Rajasthan Vs Bengaluru: ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆర్సీబీని.. ఓటములతో డీలాపడిన రాజస్థాన్ కీలక మ్యాచ్లో ఏమాత్రం అడ్డుకోగలదో చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఆఖరి మ్యాచ్లో అద్భుతంగా గెలిచి నాకౌట్కు చేరిన బెంగళూరు ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ సమరోత్సాహంతో ఉంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించినప్పటికీ గత ఐదింట్లో నాలుగు ఓడిన రాజస్థాన్ పరిస్థితి విభిన్నంగా ఉంది. ఐపీఎల్ 17వ సీజన్ ‘ఎలిమినేటర్’ మ్యాచ్ బుధవారం జరగనుంది. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ను కొనసాగించి బెంగళూరును ముందుకు తీసుకెళ్తాడా? సంజూ నాయకత్వంలోని రాజస్థాన్ ‘రాయల్’గా వెళ్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
కీలక అంశాలు ఇవే..
- తొలి 9 మ్యాచుల్లో 8 విజయం సాధించిన రాజస్థాన్.. తన చివరి ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
- బెంగళూరు గత ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మొదటి 8లో కేవలం రెండు విజయాలనే నమోదు చేసిన ఈ జట్టు.. ప్లేఆఫ్స్కు చేరుకోవడమే మ్యాజిక్.
- రాజస్థాన్ - బెంగళూరు జట్లు ముఖాముఖిగా 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 15 మ్యాచుల్లో గెలవగా.. ఆర్ఆర్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
- ఈ సీజన్లో అత్యధిక జట్ల స్కోర్లలో బెంగళూరు స్థానం నాలుగోది. లీగ్ స్టేజ్లో దిల్లీపై 266/7 స్కోరు చేసింది. ఈ ఎడిషన్లో కోల్కతాపై రాజస్థాన్ 224/8 స్కోరును చేసింది. ఇదే ఆ జట్టుకు అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
- బెంగళూరు జట్టులో విరాట్, డుప్లెసిస్, విల్ జాక్స్, మ్యాక్స్వెల్, డీకే, గ్రీన్ అత్యంత డేంజరస్ బ్యాటర్లు. సిరాజ్, యశ్ దయాళ్, కర్ణ్ శర్మ, గ్రీన్, స్వప్నిల్ సింగ్ నాణ్యమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు.
- రాజస్థాన్కు కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, హెట్మయెర్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్ బ్యాటింగ్లో అత్యంత కీలకం. బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మతోపాటు టాప్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అశ్విన్ రాణిస్తే ఆర్ఆర్కు తిరుగుండదు.
- ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ (708) అందరికంటే ముందున్నాడు. ఈ సీజన్లో మరో 267 పరుగులు చేస్తే.. తన అత్యధిక పరుగుల రికార్డును (974) అధిగమించే అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే ఈ మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలి.
- పర్పుల్ క్యాప్ అందుకోవాలంటే యుజ్వేంద్ర చాహల్కే కొద్దిపాటి అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 17 వికెట్లతో కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ (24) అందరికంటే ముందున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే.. ఇంకా మ్యాచ్లు ఆడేందుకు ఛాన్స్ ఉంది.
రాజస్థాన్ జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మయెర్, అశ్విన్, ధ్రువ్ జురెల్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్
బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లామ్రోర్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, విజయ్ కుమార్, సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?