Pro Kabaddi League: కూతపెడితే కోట్ల రూపాయలు...
కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది.
కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు మ్యాచ్లు ఆడి అతి స్వల్ప మ్యాచ్ఫీజులు తీసుకున్న ఆటగాళ్లు ఇప్పుడు కోట్లు చూస్తున్నారు. తాజాగా లీగ్ వేలంలో ఆటగాళ్లను జట్లు కోట్లు వెచ్చించి కొనుక్కున్నాయి. కొంతమందికి ఇచ్చిన మొత్తం ఈ ఏడాది ఐపీఎల్లో చాలామంది క్రికెటర్ల కంటే ఎక్కువే!
పవన్ జాక్పాట్
పవన్ సెహ్రావత్ (Pawan Sehrawat) అయితే వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. అతడిని తెలుగు టైటాన్స్ జట్టు ఏకంగా రూ.2.60 కోట్లు పెట్టి దక్కించుకుంది. కోట్లు గడించడం ఈ కుర్రాడికిదేం కొత్త కాదు. 2022 సీజన్లో తమిళ్ తలైవాస్ రూ.2.26 కోట్లతో పవన్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ తెలుగు టైటాన్స్ (Telugu Titans) ఈ స్టార్ను దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్లో ఒక ఆటగాడిపై ఇంత మొత్తాన్ని వెచ్చించడం ఇదే తొలిసారి. మహ్మద్ రెజాకు (ఇరాన్) భారీ రేటు పలికింది. రూ.2.35 కోట్లు పెట్టి పుణెరి పల్టాన్ అతడిని సొంతం చేసుకుంది. ఇంత మొత్తం పెట్టిన తొలి విదేశీ ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. మణిందర్ సింగ్ (రూ.2.12 కోట్లు, బెంగాల్ వారియర్స్), ఫజల్ (రూ.1.60 కోట్లు, గుజరాత్ టైటాన్స్), సిద్ధార్థ్ దేశాయ్ (రూ.కోటి, హరియాణా స్టీలర్స్) ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా పెద్దదే అవుతుంది.
జీవితాలే మారిపోయాయ్
ఒకప్పుడు చిన్న ఉద్యోగం దొరికితే చాలు.. ఏదోలా జీవితాన్ని గడిపేయచ్చు అని సర్టిఫికెట్లు పట్టుకుని తిరిగిన ఆటగాళ్లు ఇప్పుడు రాజాల్లా బతుకుతున్నారు. క్రికెటర్ల మాదిరే ఒక్క సీజన్ ఆడి కోట్లు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోయినా.. దేశానికి ఆడకపోయినా కేవలం లీగ్లు ఆడి జీవితంలో సెటిల్ అయితున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈ ఆట నుంచి ఏమీ రాకపోయినా ప్రేమతో మాత్రమే ఎక్కువమంది కొనసాగేవాళ్లు. దేశానికి ఆడినా కూడా ఆ తర్వాత కెరీర్ కొనసాగించలేక బతుకుదెరువు కోసం ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయేవాళ్లు. వాళ్ల ఇంట్లో గెలిచిన కప్పులు, ప్రోత్సాహక సర్టిఫికెట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క సీజన్లో అవకాశం దొరికితే చాలు అన్నట్లు ఆటగాళ్లు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే బాగా స్థిరపడిన ఆటగాళ్లను చూసి కొత్తవాళ్లు కూడా స్ఫూర్తి పొంది కబడ్డీలోకి వస్తున్నారు. ఇదో శుభపరిణామం. పొలాల్లో పని చేసుకునే కాశీలింగ్.. ఇంట్లో ఆర్థిక సమస్యలతో బయట చిన్న చిన్న పనులు చేసిన రిషాంక్ దేవడిగ.. ఆర్థిక ఇబ్బందులతో చదువు వదలిపెట్టిన దీపక్.. అర్జున అవార్డు దక్కినా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న అనూప్ కుమార్ ప్రొ కబడ్డీ ద్వారా మళ్లీ కొత్త జీవితాన్ని పొందినవాళ్లే. ఈ లిస్టు ఇంకా పెద్దదే ఉంది. ఫ్రాంఛైజీ క్రికెట్ భారత క్రికెట్పై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. మారుమూల గ్రామాల క్రికెటర్లు కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు కేపీఎల్ కూడా అంతటి ప్రభావమే చూపిస్తోంది. కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. కబడ్డీని బతికిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు