IPL 2024: ఆడమ్ జంపా స్థానంలో కొత్త కుర్రాడికి రాజస్థాన్ అవకాశం
ఐపీఎల్ (IPL) ప్రారంభోత్సవ వేళ ఆటగాళ్లు దూరం కావడంతో పలు ఫ్రాంచైజీలు కొత్త వారిని తమ జట్టులోకి తీసుకుంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గత మినీ వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా (Adam Jampa) సేవలను రాజస్థాన్ రాయల్స్ కోల్పోయింది. పనిఒత్తిడి కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్కు (IPL 2024) అందుబాటులో ఉండటం లేదని జంపా సమాచారం ఇచ్చాడు. జూన్లో టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో జంపా ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో భారత యువ ఆటగాడికి రాజస్థాన్ జట్టు అవకాశం కల్పించింది. 42వసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్గా ముంబయి నిలవడంలో కీలకపాత్ర పోషించిన తనుష్ కొటియన్ను రాజస్థాన్ తీసుకుంది. అతడి బేస్ ప్రైస్ రూ.20 లక్షలకు ఆర్ఆర్ దక్కించుకుంది.
లోయర్ ఆర్డర్లో పరుగులు చేయడంతోపాటు ఆఫ్ స్పిన్నర్ అయిన కొటియన్ గతేడాదే ఐపీఎల్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన ప్రదర్శనతో కీలక పాత్ర పోషించినప్పటికీ.. అతడి బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు వచ్చాయి. దీంతో ఆ సీజన్లో ఆడేందుకు వీలుకాలేదు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించుకుని ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. మొత్తం 502 పరుగులు చేయడంతోపాటు 29 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్లో బరోడాపై 120, సెమీస్లో తమిళనాడుపై 89* పరుగులు చేశాడు. ఇవన్నీ జట్టు కష్టాల్లో పడినప్పుడు (రెండో ఇన్నింగ్స్లోనే) చేసినవే కావడం గమనార్హం.
రాబిన్ మింజ్ స్థానంలో బీఆర్ శరత్
ఇటీవల ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదానికి గురైన రాబిన్ మింజ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ మరొక ఆటగాడిని తీసుకుంది. కర్ణాటకకు చెందిన వికెట్ కీపర్ - బ్యాటర్ బీఆర్ శరత్ను ఎంపిక చేసుకుంది. కర్ణాటక తరఫున శరత్ 28 టీ20లు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 43 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. గుజరాత్ అతడిని రూ.20 లక్షల బేస్ ప్రైస్పై సొంతం చేసుకుంది. రాబిన్ మింజ్ను గత మినీ వేలంలో గుజరాత్ రూ.3.60 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఝార్ఖండ్కు చెందిన రాబిన్ తండ్రి విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం