Rahul Dravid: న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
మరో రెండు రోజుల్లో భారత జట్టు ప్రపంచ కప్ సంగ్రామంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వార్మప్లో సత్తా చాటిన ఆటగాళ్లు సమరోత్సాహంతో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) భారత్ లీగ్ స్టేజ్లో మూడు మ్యాచ్లను న్యూయార్క్లోని నాసౌవ్ కౌంటీ స్టేడియం వేదికగా.. మరో మ్యాచ్ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ కూడా నాసౌవ్లోనే జరిగింది. ఇందులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అయితే, ఇక్కడ ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెచ్చరించాడు.
‘‘మైదానం చాలా సాఫ్ట్గా ఉంది. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై దృష్టిసారించాలి. స్పాంజీలా అనిపించింది. మైదానం కింద ఎక్కువగా ఇసుకతో నింపినట్లు అనిపిస్తోంది. రిథమ్ను అందుకోవడంపై శ్రమించాలి. వార్మప్ మ్యాచ్లో మా ఆటగాళ్లు రాణించారు. బౌలింగ్లోనూ బంగ్లాపై ఆధిపత్యం ప్రదర్శించారు. పిచ్ ఎలా ఉందనేదానిపై ఓ అవగాహన వచ్చింది. వార్మప్ను చూసేందుకూ అభిమానులు రావడం మరింత సంతోషంగా అనిపించింది’’ అని ద్రవిడ్ తెలిపాడు.
యశస్వి బౌలింగ్ కూడా చేయొచ్చు: ఇర్ఫాన్
యశస్వి జైస్వాల్ను కేవలం బ్యాటింగ్ కోసమే ఎంపిక చేయలేదని.. అతడితో బౌలింగ్ చేయించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పుడున్న టీమ్లో రోహిత్, విరాట్, సూర్య బౌలింగ్ చేయరు. రెండు కాంబినేషన్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అందులో ఒకటి.. ఆరుగురు బౌలర్లతో ఆడటం. అక్షర్ పటేల్ను తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ బలంగా మారుతుంది. నలుగురు ప్రధాన బౌలర్లతోపాటు శివమ్ దూబె, హార్దిక్ పాండ్య ఎలానూ బంతులేస్తారు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ.. ఇప్పటి వరకు మ్యాచుల్లో బౌలింగ్ చేయని మరొక ఆటగాడూ ఉన్నాడు. అతడు యశస్వి జైస్వాల్. తప్పకుండా అతడితో ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించే ఛాన్స్ ఉంది. హార్దిక్ నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేస్తే మాత్రం భారత్కు బౌలింగ్ సమస్య తీరినట్లే’’ అని పఠాన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు