Pakistan Cricket: రాళ్లు ఎత్తుకొని గుట్టలెక్కి.. తుపాకీ గురిపెట్టి: పాక్ క్రికెటర్లకు ఆర్మీ స్టైల్ శిక్షణ
పాకిస్థాన్ క్రికెటర్ల (Pakistan cricket team) కోసం ఆ దేశం రంగంలోకి దిగి శిక్షణ ఇస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఇస్లామామాద్: మన క్రికెటర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ..ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంసిద్ధులవుతుంటారు. కానీ పాకిస్థాన్ క్రికెటర్లు (Pakistan cricket team) ఆర్మీ(Pak Army) స్టైల్ ప్రాక్టీస్ చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. రాళ్లు మోస్తూ.. గుట్టలు ఎక్కుతూ .. స్నైపర్ షూటింగ్ చేస్తూ.. భుజాలపై ఒకరిని ఎత్తుకొని పరిగెత్తుతూ.. సాధన చేస్తున్నారు. ఇదంతా ఆ దేశ సైనికుల పర్యవేక్షణలో సాగుతోంది. ఈ కొత్తరకం శిక్షణ దృశ్యాలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా స్పందిస్తున్నారు. వారు క్రికెట్లో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటున్నారా..? లేక ఏ రహస్య మిషన్ కోసమైనా సిద్ధం అవుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్కు, ఈ షూటింగ్కు సంబంధం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఆ గుట్ట ప్రాంతంలో జారిపడితే గాయాలు కావా..? అని అడుగుతున్నారు.
క్రికెటర్లకు సైన్యంతో శిక్షణ ఇప్పిస్తామని ఇటీవల పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నక్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల పీఎస్ఎల్ టోర్నీలో భాగంగా కొన్ని మ్యాచ్లను ఆయన వీక్షించగా.. పాక్ ఆటగాళ్లు ఒక్క బంతిని కూడా స్టాండ్స్లోకి తరలించలేకపోయారు. దాంతో అసహనానికి గురైన ఆయన.. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలో జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపారు.
నా కుమారుడే అలాంటి తప్పు చేసినా క్షమించను..: పాక్ క్రికెట్ దిగ్గజం
ప్రస్తుతం వీరంతా కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్నెస్ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్ అఫ్రీదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్ అజామ్కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్