IPL - WPL - PSL: ఐపీఎల్.. డబ్ల్యూపీఎల్ ప్రైజ్మనీతో పోలిస్తే పీఎస్ఎల్కు ఎంతంటే?
ప్రపంచ క్రికెట్లో టీ20లీగులకు భారీ ఆదరణ ఉంది. అయితే, ప్రైజ్మనీ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు ఉదాహరణ ఐపీఎల్, డబ్ల్యూపీఎల్తో పాకిస్థాన్ సూపర్ లీగ్ను పోలిస్తే అర్థమైపోతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ముగిసింది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా పూర్తయింది. మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. పీఎస్ఎల్ ఛాంపియన్గా ఇస్లామాబాద్ యునైటెడ్ అవతరించింది. మూడోసారి ఈ టైటిల్ను ఆ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఏ లీగ్లో ఏ జట్టుకు ఎంత ప్రైజ్మనీ వచ్చిందనే దానిని క్రికెట్ అభిమానులు నెట్టింట శోధించారు.
- ఐపీఎల్లో గతేడాది ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు రూ. 20 కోట్ల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది. రన్నరప్ గుజరాత్ టైటాన్స్ కూడా రూ. 13 కోట్లను దక్కించుకుంది. ప్రపంచ లీగ్ల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్మనీ కావడం విశేషం. మరే ఇతర టోర్నీల్లో ఇంతటి భారీ మొత్తం అందించిన దాఖలాలు లేవు.
- తాజాగా ముగిసిన డబ్ల్యూపీఎల్లోనూ అదిరిపోయే ప్రైజ్మనీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు సొంతం చేసుకుంది. విజేత రూ. 6 కోట్లు అందుకోగా.. ఫైనల్లో ఓడిపోయిన దిల్లీ క్యాపిటల్స్కు రూ. 3 కోట్లు దక్కాయి.
- పీఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకున్న ఇస్లామాబాద్ యునైటెడ్కు 14 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ప్రైజ్మనీగా దక్కింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 4.15 కోట్లు. రన్నరప్గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్కు రూ. 1.65 కోట్లు (5.60 కోట్ల పాకిస్థాన్ రూపాయలు) అందాయి.
- బిగ్బాష్ లీగ్ కంటే పీఎస్ఎల్లోనే ఎక్కువ ప్రైజ్మనీ ఇవ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్లో రూ. 3.66 కోట్లు మాత్రమే విన్నర్కు దక్కుతాయి. ఫైనల్లో ఓడినవారికి సుమారుగా రూ.1.80 కోట్లు అందుతుంది.
- ఐపీఎల్ తర్వాత అత్యధికంగా సౌతాఫ్రికాటీ20 లీగ్లో విజేతకు రూ.15 కోట్లు ఇస్తుండగా, రన్నరప్గా నిలిచిన టీమ్కు రూ.7.5 కోట్లు ఇస్తారు. వెస్టిండీస్లో నిర్వహించే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో అయితే విజేతకు రూ.8 కోట్లు అందుతాయి. ఫైనల్లో ఓడిపోయిన టీమ్కి రూ.5.5 కోట్లు ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్