ఇలాంటి అంశాలను కూడా అందులో పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే