Rishabh Pant: ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ను పంత్సేన చిత్తు చేసింది. ఆ జట్టు విసిరిన కేవలం 90 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ తొమ్మిది ఓవర్లలోపే పూర్తి చేసింది. దీంతో రన్రేట్ను మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) జట్టు వ్యూహంపై స్పందించాడు. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే పాయింట్లతోపాటు నెట్రన్రేట్ కీలకమని.. అందుకే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
‘‘గుజరాత్తో మ్యాచ్లో చాలా విషయాల్లో మెరుగ్గా రాణించాం. ఛాంపియన్ ఆలోచనా విధానంతో బరిలోకి దిగాం. అలానే ఆడి విజయం సాధించాం. ఈ సీజన్లో ఇప్పటి వరకు బౌలింగ్ పరంగా ఇదే అత్యుత్తమం. భారీ విజయం సాధించాలన్న లక్ష్యాన్ని ముందే ఎంచుకొన్నాం. ఛేజింగ్లోనూ ఇదే తీరుతో ఉన్నాం. వీలైనంత వేగంగా టార్గెట్ను కొట్టేయాలని భావించాం. గతంలో మా రన్రేట్ బాగా పడిపోయింది. దాని కోసం ఇలాంటి మ్యాచులతో మెరుగయ్యే అవకాశం దక్కుతుంది. వికెట్లు పడినా వేగంగా పరుగులు సాధించడానికే మొగ్గు చూపాం. అహ్మదాబాద్ పిచ్ చాలా బాగుంది. కీలక సమయంలో విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు.
మా బ్యాటింగ్ తేలిపోయింది: గిల్
‘‘సొంత మైదానంలో ఘోర ఓటమిని తట్టుకోలేకపోతున్నా. మా బ్యాటింగ్ అత్యంత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో కుంగిపోకుండా.. తదుపరి మ్యాచ్ల కోసం సిద్ధం కావాలి. పిచ్ బాగానే ఉంది. మా తప్పిదాల వల్లే వికెట్లను చేజార్చుకున్నాం. షాట్ల ఎంపిక కూడా దీనికి కారణమే. కేవలం 90 పరుగుల లక్ష్య ఛేదనను ఆపాలంటే ఎవరైనా డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. దిల్లీ ఎప్పుడూ మ్యాచ్ విన్నింగ్ రేసులోనే ఉంటుంది. ఈ సీజన్ సగం మాత్రమే ముగిసింది. మేం ఇప్పటి వరకు మూడు విజయాలు సాధించాం. మరో ఐదు గెలిచినా ప్లేఆఫ్స్కు చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది’’ అని గుజరాత్ కెప్టెన్ గిల్ తెలిపాడు.
మ్యాచ్ విశేషాలు..
- రిషభ్ పంత్కు ఏడోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దిల్లీ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ (10) మాత్రమే అత్యధికంగా దీనిని సొంతం చేసుకున్న క్రికెటర్.
- ఐపీఎల్లో బంతులపరంగా దిల్లీకిదే భారీ విజయం. గుజరాత్పై 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు ముంబయిపై (2022) 57 బంతులు మిగిలి ఉండగా గెలిచింది.
- ఐపీఎల్లో 90+ టార్గెట్ను అతి తక్కువ ఓవర్లలో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు గుజరాత్పై దిల్లీ 8.5 ఓవర్లలో లక్ష్య ఛేదన చేసింది. అంతకుముందు రాజస్థాన్పై కొచ్చి (2011లో 98 పరుగులు) 7.2 ఓవర్లు, రాజస్థాన్పై ముంబయి (2021లో 91 పరుగులు) 8.2 ఓవర్లలో పూర్తి చేసి గెలిచాయి.
- ఐపీఎల్ 2024 పవర్ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లను కోల్పోయిన జట్టుగా దిల్లీ నిలిచింది. ఇప్పటి వరకు ఆ జట్టు 13 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత లఖ్నవూ (12) ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.