Playoffs Race : గుజరాత్ దూసుకెళ్లింది.. మరి మిగతా మూడు జట్లు ఏవి..?
ఐపీఎల్(IPL 2023)లో ప్లేఆఫ్స్ రేసు(Playoffs Race) హోరాహోరీగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లేఆఫ్స్లోకి చేరిన తొలి జట్టుగా నిలిచింది. మిగతా మూడు స్థానాల్లో నిలిచేందుకు ఆయా జట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్ (IPL 2023)లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఆయా జట్ల మధ్య ప్లేఆఫ్స్ రేసు(Playoffs Race) తీవ్రంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచూ, పాయింటూ కీలకమవడంతో.. విజయాలపైనే కాదు జట్లు నెట్ రన్రేట్పై కూడా దృష్టి సారిస్తున్నాయి. దాదాపు అన్ని జట్లు ఇంకా ఒకటో రెండో మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇక సోమవారం సన్రైజర్స్పై విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్ చేరింది. మరి ప్లేఆఫ్స్ చేరే అవకాశమున్న మిగతా జట్లను పరిశీలిస్తే..
మొత్తం పది జట్లు ఆడే ఐపీఎల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్ చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో తొలి రెండు స్థానాలు ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్లో నిలిచే జట్లు టాప్ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి.
గుజరాత్ (Gujarat Titans) : ప్రస్తుతం 18 పాయింట్లు.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు ఒకటి(బెంగళూరుతో)
ఈ సీజన్లోనూ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. ప్లేఆఫ్స్లో చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆడాల్సింది ఇంకో మ్యాచ్ మాత్రమే. ఇక చివరి మ్యాచ్లోనూ ఆర్బీబీపై గెలిస్తే ముంబయి ఆడే మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్-1లోనే కొనసాగుతుంది.
చెన్నై (Chennai Super Kings) : ప్రస్తుతం 15 పాయింట్లు.. ఆడాల్సింది ఒక మ్యాచ్(దిల్లీతో)
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆదివారం కోల్కతాపై ఓడిపోవడం చెన్నైపై ప్రభావం చూపనుంది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు 37 శాతానికి తగ్గాయి. చివరి మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్తో వారి సొంతమైదానంలో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై చెన్నై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబయి, లఖ్నవూ, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది.
ముంబయి(Mumbai Indians) : ప్రస్తుతం 14 పాయింట్లు.. ఆడాల్సిన మ్యాచ్లు రెండు(లఖ్నవూ, సన్రైజర్స్తో)
ముంబయి ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తన తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే 18 పాయింట్లతో క్వాలిఫయర్ 1లోనే ప్లేస్ను దక్కించుకునే అవకాశం ఉంది. రెండూ ఓడిపోతే.. కింద ఉన్న ఇతర జట్లు ముంబయిని అధిగమిస్తాయి. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. ఒక్కటి గెలిచినా.. ముంబయికి అవకాశం ఉంటుంది.
లఖ్నవూ(Lucknow Super Giants) : ప్రస్తుతం పాయింట్లు 13.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు రెండు (ముంబయి, కోల్కతాతో)
ఈ రెండింటిలో లఖ్నవూ ఓడిపోతే.. ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లఖ్నవూ ఒక్క మ్యాచ్లో గెలిచినా.. ఆర్ఆర్, కేకేఆర్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతాయి. ఒకవేళ చెన్నై, ముంబయి చివరి మ్యాచ్ల్లో ఓడి.. లఖ్నవూ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే.. 17 పాయింట్లతో టాప్ 2లో నిలిచే అవకాశం ఉంటుంది.
బెంగళూరు(Royal Challengers Bangalore) : ప్రస్తుతం పాయింట్లు 12 .. ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు రెండు (సన్రైజర్స్, గుజరాత్లతో)
ఆర్సీబీ రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఒక్క మ్యాచ్లోనే గెలిస్తే.. 14 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.
12 పాయింట్లతో ఉన్న పంజాబ్(Punjab Kings) తన తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తనకు కలిసి రావాలి. ఇక పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, దిల్లీ.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. రాజస్థాన్, కోల్కతా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒక వేళ వీటిల్లో గెలిచినా.. ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తాయే తప్ప.. ప్లేఆఫ్స్లో చేరడం దాదాపు కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్