Punjab Vs Rajasthan: అతడు మా వైస్ కెప్టెన్ కాదు.. సోషల్ మీడియా కామెంట్లపై పంజాబ్ క్లారిటీ
కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా రాజస్థాన్తో మ్యాచ్లో పాల్గొనలేదు. దీంతో కరన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్తో ముల్లాన్పుర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్వల్ప గాయం కారణంగా ఆడలేదు. అతడికి బదులు జట్టును సామ్ కరన్ (Sam Curran) నడిపించాడు. అదేంటి జితేశ్ శర్మ (Jitesh Sharma) వైస్ కెప్టెన్ కదా.. టోర్నీ ప్రారంభ వేడుకలకు అతడే హాజరయ్యాడనే అనుమానం రావడం సహజమే. ఐపీఎల్ కప్ను ఆవిష్కరించినప్పుడు ఇతర జట్ల సారథులతో కలిసి ఫొటోషూట్లో కూడా పాల్గొన్నాడు. మరి అతడిని కాదని కరన్ను రాజస్థాన్తో మ్యాచ్లో టాస్కు పంపడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. చివరికి పంజాబ్ మేనేజ్మెంట్ స్పందించింది. కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు.
‘‘జితేశ్ శర్మ అధికారికంగా వైస్ కెప్టెన్ కాదు. అయితే, కెప్టెన్ల సెమినార్, టోర్నీ ప్రారంభ సమావేశాలకు అతడు హాజరు కావడంతో అంతా అలా భావించారు. కానీ, సామ్ కరన్ గతేడాది కూడా జట్టును నడిపించిన సందర్భాలున్నాయి. అతడే ధావన్కు డిప్యూటీ. టోర్నీ ప్రారంభ కార్యక్రమం సమయానికి కరన్ యూకే నుంచి రావడం ఆలస్యమైంది. కొన్ని ట్రైనింగ్ సెషన్స్కు హాజరుకావాలని భావించాడు. అందుకే అతడిని చెన్నైకి పంపించలేదు. కార్యక్రమానికి జట్టు నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం వహించాలని ఐపీఎల్ సభ్యుడి సూచనల మేరకు జితేశ్ను పంపించాం. అంతేకానీ, అతడు వైస్ కెప్టెన్ అని మేం అనుకోలేదు. మా వరకైతే ఆ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. ధావన్ గైర్హాజరీలో సామ్ కరన్ జట్టును నడిపిస్తాడు. ధావన్ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. అయితే మరో వారం రోజులపాటు మైదానంలోకి దిగడం కష్టమేనని అనిపిస్తోంది.’’ అని బంగర్ తెలిపాడు.
పిచ్ చాలా మందకొడిగా ఉంది: పంజాబ్ కెప్టెన్ కరన్
‘‘మాకు బ్యాటింగ్లో మంచి ఆరంభం లభించలేదు. బౌలింగ్లో సరిగ్గా ముగించలేకపోయాం. పిచ్ చాలా మందకొడిగా ఉంది. మా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల కారణంగానే కనీసం పోరాడే స్కోరు చేయగలిగాం. అత్యుత్తమంగానే బౌలింగ్ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయాం. స్వల్పతేడాతో ఓటమిపాలయ్యాం. మా ప్రణాళికలకు అనుగుణంగానే గేమ్ ఆడాం. తప్పకుండా ఇదే ఆత్మవిశ్వాసంతో వచ్చే మ్యాచ్లో పుంజుకుంటాం. కొత్త వేదికపై త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకోగలిగాం. ఈ మ్యాచ్తోపాటు గత మ్యాచ్ను స్వల్ప తేడాతో కోల్పోయాం. వాటన్నింటినీ పక్కన పెట్టి తీవ్రంగా సాధన చేస్తాం’’ అని కరన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి