Rahul Dravid : ద్వైపాక్షిక సిరీస్ల్లో ఘనం.. ఐసీసీ టోర్నీల్లో పేలవం : కోచ్గా ద్రవిడ్ రిపోర్ట్ కార్డిదే
వన్డే ప్రపంచకప్ అనంతరం హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీకాలం ముగియనుంది. మరి ఈ రెండేళ్లలో టీమ్ఇండియాను అతడు ఎలా నడిపించాడో పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్ : ఏ జట్టులోనైనా కోచ్ పాత్ర చాలా కీలకం. టీమ్ విజయపథాన నడిచినా.. ఓటమిబాట పట్టినా అందులో అతడి బాధ్యత తప్పక ఉంటుంది. జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ.. తనదైన వ్యూహాలతో ముందుండి నడిపించడమే కోచ్ ప్రధాన కర్తవ్యం. టీమ్ఇండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. రవిశాస్త్రి అనంతరం ఈ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. చాలా ద్వైపాక్షిక సిరీస్ల్లో భారత్ను విజయవంతంగా నడిపించినప్పటికీ.. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) ట్రోఫీ కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. ద్రవిడ్ నేతృత్వంలో.. టీమ్ఇండియా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ 2022, WTC Final 2023లో ఘోర ఓటమిని చవిచూసింది.
మరికొన్ని రోజుల్లో ఆసియాకప్(Asia Cup 2023 ), ఆ తర్వాత స్వదేశం వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ మెగా టోర్నీ(ODI world cup 2023) జరగనుండటంతో.. టీమ్ఇండియా సుదీర్ణ నిరీక్షణకు ద్రవిడ్ తెరదించుతాడో చూడాలి. ఇక ప్రపంచకప్ కోసం పటిష్టమైన టీమ్ను సిద్ధం చేసే కమ్రంలో జట్టులో ఇటీవల ద్రవిడ్ ప్రయోగాలు చేపట్టినా.. అవి మిశ్రమ ఫలితాలనే అందించాయి. మరి మెగా టోర్నీ కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్ కోసం భారత జట్టు.. ‘ఈ నాలుగే’ కీలకం!
నవంబర్ 2021 తర్వాత రవిశాస్త్రి నుంచి కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ద్రవిడ్ టీమ్ఇండియాను ఎలా నడిపించాడో పరిశీలిస్తే..
- ద్రవిడ్ కోచ్గా ప్రయాణాన్ని ఘనంగానే ప్రారంభించాడు. డిసెంబర్ 2021లో న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయగా.. ఒక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది.
- ఆ తర్వాత టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. జనవరి 2022లో భారత్ వన్డే సిరీస్, టెస్టు సిరీస్ను కోల్పోయింది.
- టీమ్ఇండియా విజయాల పరంపర ఆ తర్వాత కొనసాగింది. 2022 ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్, శ్రీలంకలపై సిరీస్లను క్లీన్స్వీప్ చేసింది.
- అదే ఏడాది జూన్లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 2-2తో సమం చేసింది. ఐర్లాండ్పై టీ20 సిరీస్ను నెగ్గింది.
- ఆ తర్వాత ఇంగ్లాండ్తో టీ20 సిరీస్, వన్డే సిరీస్ నెగ్గగా.. రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టు మ్యాచ్ను కోల్పోయింది. 2022 జులై-ఆగస్టులో విండీస్పై టీ20, వన్డే సిరీస్లను నెగ్గింది.
- ఇక 2022 ఆగస్టు-సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్లో సూపర్ 4 దశ నుంచి నిష్క్రమించింది.
- ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై విజయాలు కొనసాగించింది
- ఇక అక్టోబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయింది.
- 2022 చివరి నెలలో బంగ్లాదేశ్లో వన్డే సిరీస్ను కోల్పోగా.. టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
- ఇక ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకపై.. ఆ తర్వాత న్యూజిలాండ్పై వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంది.
- ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను కోల్పోగా.. టెస్టు సిరీస్ను చేజక్కించుకుంది.
- జూన్లో జరిగిన WTC Finalలో ఘోర ఓటమిపాలైంది.
- ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన చేపట్టగా.. టెస్టు, వన్డే సిరీస్లను చేజిక్కించుకోగా.. పొట్టి ఫార్మాట్లో ఓటమిపాలైంది.
ఆ తర్వాత కొనసాగేనా..?
ఇక ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అనంతరం ద్రవిడ్(Rahul Dravid) రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. మరి ఆ తర్వాత అతడు కొనసాగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. మెగాటోర్నీ ఫలితంపైనే అతడి కొనసాగింపు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్