IPL 2024: డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ నుంచి చెన్నై ఆటగాడు డేవన్ కాన్వే (Devon conway) వైదొలిగాడు. గతేడాది ఆ జట్టు ఛాంపియన్గా నిలవడంలో ఈ న్యూజిలాండ్ క్రికెటర్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటివరకు చెన్నై ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో డేవన్ కాన్వే వైదొలగడం చెన్నై అభిమానులను నిరాశపరుస్తోంది. గాయం కారణంగా కాన్వే ఈ సీజన్కు దూరమవుతున్నట్లు.. అతడి స్థానంలో మరొక ఓవర్సీస్ ప్లేయర్ను చెన్నై తీసుకున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది.
‘‘డేవన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్కు దూరమయ్యాడు. అతడికి బదులు రిచర్డ్ గ్లీసన్ను తీసుకుంది. ఇంగ్లాండ్కు చెందిన 36 ఏళ్ల సీనియర్ ప్లేయర్ను మిగతా మ్యాచ్ల కోసం తన స్క్వాడ్లోకి ఎంపిక చేసుకుంది. అతడు ఇప్పటివరకు జాతీయ జట్టు తరఫున ఆరు టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అతడి బేస్ ప్రైస్ రూ.50 లక్షలతో చెన్నై జట్టుతోపాటు చేరతాడు’’ అని ఐపీఎల్ పోస్టు చేసింది.
అతడు నేర్చుకొనేదేం లేదు.. ఐపీఎల్పై బంగ్లా బోర్డు ఛైర్మన్ అక్కసు
ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, అతడిని జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం వెనక్కి రప్పించేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. బీసీబీ నుంచి వచ్చిన నిరభ్యంతర పత్రం ప్రకారం మే 1 నాటికి అతడు తిరిగి స్వదేశానికి రావాలి. అయితే, చెన్నై జట్టు మాత్రం మరొక రోజు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మే 1న పంజాబ్తో చెన్నై తలపడనుంది. ఈ క్రమంలో బీసీబీ బోర్డు ఛైర్మన్ యూనస్ జలాల్ స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్లో ఆడటం వల్ల ముస్తాఫిజుర్ పెద్దగా నేర్చుకొనేదేం లేదు. అతడు నేర్చుకొనే సమయం ఎప్పుడో అయిపోయింది. ఇంకా చాలామంది ఆటగాళ్లు అక్కడ నేర్చుకొనేందుకు ఉన్నారు. ఈ లీగ్ వల్ల బంగ్లాకు ఏమీ ప్రయోజనం లేదు. అయినా చెన్నై విజ్ఞప్తి మేరకు మే 1న ఆడేందుకు అనుమతినిస్తున్నాం. అతడు ఆ తర్వాత రోజు స్వదేశానికి వస్తాడు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి