Hyderabad Vs Punjab: వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో హైదరాబాద్ రెండో స్థానంతో ప్లేఆఫ్స్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్లో కోల్కతాను ఢీకొట్టనుంది. లీగ్ స్టేజ్లో ఎస్ఆర్హెచ్ తన చివరి మ్యాచ్లో పంజాబ్ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్ను 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. అభిషేక్ శర్మ (66: 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు) వీరవిహారం చేశాడు. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ అభిషేక్పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ సీజన్లో అతడు 13 మ్యాచుల్లో 209 స్ట్రైక్రేట్తో 467 పరుగులు చేశాడు. తనను భయపెట్టిన బ్యాటర్లలో ఇతడొకరని.. ఎప్పుడూ బౌలింగ్ చేయాలని కోరుకోనని కమిన్స్ వ్యాఖ్యానించాడు.
‘‘ఉప్పల్ వేదికగా గత ఏడు మ్యాచుల్లో మేం ఆరింట్లో విజయం సాధించాం. సొంతమైదానంలో అభిమానులను అలరించామని అనుకుంటున్నాం. జట్టులోకి చాలా మంది యువ క్రికెటర్లు వచ్చి సత్తా చాటారు. నాణ్యమైన క్రికెట్ ఆడటంతోనే ఇది సాధ్యమైంది. కుర్రాళ్లలో గెలవాలనే కసి ఎక్కువుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు. నేనెప్పుడూ అతడికి బౌలింగ్ చేయాలని కోరుకోను. స్వేచ్ఛగా ఆడే అతడికి ఎదురుగా బౌలింగ్ చేయడం చాలా కష్టం. కేవలం పేసర్లనే కాకుండా స్పిన్నూ అలవోకగా ఆడేస్తాడు. మరో యువ ప్లేయర్ నితీశ్ రెడ్డి క్లాస్ ఆటగాడు. అతడి వయసు కంటే మానసికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి. టాప్ ఆర్డర్కు సరిగ్గా సరిపోతాడు. మాకు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో తెలుసు. అందుకు తగ్గట్టుగానే ప్రదర్శన చేసి ఫలితం రాబట్టగలిగాం’’ అని కమిన్స్ తెలిపాడు.
ఓవర్సీస్ ప్లేయర్లు ఒక్కరే ఉన్నా..: జితేశ్
‘‘మా కుర్రాళ్లు చాలా అద్భుతంగా పోరాడారు. ఆటను ఆస్వాదించగలిగాం. మా జట్టులో విదేశీ ప్లేయర్ల జాబితాలో ఒక్కడే ఉన్నాడు. మిగతా వారు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయినా, సన్రైజర్స్కు గట్టి పోటీనిచ్చాం. ఎన్నిసార్లు చర్చించుకున్నా మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోతే అవన్నీ వృథానే అవుతాయి. పిచ్ను బట్టి మేం ఆడేందుకు ప్రయత్నించాం. బ్యాటింగ్లో సఫలీకృతులైనప్పటికీ.. బౌలింగ్లో కాస్త వెనుకబడ్డాం’’ అని పంజాబ్ కెప్టెన్ జితేశ్ శర్మ వ్యాఖ్యానించాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- హైదరాబాద్ అత్యధిక లక్ష్య ఛేదనలో ఇది రెండో స్కోరు. గతేడాది (2023) రాజస్థాన్పై 215 పరుగుల టార్గెట్ను ఛేదించింది. ఇప్పుడు కూడా పంజాబ్పై అవే పరుగులను పూర్తి చేసి విజయం సాధించింది.
- ఒకే ఐపీఎల్ సీజన్లో 200+ స్కోర్లను హైదరాబాద్ ఆరుసార్లు చేసింది. ఇదే సీజన్లో కేకేఆర్ 6, బెంగళూరు కూడా ఆరేసి సార్లు సాధించాయి. 200+ స్కోర్లను డిఫెండ్ చేయలేక ఓటమి చవిచూడటం పంజాబ్కు ఇది నాలుగోసారి. ఆర్సీబీ (5), సీఎస్కే (5), కేకేఆర్ (4) ఈ జాబితాలో ఉన్నాయి.
- టీ20 లీగుల్లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు నమోదైన రెండో టోర్నీ ఐపీఎల్ 2024 సీజన్. ఇప్పటి వరకు 41సార్లు నమోదు కాగా.. టీ20 బ్లాస్ట్ 2023 ఎడిషన్లో 42 సార్లు ఆయా జట్లు 200+ స్కోర్లను చేశాయి.
- ఒకే సీజన్లో హైదరాబాద్ తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన ముగ్గురు బ్యాటర్లు అభిషేక్ శర్మ 41, హెన్రిచ్ క్లాసెన్ 33, ట్రావిస్ హెడ్ 31 సిక్స్లు కొట్టారు. ఒక టీ20 సిరీస్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ (160) నిలిచింది.
- ఒకే సీజన్లో పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈసారి అతడు 24 వికెట్లు తీశాడు. ఆండ్రూ టై (2018) కూడా పంజాబ్ తరఫున సరిగ్గా 24 వికెట్లే పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు