IPL 2024: ఆర్సీబీకి కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమాని పోస్టు.. హర్భజన్ కౌంటర్
పాకిస్థాన్ క్రికెటర్లకు ఐపీఎల్లో (IPL) ఆడే అవకాశం లేదు. అయినా, కొందరు అభిమానులు మాత్రం తమ దేశ క్రికెటర్లు భారత స్టార్లతో కలిసి ఆడితే చూడాలని ఉందని కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్కు (IPL) భారత్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక దాయాది పాకిస్థాన్లో అయితే.. ఈ మెగా టోర్నీని ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. అక్కడి లీగ్లతో సమానంగా ఈ టోర్నీని వీక్షిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో బయటపెట్టాడు. పాక్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడితే చూడాలనుందని పేర్కొన్నాడు.
ఆర్సీబీకి విరాట్ కోహ్లీతోపాటు (Virat Kohli) బాబర్ అజామ్ ఆడితే చూడాలని ఉందని అతడు ఎక్స్లో పోస్టు పెట్టాడు. అంతటితో ఆగలేదు ఆ అభిమాని. షాహిన్ అఫ్రిదీ, బుమ్రా కలిసి ముంబయి ఇండియన్స్కు ఆడాలని.. ధోనీ సీఎస్కే జట్టులో రిజ్వాన్ ఉంటే బాగుంటుందని ఇలా తన చిట్టాను వివరించాడు. ఇది భారత్, పాక్ క్రికెట్ అభిమానుల కల అంటూ ఆయా జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలను పంచుకున్నాడు. దీనిపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు. మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్’’ అంటూ పాక్ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
తొలి సీజన్లో పాక్ ప్లేయర్లు కూడా ఐపీఎల్లో ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాయాది దేశం ఆటగాళ్లపై ఈ టోర్నీలో ఆడకుండా నిషేధం విధించారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!