Compound Archery: కాంపౌండ్ ఆర్చర్లకు నిరాశ... ఒలింపిక్స్లో ఈ ఆట ఆడేదెన్నడో!
ఆసియా క్రీడల్లో భారత్కు పతకాలు రావడంలో కాంపౌండ్ ఆర్చరీది ప్రముఖ స్థానం. ఒలింపిక్స్లో ఈ క్రీడకు స్థానం దక్కుతుంది అనుకుంటే నిరాశే ఎదురైంది.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్, స్క్వాష్ చేర్చడంతో భారత అభిమానులు చాలా సంబరపడ్డారు. మన స్టార్లను ఒలింపిక్స్లో చూస్తామన్న ఆనందమే ఇందుకు కారణం. అంతేకాదు పతకాలు వస్తాయన్న ఆశ. అయితే ఈ రెండు క్రీడలను చేర్చినందుకు ఎంతగా ఆనందపడుతున్నామో.. లాస్ ఏంజెల్స్లో కాంపౌండ్ ఆర్చరీ లేనందుకు అంతగా బాధపడాల్సి వస్తోంది. ఎందుకంటే తాజాగా హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ ఈ ఒక్క విభాగంలోనే 7 పతకాలు సాధించింది. తెలుగు తేజం జ్యోతి సురేఖ లాంటి వాళ్లు ఈ ఈవెంట్లో అగ్రశ్రేణి ఆర్చర్లుగా ఉన్నారు. కానీ మరోసారి ఒలింపిక్ గడప ఎక్కడంలో కాంపౌండ్ విభాగం విఫలమైంది.
ఆసియా క్రీడల్లో జోరు చూపినా
ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్లో పోటీపడడం అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అథ్లెట్లు నిరంతరం శ్రమిస్తారు. కానీ, చాలా ఏళ్లుగా కాంపౌండ్ ఆర్చరీలో మన వాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నా ఒలింపిక్స్లో ఈ ఆట లేకపోయేసరికి అది వేరే స్థాయికి వెళ్లలేకపోతోంది. ముఖ్యంగా తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గత కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తూ పతకాల పంట పండిస్తోంది. అదితి రూపంలో మరో టీనేజ్ సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీ.. ఆసియా క్రీడల్లో దాదాపు అన్ని విభాగాల్లోనూ పతకాలు నెగ్గి స్వీప్ చేసేసింది భారత్.
బలమైన దక్షిణ కొరియాను సైతం వెనక్కి నెట్టి స్వర్ణ పతకాలతో మెరిసింది. అయితే ఇంతటి ఘనతలు సాధించినా ఈ ఈవెంట్ మాత్రం ఒలింపిక్స్లో లేదు. ఎన్ని రికార్డులు సాధించినా ఒలింపిక్స్లో పతకం గెలిస్తే ఆ రేంజే వేరు. ఇప్పుడు 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్, స్క్వాష్లను చేర్చడంతో కాంపౌండ్ ఆర్చరీకి కూడా అవకాశం వస్తుందేమోనని క్రీడాకారులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పటికే ఆర్చరీలో రికర్వ్ రూపంలో ఒక ఈవెంట్ ఉండడంతో లాస్ఏంజిల్స్ నిర్వాహకులు కాంపౌండ్ ఆర్చరీని చేర్చాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు.
అందుకే అవకాశం ఇవ్వలేదా!
1960లో కాంపౌండ్ విల్లుని కనిపెట్టారు. కానీ దీని ఉపయోగమంతా సాంకేతికంగానే ఉంటుంది. సాధారణ విల్లుకి దీనికి తేడా ఇదే. రికర్వ్లో 70 మీటర్ల దూరం నుంచి లక్ష్యాన్ని గురి పెడితే.. కాంపౌండ్లో 50 మీటర్ల దూరం నుంచే టార్గెట్ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కారణాలే రికర్వ్కు, కాంపౌండ్కు మధ్య దూరాన్ని పెంచాయి. కాంపౌండ్కు టెక్నికల్ అండ ఉందన్న ఒకే ఒక్క కారణంతో చాలా ఏళ్లుగా ఒలింపిక్స్కు పరిగణించట్లేదు.
అయితే 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ఏంజిల్స్లో జరగబోతుండడంతో కాంపౌండ్లో ఆ దేశానికి మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ క్రీడ ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ అవకాశం దక్కలేదు. 1972 ఒలింపిక్స్లోనే ఆర్చరీ అరంగేట్రం చేసింది. సంప్రదాయ విల్లుతో ఈ పోటీలు జరుగుతున్నాయి. అయితే కాంపౌండ్ విల్లు కనిపెట్టి చాలా సంవత్సరాలు అయినా 1995 నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్లు, ప్రపంచకప్లు జరుగుతున్నా.. అసలైన ఒలింపిక్ మెట్టు దగ్గరే ఈ విభాగం నిలిచిపోతోంది. మరి కాంపౌండ్కు ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్