IPL 2024: డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ నుంచి చెన్నై ఆటగాడు డేవన్ కాన్వే (Devon conway) వైదొలిగాడు. గతేడాది ఆ జట్టు ఛాంపియన్గా నిలవడంలో ఈ న్యూజిలాండ్ క్రికెటర్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటివరకు చెన్నై ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో డేవన్ కాన్వే వైదొలగడం చెన్నై అభిమానులను నిరాశపరుస్తోంది. గాయం కారణంగా కాన్వే ఈ సీజన్కు దూరమవుతున్నట్లు.. అతడి స్థానంలో మరొక ఓవర్సీస్ ప్లేయర్ను చెన్నై తీసుకున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది.
‘‘డేవన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్కు దూరమయ్యాడు. అతడికి బదులు రిచర్డ్ గ్లీసన్ను తీసుకుంది. ఇంగ్లాండ్కు చెందిన 36 ఏళ్ల సీనియర్ ప్లేయర్ను మిగతా మ్యాచ్ల కోసం తన స్క్వాడ్లోకి ఎంపిక చేసుకుంది. అతడు ఇప్పటివరకు జాతీయ జట్టు తరఫున ఆరు టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అతడి బేస్ ప్రైస్ రూ.50 లక్షలతో చెన్నై జట్టుతోపాటు చేరతాడు’’ అని ఐపీఎల్ పోస్టు చేసింది.
అతడు నేర్చుకొనేదేం లేదు.. ఐపీఎల్పై బంగ్లా బోర్డు ఛైర్మన్ అక్కసు
ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, అతడిని జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం వెనక్కి రప్పించేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. బీసీబీ నుంచి వచ్చిన నిరభ్యంతర పత్రం ప్రకారం మే 1 నాటికి అతడు తిరిగి స్వదేశానికి రావాలి. అయితే, చెన్నై జట్టు మాత్రం మరొక రోజు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మే 1న పంజాబ్తో చెన్నై తలపడనుంది. ఈ క్రమంలో బీసీబీ బోర్డు ఛైర్మన్ యూనస్ జలాల్ స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్లో ఆడటం వల్ల ముస్తాఫిజుర్ పెద్దగా నేర్చుకొనేదేం లేదు. అతడు నేర్చుకొనే సమయం ఎప్పుడో అయిపోయింది. ఇంకా చాలామంది ఆటగాళ్లు అక్కడ నేర్చుకొనేందుకు ఉన్నారు. ఈ లీగ్ వల్ల బంగ్లాకు ఏమీ ప్రయోజనం లేదు. అయినా చెన్నై విజ్ఞప్తి మేరకు మే 1న ఆడేందుకు అనుమతినిస్తున్నాం. అతడు ఆ తర్వాత రోజు స్వదేశానికి వస్తాడు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!