Rahul Dravid : ద్వైపాక్షిక సిరీస్ల్లో ఘనం.. ఐసీసీ టోర్నీల్లో పేలవం : కోచ్గా ద్రవిడ్ రిపోర్ట్ కార్డిదే
వన్డే ప్రపంచకప్ అనంతరం హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీకాలం ముగియనుంది. మరి ఈ రెండేళ్లలో టీమ్ఇండియాను అతడు ఎలా నడిపించాడో పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్ : ఏ జట్టులోనైనా కోచ్ పాత్ర చాలా కీలకం. టీమ్ విజయపథాన నడిచినా.. ఓటమిబాట పట్టినా అందులో అతడి బాధ్యత తప్పక ఉంటుంది. జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ.. తనదైన వ్యూహాలతో ముందుండి నడిపించడమే కోచ్ ప్రధాన కర్తవ్యం. టీమ్ఇండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. రవిశాస్త్రి అనంతరం ఈ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. చాలా ద్వైపాక్షిక సిరీస్ల్లో భారత్ను విజయవంతంగా నడిపించినప్పటికీ.. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) ట్రోఫీ కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. ద్రవిడ్ నేతృత్వంలో.. టీమ్ఇండియా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ 2022, WTC Final 2023లో ఘోర ఓటమిని చవిచూసింది.
మరికొన్ని రోజుల్లో ఆసియాకప్(Asia Cup 2023 ), ఆ తర్వాత స్వదేశం వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ మెగా టోర్నీ(ODI world cup 2023) జరగనుండటంతో.. టీమ్ఇండియా సుదీర్ణ నిరీక్షణకు ద్రవిడ్ తెరదించుతాడో చూడాలి. ఇక ప్రపంచకప్ కోసం పటిష్టమైన టీమ్ను సిద్ధం చేసే కమ్రంలో జట్టులో ఇటీవల ద్రవిడ్ ప్రయోగాలు చేపట్టినా.. అవి మిశ్రమ ఫలితాలనే అందించాయి. మరి మెగా టోర్నీ కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్ కోసం భారత జట్టు.. ‘ఈ నాలుగే’ కీలకం!
నవంబర్ 2021 తర్వాత రవిశాస్త్రి నుంచి కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ద్రవిడ్ టీమ్ఇండియాను ఎలా నడిపించాడో పరిశీలిస్తే..
- ద్రవిడ్ కోచ్గా ప్రయాణాన్ని ఘనంగానే ప్రారంభించాడు. డిసెంబర్ 2021లో న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయగా.. ఒక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది.
- ఆ తర్వాత టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. జనవరి 2022లో భారత్ వన్డే సిరీస్, టెస్టు సిరీస్ను కోల్పోయింది.
- టీమ్ఇండియా విజయాల పరంపర ఆ తర్వాత కొనసాగింది. 2022 ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్, శ్రీలంకలపై సిరీస్లను క్లీన్స్వీప్ చేసింది.
- అదే ఏడాది జూన్లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 2-2తో సమం చేసింది. ఐర్లాండ్పై టీ20 సిరీస్ను నెగ్గింది.
- ఆ తర్వాత ఇంగ్లాండ్తో టీ20 సిరీస్, వన్డే సిరీస్ నెగ్గగా.. రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టు మ్యాచ్ను కోల్పోయింది. 2022 జులై-ఆగస్టులో విండీస్పై టీ20, వన్డే సిరీస్లను నెగ్గింది.
- ఇక 2022 ఆగస్టు-సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్లో సూపర్ 4 దశ నుంచి నిష్క్రమించింది.
- ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై విజయాలు కొనసాగించింది
- ఇక అక్టోబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో ఇండియా ఓడిపోయింది.
- 2022 చివరి నెలలో బంగ్లాదేశ్లో వన్డే సిరీస్ను కోల్పోగా.. టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
- ఇక ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకపై.. ఆ తర్వాత న్యూజిలాండ్పై వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంది.
- ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను కోల్పోగా.. టెస్టు సిరీస్ను చేజక్కించుకుంది.
- జూన్లో జరిగిన WTC Finalలో ఘోర ఓటమిపాలైంది.
- ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన చేపట్టగా.. టెస్టు, వన్డే సిరీస్లను చేజిక్కించుకోగా.. పొట్టి ఫార్మాట్లో ఓటమిపాలైంది.
ఆ తర్వాత కొనసాగేనా..?
ఇక ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ అనంతరం ద్రవిడ్(Rahul Dravid) రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. మరి ఆ తర్వాత అతడు కొనసాగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. మెగాటోర్నీ ఫలితంపైనే అతడి కొనసాగింపు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు