Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్పై ట్రోలింగ్.. సెహ్వాగ్ అదిరే కౌంటర్
విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించినప్పటికీ రాజస్థాన్ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. అయితే, నెమ్మదిగా శతకం బాదడంపై కోహ్లీపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. జైపుర్ వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 72 బంతుల్లో 113 పరుగులు (స్ట్రైక్రేట్ 156.94) చేశాడు. 67 బంతుల్లో శతకం మార్క్ను తాకాడు. ఐపీఎల్లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో ఇదొకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే కూడా 67 బంతుల్లోనే శతకం చేశాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్పై ట్రోలింగ్ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ స్ట్రైక్రేట్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
‘‘రాజస్థాన్పై బెంగళూరు కనీసం 20 పరుగులు వెనుకబడింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బాగుంది. అయితే, జట్టులోని మిగతావారిలో డుప్లెసిస్ గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడలేకపోయారు. దినేశ్ కార్తిక్, లామ్రోర్ బ్యాటింగ్కే రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్ పడిపోయింది. ఇతర బ్యాటర్లు చేతులెత్తిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ భారం విరాట్ కోహ్లీపైనే పడింది. అతడి ఫామ్పై ఎలాంటి అనుమానాలు లేవు. ఇన్నింగ్స్ చివరి వరకూ క్రీజ్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న కొందరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచారు. మ్యాక్సీ మరీ దారుణంగా విఫలమయ్యాడు’’ అని ట్రోలర్స్కు సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చాడు.
సెంచరీపై కోహ్లీ ఏమన్నాడంటే?
‘‘నన్ను షాట్లు కొట్టేలా ప్రత్యర్థి బౌలర్లు టెంప్ట్ చేస్తుంటారు. కానీ, పరిస్థితికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. జైపుర్ పిచ్ విభిన్నంగా ఉంది. చూడటానికి ఫ్లాట్గా అనిపించినా.. బంతి బ్యాట్ మీదకు రావడం లేదు. పేస్ను ఛేంజ్ చేయడం వల్ల బ్యాటింగ్ ఇంకా కష్టంగా మారింది. అందుకే, మా ఇద్దరిలో (డుప్లెసిస్) ఒకరు చివరి వరకూ క్రీజ్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మేం చేసిన పరుగులు (183) సరిపోతాయని భావించాం. ఈ మ్యాచ్లో నేను మరీ దూకుడుగా ఆడలేదని తెలుసు. రాజస్థాన్ బౌలర్ల వ్యూహాలను అడ్డుకోవడానికి.. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. అశ్విన్, చాహల్ బౌలింగ్ను ఎదుర్కోవడం తేలికేం కాదు. అశ్విన్ క్యారమ్ బంతులు చాలా క్లిష్టంగా ఉంటాయి’’ అని కోహ్లీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్