Pro Kabaddi League: కూతపెడితే కోట్ల రూపాయలు...
కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది.
కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు మ్యాచ్లు ఆడి అతి స్వల్ప మ్యాచ్ఫీజులు తీసుకున్న ఆటగాళ్లు ఇప్పుడు కోట్లు చూస్తున్నారు. తాజాగా లీగ్ వేలంలో ఆటగాళ్లను జట్లు కోట్లు వెచ్చించి కొనుక్కున్నాయి. కొంతమందికి ఇచ్చిన మొత్తం ఈ ఏడాది ఐపీఎల్లో చాలామంది క్రికెటర్ల కంటే ఎక్కువే!
పవన్ జాక్పాట్
పవన్ సెహ్రావత్ (Pawan Sehrawat) అయితే వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. అతడిని తెలుగు టైటాన్స్ జట్టు ఏకంగా రూ.2.60 కోట్లు పెట్టి దక్కించుకుంది. కోట్లు గడించడం ఈ కుర్రాడికిదేం కొత్త కాదు. 2022 సీజన్లో తమిళ్ తలైవాస్ రూ.2.26 కోట్లతో పవన్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ తెలుగు టైటాన్స్ (Telugu Titans) ఈ స్టార్ను దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్లో ఒక ఆటగాడిపై ఇంత మొత్తాన్ని వెచ్చించడం ఇదే తొలిసారి. మహ్మద్ రెజాకు (ఇరాన్) భారీ రేటు పలికింది. రూ.2.35 కోట్లు పెట్టి పుణెరి పల్టాన్ అతడిని సొంతం చేసుకుంది. ఇంత మొత్తం పెట్టిన తొలి విదేశీ ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. మణిందర్ సింగ్ (రూ.2.12 కోట్లు, బెంగాల్ వారియర్స్), ఫజల్ (రూ.1.60 కోట్లు, గుజరాత్ టైటాన్స్), సిద్ధార్థ్ దేశాయ్ (రూ.కోటి, హరియాణా స్టీలర్స్) ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా పెద్దదే అవుతుంది.
జీవితాలే మారిపోయాయ్
ఒకప్పుడు చిన్న ఉద్యోగం దొరికితే చాలు.. ఏదోలా జీవితాన్ని గడిపేయచ్చు అని సర్టిఫికెట్లు పట్టుకుని తిరిగిన ఆటగాళ్లు ఇప్పుడు రాజాల్లా బతుకుతున్నారు. క్రికెటర్ల మాదిరే ఒక్క సీజన్ ఆడి కోట్లు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోయినా.. దేశానికి ఆడకపోయినా కేవలం లీగ్లు ఆడి జీవితంలో సెటిల్ అయితున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈ ఆట నుంచి ఏమీ రాకపోయినా ప్రేమతో మాత్రమే ఎక్కువమంది కొనసాగేవాళ్లు. దేశానికి ఆడినా కూడా ఆ తర్వాత కెరీర్ కొనసాగించలేక బతుకుదెరువు కోసం ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయేవాళ్లు. వాళ్ల ఇంట్లో గెలిచిన కప్పులు, ప్రోత్సాహక సర్టిఫికెట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క సీజన్లో అవకాశం దొరికితే చాలు అన్నట్లు ఆటగాళ్లు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే బాగా స్థిరపడిన ఆటగాళ్లను చూసి కొత్తవాళ్లు కూడా స్ఫూర్తి పొంది కబడ్డీలోకి వస్తున్నారు. ఇదో శుభపరిణామం. పొలాల్లో పని చేసుకునే కాశీలింగ్.. ఇంట్లో ఆర్థిక సమస్యలతో బయట చిన్న చిన్న పనులు చేసిన రిషాంక్ దేవడిగ.. ఆర్థిక ఇబ్బందులతో చదువు వదలిపెట్టిన దీపక్.. అర్జున అవార్డు దక్కినా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న అనూప్ కుమార్ ప్రొ కబడ్డీ ద్వారా మళ్లీ కొత్త జీవితాన్ని పొందినవాళ్లే. ఈ లిస్టు ఇంకా పెద్దదే ఉంది. ఫ్రాంఛైజీ క్రికెట్ భారత క్రికెట్పై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. మారుమూల గ్రామాల క్రికెటర్లు కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు కేపీఎల్ కూడా అంతటి ప్రభావమే చూపిస్తోంది. కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. కబడ్డీని బతికిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్