Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్పై ట్రోలింగ్.. సెహ్వాగ్ అదిరే కౌంటర్
విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించినప్పటికీ రాజస్థాన్ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. అయితే, నెమ్మదిగా శతకం బాదడంపై కోహ్లీపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. జైపుర్ వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 72 బంతుల్లో 113 పరుగులు (స్ట్రైక్రేట్ 156.94) చేశాడు. 67 బంతుల్లో శతకం మార్క్ను తాకాడు. ఐపీఎల్లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో ఇదొకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే కూడా 67 బంతుల్లోనే శతకం చేశాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్పై ట్రోలింగ్ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ స్ట్రైక్రేట్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
‘‘రాజస్థాన్పై బెంగళూరు కనీసం 20 పరుగులు వెనుకబడింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బాగుంది. అయితే, జట్టులోని మిగతావారిలో డుప్లెసిస్ గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడలేకపోయారు. దినేశ్ కార్తిక్, లామ్రోర్ బ్యాటింగ్కే రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్ పడిపోయింది. ఇతర బ్యాటర్లు చేతులెత్తిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ భారం విరాట్ కోహ్లీపైనే పడింది. అతడి ఫామ్పై ఎలాంటి అనుమానాలు లేవు. ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజ్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న కొందరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచారు. మ్యాక్సీ మరీ దారుణంగా విఫలమయ్యాడు’’ అని ట్రోలర్స్కు సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చాడు.
సెంచరీపై కోహ్లీ ఏమన్నాడంటే?
‘‘నన్ను షాట్లు కొట్టేలా ప్రత్యర్థి బౌలర్లు టెంప్ట్ చేస్తుంటారు. కానీ, పరిస్థితికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. జైపుర్ పిచ్ విభిన్నంగా ఉంది. చూడటానికి ఫ్లాట్గా అనిపించినా.. బంతి బ్యాట్ మీదకు రావడం లేదు. పేస్ను ఛేంజ్ చేయడం వల్ల బ్యాటింగ్ ఇంకా కష్టంగా మారింది. అందుకే, మా ఇద్దరిలో (డుప్లెసిస్) ఒకరు చివరి వరకూ క్రీజ్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మేం చేసిన పరుగులు (183) సరిపోతాయని భావించాం. ఈ మ్యాచ్లో నేను మరీ దూకుడుగా ఆడలేదని తెలుసు. రాజస్థాన్ బౌలర్ల వ్యూహాలను అడ్డుకోవడానికి.. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. అశ్విన్, చాహల్ బౌలింగ్ను ఎదుర్కోవడం తేలికేం కాదు. అశ్విన్ క్యారమ్ బంతులు చాలా క్లిష్టంగా ఉంటాయి’’ అని కోహ్లీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ