Pakistan Cricket: రాళ్లు ఎత్తుకొని గుట్టలెక్కి.. తుపాకీ గురిపెట్టి: పాక్ క్రికెటర్లకు ఆర్మీ స్టైల్ శిక్షణ
పాకిస్థాన్ క్రికెటర్ల (Pakistan cricket team) కోసం ఆ దేశం రంగంలోకి దిగి శిక్షణ ఇస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఇస్లామామాద్: మన క్రికెటర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ..ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంసిద్ధులవుతుంటారు. కానీ పాకిస్థాన్ క్రికెటర్లు (Pakistan cricket team) ఆర్మీ(Pak Army) స్టైల్ ప్రాక్టీస్ చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. రాళ్లు మోస్తూ.. గుట్టలు ఎక్కుతూ .. స్నైపర్ షూటింగ్ చేస్తూ.. భుజాలపై ఒకరిని ఎత్తుకొని పరిగెత్తుతూ.. సాధన చేస్తున్నారు. ఇదంతా ఆ దేశ సైనికుల పర్యవేక్షణలో సాగుతోంది. ఈ కొత్తరకం శిక్షణ దృశ్యాలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా స్పందిస్తున్నారు. వారు క్రికెట్లో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటున్నారా..? లేక ఏ రహస్య మిషన్ కోసమైనా సిద్ధం అవుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్కు, ఈ షూటింగ్కు సంబంధం ఏంటని కామెంట్లు పెడుతున్నారు. ఆ గుట్ట ప్రాంతంలో జారిపడితే గాయాలు కావా..? అని అడుగుతున్నారు.
క్రికెటర్లకు సైన్యంతో శిక్షణ ఇప్పిస్తామని ఇటీవల పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నక్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల పీఎస్ఎల్ టోర్నీలో భాగంగా కొన్ని మ్యాచ్లను ఆయన వీక్షించగా.. పాక్ ఆటగాళ్లు ఒక్క బంతిని కూడా స్టాండ్స్లోకి తరలించలేకపోయారు. దాంతో అసహనానికి గురైన ఆయన.. కెప్టెన్ బాబర్ అజామ్ నేతృత్వంలో జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపారు.
నా కుమారుడే అలాంటి తప్పు చేసినా క్షమించను..: పాక్ క్రికెట్ దిగ్గజం
ప్రస్తుతం వీరంతా కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్నెస్ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో.. షహీన్ అఫ్రీదిని తప్పించి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి బాబర్ అజామ్కు అప్పగించారు. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం